అన్వేషించండి

Konda Surekha: ఎంపీ కోమటిరెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలి, కారణం చెప్పిన కొండా సురేఖ

పార్టీకి నష్టం చేకూర్చేలా చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు కొండా సురేఖ.

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేకూర్చేలా చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం లేకనే ఓడిపోతున్నామని, ఇప్పటికైనా పార్టీ నేతలందరూ కలిసి పనిచేయాలని కొండా సురేఖ అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. సమావేశం అజెండా మీదే మాట్లాడాలని, ఏమైనా వ్యక్తిగత అంశాలు ఉంటే రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించారు. ఎటువంటి వాళ్ళను అయిన క్రమశిక్షణ తప్పితే తీసేస్తారు అనే భయం ఉంటుందని అలా చెప్పానన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న పార్టీలో కనిపించాడు కాబట్టి ఈ వాఖ్యలు చేశానన్నారు. పార్టీ నేతలతో కనిపించకపోతే ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. 

తమ్ముడికి ఓటు వేయమని చెప్పడం వంద శాతం తప్పేనన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేని కలసినప్పుడు తప్పకుండా చెబుతాం అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ కూడా తప్పు చేశారు కాబట్టి సస్పెండ్ చేయాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇద్దరు కలసి హత్ సే హత్ జోడో యాత్ర చేయాలని, రెండు నెలల తర్వాత కూడా పాదయాత్ర చేయాలని కోరినట్లు తెలిపారు. కమిటీల వ్యవహారంలో తనకు భాద కలిగింది అందుకు నా పదవికి రాజీనామా చేశానని కొండా సురేఖ వెల్లడించారు.

కీలకమైన కమిటీలలో అవకాశం దక్కకపోవడంతో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ ఇటీవల రాజీనామా చేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితో ఆమె రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన కంటే జూనియర్లకు స్థానం కల్పించారని ఆమె వ్యాఖ్యానించారు. పీసీసీ కమిటీలో తన పేరు లేకపోవడం అవమానించడమేనని కొండా సురేఖ తెలిపారు.
కొండా సురేఖ వరంగల్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి వరంగల్ ‌లో కీలక నాయకురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి గతంలో ఆమె మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొండా సురేఖ.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆమెకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు కల్పించారు. తాజాగా శనివారం కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ అసంతృప్తికి గురయ్యారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆమె రాజీనామా చేశారు.

తాను 1995 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీగా, ఎమ్మెల్యేగా 4 సార్లు, ఓసారి మంత్రిగా చేశానని, తన భర్త కొండా మురళీ 1988 నుంచి పాలిటిక్స్ లో ఉన్నారని.. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో కొండా సురేఖ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొండా దంపతులకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే పని చేయలేదు. సొంత ఖర్చులతో కూడా నియోజకవర్గాల్లో పనులు చేశాం. కానీ తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు లేదని, కనీసం వరంగల్ జిల్లాకు చెందిన ఒక్క నేత పేరు లేకపోవడం మనస్తాపాన్ని కలిగించిందని ఆ లేఖలో రాశారు. జూనియర్ నేతలను సైతం కమిటీలో అవకాశం కల్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను, ఎమ్మెల్యేగా సైతం ఎన్నిక కాని వారిని నామినేట్ చేసిన కమిటీలో తనను కూడా నామినేట్ చేయడం తనను అవమానించినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: నరైన్‌ శతక గర్జన , కోల్‌కత్తా భారీ స్కోరు
నరైన్‌ శతక గర్జన , కోల్‌కత్తా భారీ స్కోరు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: నరైన్‌ శతక గర్జన , కోల్‌కత్తా భారీ స్కోరు
నరైన్‌ శతక గర్జన , కోల్‌కత్తా భారీ స్కోరు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
KCR Comments: ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు, అందుకే వీరు లిల్లిపుట్‌లు - కేసీఆర్ కామెంట్స్
ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు, అందుకే వీరు లిల్లిపుట్‌లు - కేసీఆర్ కామెంట్స్
Embed widget