అన్వేషించండి

KCR Politics : తెలంగాణ బాధితులకు కేసీఆర్ ఓదార్పు అసాధ్యమా ? సొంత ప్రజలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారా ?

తెలంగాణలో ఎలాంటి ఘోర విషాదాలు జరిగినా కేసీఆర్ స్పందించడం లేదు. ఇతర రాష్ట్రాల్లోని వారికి మాత్రం రూ. లక్షల చెక్కులు పంపిణీ చేస్తున్నారు. సొంత ప్రజలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారా ?

 


KCR Politics :  ఇతర రాష్ట్రాల్లోని వారికి సాయం చేయడానికి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులతో సిద్ధం చేసిన చెక్కులను తీసుకుని వెళ్తున్నారు. అక్కడి బాధితులకు భరోసా ఇచ్చి వస్తున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి.. గల్వాన్ లోయలో చనిపోయిన సైనికులకు.. అలాగే ఇతరులకు కూడా సాయం చేసి వస్తున్నారు. ఈ విషయంలో ఆయన సహృదయతను అక్కడి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కానీ  తెలంగాణలో మాత్రం ఆయనపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎంత పెద్ద విషాదం చోటు చేసుకున్నా  కేసీఆర్ కనీసం స్పందించకపోతూండటమే దానికి కారణం. 

కు.ని ఆపరేషన్ల విషాదంపై కేసీఆర్ స్పందన నిల్!

తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్‌లో పర్యటిస్తున్న సమయంలోనే తెలంగాణలో భారీ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు తల్లులు చనిపోగా.. ముఫ్ఫై మందికిపైగా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. వారిని అపోలో లాంటి ఆస్పత్రుల్లో చేర్చి కాపాడారు. అయితే ఈ విషాదంపై ప్రభుత్వాధినేత స్పందించలేదు.బాధితులకు పరామర్శ లేదు. ఇలాంటి సందర్భాల్లోనే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.  చనిపోయినవారంతా పేద తల్లులు.  తల్లులను  కోల్పోయిన పిల్లల ఆక్రందనలు అందరి గుండెల్ని బరువెక్కిస్తున్నాయి. ఇంతటి విషాద ఘటనపై స్పందించలేదు కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం చెక్కులు పంపిణీ చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

తెలంగాణ బాధితుల విషయంలో కేసీఆర్ వైఖరి అంతే ! 

తెలంగాణలో ఎంత పెద్ద విషాదం జరిగినా కేసీఆర్ స్పందన అంతే ఉంటుంది. ఇటీవల  బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు చేశారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు.  పలుమార్లు విద్యార్థులు రోడ్లెక్కారు. అయినా సీఎం ఒక్కసారి కూడా స్పందించలేదు.  కొండగట్టు బస్సు ప్రమాద విషాదం గురించి చాలా మంది ఇప్పటికీ చర్చించుకుంటూ  ఉంటారు. సెప్టెంబర్ 11, 2018న జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేసియా  ఎప్పటికి ఇచ్చిందో కూడా ఎవరికీ తెలియదు.  ముఖ్యమంత్రి కేసీఆర్ అంతపెద్ద ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని కానీ, బాధితులను కానీ సందర్శించలేదు.ఇలాంటి పలు ఘటనలు కేసీఆర్‌ను వేలెత్తిచూపుతున్నాయి. ఇదేం వైఖరి అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.  

ఆత్మహత్య చేసుకున్న రైతులు,  సాయం అందాల్సిన మాజీ సైనికుల గురించి చెబుతున్న విపక్షాలు

సైనికులకు , రైతులకు సాయం చేయడం తప్పా అని వాదిస్తున్న టీఆర్ఎస్ నేతలకు.. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను విపక్ష పార్టీలు చూపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను ఇస్తున్నాయి. వారికెందుకు సాయం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం అమ్ముకోలేక.. ఆ బస్తాల మీదనే చనిపోయిన రైతులు పదుల సంఖ్యలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో  పలువురు అమరులన సైనికులకు ఇవ్వాల్సిన సాయం ఇంకా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి లేఖ ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారు కానీ.. సొంత రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. 

సొంత రాజకీయం కోసమే చేస్తున్నారన్న విమర్శలు ! 

తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ ఇష్టారాజ్యంగా పార్టీ విస్తరణ కోం ఖర్చు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  గతంలో అవసరం లేకపోయినా దేశవ్యాప్తంగా ప్రతి చిన్నా చితకా పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చారు. ఇందు కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు జాతీయ రాజకీయ వ్యూహాలతోనే రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలకు ఓదార్పునిచ్చినా.. పెద్దగా వ్యతిరేకత వచ్చి ఉండేది కాదుకానీ  తెలంగాణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం పెరిగిపోవడం  టీఆర్ఎస్ నేతలకూ మింగుడు పడటం లేదు.  కేసీఆర్ రాజకీయ పర్యటనలు చేస్తే ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత రాదు కానీ.. తెలంగాణ ప్రజల సొమ్మును.. ఇతర రాష్ట్రాల్లో పంపిణీ చేయడానికి వెళ్తూండటం వల్లనే సమస్య వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Cases against KTR: ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget