అన్వేషించండి

Lokesh New Trend : హామీల్ని శిలాఫలకాలుగా పెట్టిస్తున్న లోకేష్ - నమ్మకం కలిగించడానికా ? కొత్త ట్రెండా ?

పాదయాత్ర మైలురాళ్లపై లోకేష్ కొత్త వ్యూహంతాను ఇస్తున్న హామీలతో శిలాఫలకాలుప్రతి వంద కి.మీకి ఓ శిలాఫలకంఅధికారంలోకి రాగనే నెరవేరుస్తానని హామీలోకేష్ కొత్త ప్రయత్నం ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోందా ?

 

Lokesh New Trend :  తెలుగుదేశం పార్టీ యువనేత  నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నరు.  పాదయాత్ర గురువారం 39వ రోజు 500 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. ఆ సందర్బంగా తాము అధికారంలో వచ్చిన వంద రోజుల్లో అన్నమయ్య జిల్లా సి టీ ఎం వద్ద టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. గత డిసెంబర్ నెల 27వ తేదీ కుప్పంలో మొదలైన పాదయాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాల గుండా సాగి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం మదనపల్లి నియోజకవర్గం లో ఆడుగుపెట్టిన యాత్ర 39వ రోజు కు చేరింది. వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్న లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల యాత్ర పూర్తి అయిన సందర్బంగా స్థానికులకు ప్రత్యేక హామీలు ఇస్తున్నారు.పా ఎవరు పాదయాత్రలు చేసినా హామీలు ఖాయంగానేఇస్తూంటారు కానీ లోకేష్ మాత్రం హామీలను శిలాఫలకాలపై చెక్కించి తానే ఆవిష్కరిస్తున్నారు. 

హామీలను శిలాఫలకాలపై చెక్కిస్తున్న లోకేష్ 

యువగళం పాదయాత్ర   8వ రోజు న 100 కిలోమీటర్ల మైలు రాయి దాటినప్పుడు గత ఫిబ్రవరి 3వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే యాత్ర 16వ రోజున 200 కిలోమీటర్లు ఆదిగమించినప్పుడు గంగాధర నెల్లూరు వద్ద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఫిబ్రవరి 11వ తేదీన హామీ ఇచ్చారు. తరువాత ఫిబ్రవరి 21వ తేదీన 23 వ రోజున యాత్ర 300 కిలోమీటర్లు దాటినప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద 13 గ్రామాల దాహార్తి తీర్చే నీటి పధకాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఆపై మార్చి 1వ తేదీన 32వ రోజు యాత్ర 400 కిలోమీటర్లు చేరినప్పుడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్ర పురం వద్ద ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక గురువారం యాత్ర 39వ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సి టీ ఎం వద్ద 500 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఆ సందర్బంగా సి టీ ఎం 2 వద్ద టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రతి వంద కిలోమీటర్లు పూర్తి అయిన చోట ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరించి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామనే హామీలను ఇస్తున్నారు.

పాదయాత్రలో హామీలు అమలు చేయరనే అనుమానాలను క్లియర్ చేసే ప్రయత్నం ! 

పాదయాత్ర చేస్తున్న రాజకీయ నేతలకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం సహజం. ప్రతిపక్షంలో ఉన్నందున ఇచ్చేది హామీలే కాహట్టి నేతలంతా తాము అధికారలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తారు.అయితే అవి సాధ్యమవుతాయా లేదా అన్నది  పట్టించుకోలేదు. ప్రస్తుత సీఎం జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారని వాటిని పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. వివిధ  సంఘాలు ఆందోళనలు చేసినప్పుడు సీఎం జగన్ తమకు పాదయాత్రలో హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపమలు చేస్తూ ఉంటాయి. తాజాగా అగ్రిగోల్డ్ బాధితులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే మేనిఫెస్టోను  మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటుంది. మొత్తం హామీలను నెరవేర్చామని చెబుతూ ఉంటుంది. కానీ పాదయాత్రలో ఇచ్చిన హామీ సంగతేమిటని ఎక్కువ మంది ప్రశ్నిస్తారు. తాను అలా చేయనని చెప్పేందుకు లోకేష్ శిలాఫలాకాలను చెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

అధికారంలోకి వచ్చాక మాట మార్చడానికి అవకాశం లేకుండా శిలాఫలకాలు ! 

నారా లోకేష్ వ్యూహాత్మకంగానే శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. సుదీర్ఘంగా ఆ సమస్యల కోసం ప్రజలు పోరాడుతున్నారు. నిజానికి ఆ సమస్యలు పరిష్కారం అయితే ప్రజల ఆదాయం కూడా పెరుగుతుంది. రైతుల సమస్యలు తీరుతాయి. లోకేష్ ఆయా ప్రాంతా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే హామీలనే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఖచ్చితంగా చేయగలిగే హామీలనే ఇస్తున్నారు. శిలాఫలకాలపై పెడుతున్నారని టీడీపీ నేతలంటున్నారు. ప్రజల కోరిక మేరకు ఇస్తున్న హామీలను ప్రభుత్వం ఇప్పుడే నెరవేరిస్తే.. క్రెడిట్ కూడా లోకేష్ కు వస్తుందని.. నేరవేర్చకపోతే.. లోకేష్ నెరవేరుస్తాడనే భరోసా ఉంటుందని టీడీపీ నేతలంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Embed widget