అన్వేషించండి

Khammam News: వైరాలో తాజా, మాజీల మధ్య వైరం! అధికార పార్టీ కార్యకర్తలపై కేసులు

Khammam జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో వర్గ పోరు ఉనప్పటికీ వైరాలో మాత్రం వర్గపోరు కాస్త మరింతగా ముదిరింది. తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆధిపత్య పోరు చివరకు అధికార పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు దాకా వెళ్తోంది. ప్రధానంగా 2018 తర్వాత జరిగిన పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు తలనొప్పిగా మారాయి. జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో వర్గ పోరు ఉనప్పటికీ వైరాలో మాత్రం వర్గపోరు కాస్తా మరింతగా ముదిరింది. తాజా, మాజీ ఎమ్మెల్యేల మద్య వైరం తీవ్రస్థాయికి చేరుకోవడం గమనార్హం. ఇది చివరకు అధికార పార్టీ నాయకులపై కేసులు పెట్టే వరకు వెళ్లడంతో ఇప్పుడు వైరా నియోజకవర్గంలోని వర్గవిబేదాలు జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 

2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ (TRS Party) అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాములునాయక్‌ విజయం సాదించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో వైరా నియోజకవర్గంలో మూడేళ్ల నుంచి రెండు వర్గాలుగా విడిపోయిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఆధిపత్య పోరులో పడ్డారు. తన వర్గానికి చెందిన కార్యకర్తలను కాపాడుకునేందుకు తరచూ మదన్‌లాల్‌ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తుండటంతో రెండు వర్గాలుగా విడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

దాడులకు వెనకాడని వైనం..
వైరా నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు చివరకు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడేందుకు వెనుకంజ వేయడం లేదు. నియోజకవర్గంలోని జూలూరుపాడులో వినాయక చవితి సందర్భంగా రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా రెండు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ సందర్భంగా తాజా, మాజీ ఎమ్మెల్యేల వర్గాలు విడివిడిగా ఉండటంతో వీరిని క్యాంప్‌కు చేర్చేందుకు పార్టీ పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మదన్‌లాల్‌ వర్గానికి చెందిన కార్యకర్తలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని పిర్యాదు చేశారు. 
అధికార పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు..
కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు చెందిన కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు వేల బైక్‌లతో ఈ ర్యాలీ జరగడంతో ఎమ్మెల్యే రాములు నాయక్‌ అలర్ట్‌ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులను అదుపు చేయడం కోసం చివరకు కేసులు పెట్టించినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ నిబందనల పేరుతో ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలపై ఇలా కేసులు నమోదు కావడంతో భవిష్యత్‌లో రెండు వర్గాల ఆదిపత్యపోరు ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఈ సమస్యకు పార్టీ పెద్దలు ఎలా చెక్‌ పెడతారనేది వేచి చూడాల్సిందే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.