అన్వేషించండి

Aluru TDP ticket : ఆలూరు టీడీపీ టిక్కెట్‌పై రాని స్పష్టత - కోట్ల సుజాతమ్మకు అవకాశం లభిస్తుందా ?

Andhra News : ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ టిక్కెట్ కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. టిక్కెట్ ఎవరికివ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు.

Kurnool district Aluru TDP ticket Race :  కర్నూలు జిల్లా రాజకీయాలలో ఆ కుటుంబానికి మూడు దశాబ్దాలుగా రాజకీయంగా తిరుగులేదు. ఆ కుటుంబానికి ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ కష్టాలు ఎదురవుతున్నాయా అంటే అవుననే చెప్పాలి... ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది.. టికెట్ కోసం అంతగా శ్రమ పడాల్సిన నేత ఎవరు అనేది స్టోరీలో తెలుసుకుందాం. కర్నూలు జిల్లా రాజకీయాలు కోట్ల కుటుంబం కు ప్రత్యేకమైన స్థానం ఉంది. గత కాలంలో  కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా రాజకీయంలో తిరుగులేకుండా ఉండేవారు. ప్రస్తుతం వారికి టికెట్ కష్టాలు ఎదురవుతున్నాయి. 

కోట్ల కుటుంబానికి ఇంకా ఖరారు కానీ సీట్లు

2019 ఎన్నికల ముందు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆయన భార్య కోట్ల సుజాతమ్మ టిడిపి కండువా కప్పుకున్నారు.  2019 ఎన్నికల్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆయన భార్య కోట్ల సుజాతమ్మ ఆలూరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో బలిలో నిలిచారు. తన సమీప ప్రత్యర్థి వైసిపి పార్టీకి చెందిన గుమ్మనూరు జయరాం చేతిలో ఓటమిని చూశారు. అయినప్పటికీ కోట్ల సుజాతమ్మ ఎక్కడ నిరాశ చెందకుండా ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా కొనసాగుతూ నియోజకవర్గంలోని టిడిపి నేతలకు కార్యకర్తలకు అండగా నిలుస్తూ వచ్చారు.  

ఆలూరుకు కోట్ల సుజాతమ్మను ఫైనల్ చేయని చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేస్తూ నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగింది. వైసిపి అభ్యర్థిగా గెలిచిన గుమ్మనూరు జయరాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే మంత్రి గుమ్మనూరు జయరామ్ ను ఎదుర్కొంటూ ఆలూరు నియోజకవర్గం లో  పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు.  ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 80% పైగా ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు ఇందులో ఆలూరు నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న కోట్ల సుజాతమ్మ పేరు ఇప్పటికీ ప్రకటించకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓకే కుటుంబానికి ఒక టికెట్ అనే పాలసీ ఉండడంతో కోట్ల కుటుంబానికి రెండో టికెట్ దక్కుతుందా లేదా అని మరో గంధన గోళం కూడా నెలకొంది. 
 
ఆలూరు నియోజకవర్గంలో టిడిపి టికెట్ కోసం మరో ఇద్దరు ప్రయత్నాలు 

ఆలూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి గా ఉన్న వైసీపీ నేత గుమ్మనూరు జయరాం ప్రస్తుతం చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి చేరారు. అయితే గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గం టిడిపి టికెట్ కాకుండా గుంతకల్లు టిడిపి టికెట్‌ను  ఆశిస్తూ ఉండడంతో ఆలూరు నియోజకవర్గం లో వైసీపీ పార్టీ నేతలు కూడా ఈ సారి టిడిపికి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టికెట్ సాధించుకుంటే విజయం ఈజీగా సాధించవచ్చు అని ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలానికి చెందిన టిడిపి నేత వైకుంఠం మల్లికార్జున చౌదరి, టిడిపి అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్ర గౌడ్ కూడా  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ఇంకా ఆలూరు నియోజకవర్గం టికెట్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నియోజకవర్గం టిడిపి నేతలు అంతర్మధనంలో  పడ్డారు. 

కోట్ల సుజాతమ్మ వైపు నేతల మొగ్గు 

మెజారిటీ టిడిపి నేతలు కోట్ల సుజాతమ్మకు టికెట్ కేటాయిస్తేనే విజయం సాధిస్తుందని చంద్రబాబు ముందు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది. కోట్ల సుజాతమ్మను కాదని టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ మరో రెండు దశాబ్దాలు పట్టు కోల్పోవాల్సి  ఉంటుందని వారు అధినేత ముందు వెల్లడించినట్లు సమాచారం. దీంతో అధినేత ఆలూరు అభ్యర్థిగా కోట్ల సుజాత అమ్మకు అవకాశం కల్పిస్తారా లేక వేరొకరికి అవకాశం కల్పిస్తారా అన్నది మరొక రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
Tamil Nadu Assembly Elections 2026: విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget