అన్వేషించండి

KCR Politics : తెలంగాణ బాధితులకు కేసీఆర్ ఓదార్పు అసాధ్యమా ? సొంత ప్రజలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారా ?

తెలంగాణలో ఎలాంటి ఘోర విషాదాలు జరిగినా కేసీఆర్ స్పందించడం లేదు. ఇతర రాష్ట్రాల్లోని వారికి మాత్రం రూ. లక్షల చెక్కులు పంపిణీ చేస్తున్నారు. సొంత ప్రజలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారా ?

 


KCR Politics :  ఇతర రాష్ట్రాల్లోని వారికి సాయం చేయడానికి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులతో సిద్ధం చేసిన చెక్కులను తీసుకుని వెళ్తున్నారు. అక్కడి బాధితులకు భరోసా ఇచ్చి వస్తున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి.. గల్వాన్ లోయలో చనిపోయిన సైనికులకు.. అలాగే ఇతరులకు కూడా సాయం చేసి వస్తున్నారు. ఈ విషయంలో ఆయన సహృదయతను అక్కడి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కానీ  తెలంగాణలో మాత్రం ఆయనపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎంత పెద్ద విషాదం చోటు చేసుకున్నా  కేసీఆర్ కనీసం స్పందించకపోతూండటమే దానికి కారణం. 

కు.ని ఆపరేషన్ల విషాదంపై కేసీఆర్ స్పందన నిల్!

తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్‌లో పర్యటిస్తున్న సమయంలోనే తెలంగాణలో భారీ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు తల్లులు చనిపోగా.. ముఫ్ఫై మందికిపైగా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. వారిని అపోలో లాంటి ఆస్పత్రుల్లో చేర్చి కాపాడారు. అయితే ఈ విషాదంపై ప్రభుత్వాధినేత స్పందించలేదు.బాధితులకు పరామర్శ లేదు. ఇలాంటి సందర్భాల్లోనే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.  చనిపోయినవారంతా పేద తల్లులు.  తల్లులను  కోల్పోయిన పిల్లల ఆక్రందనలు అందరి గుండెల్ని బరువెక్కిస్తున్నాయి. ఇంతటి విషాద ఘటనపై స్పందించలేదు కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం చెక్కులు పంపిణీ చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

తెలంగాణ బాధితుల విషయంలో కేసీఆర్ వైఖరి అంతే ! 

తెలంగాణలో ఎంత పెద్ద విషాదం జరిగినా కేసీఆర్ స్పందన అంతే ఉంటుంది. ఇటీవల  బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు చేశారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు.  పలుమార్లు విద్యార్థులు రోడ్లెక్కారు. అయినా సీఎం ఒక్కసారి కూడా స్పందించలేదు.  కొండగట్టు బస్సు ప్రమాద విషాదం గురించి చాలా మంది ఇప్పటికీ చర్చించుకుంటూ  ఉంటారు. సెప్టెంబర్ 11, 2018న జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేసియా  ఎప్పటికి ఇచ్చిందో కూడా ఎవరికీ తెలియదు.  ముఖ్యమంత్రి కేసీఆర్ అంతపెద్ద ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని కానీ, బాధితులను కానీ సందర్శించలేదు.ఇలాంటి పలు ఘటనలు కేసీఆర్‌ను వేలెత్తిచూపుతున్నాయి. ఇదేం వైఖరి అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.  

ఆత్మహత్య చేసుకున్న రైతులు,  సాయం అందాల్సిన మాజీ సైనికుల గురించి చెబుతున్న విపక్షాలు

సైనికులకు , రైతులకు సాయం చేయడం తప్పా అని వాదిస్తున్న టీఆర్ఎస్ నేతలకు.. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను విపక్ష పార్టీలు చూపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను ఇస్తున్నాయి. వారికెందుకు సాయం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం అమ్ముకోలేక.. ఆ బస్తాల మీదనే చనిపోయిన రైతులు పదుల సంఖ్యలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో  పలువురు అమరులన సైనికులకు ఇవ్వాల్సిన సాయం ఇంకా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి లేఖ ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారు కానీ.. సొంత రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. 

సొంత రాజకీయం కోసమే చేస్తున్నారన్న విమర్శలు ! 

తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ ఇష్టారాజ్యంగా పార్టీ విస్తరణ కోం ఖర్చు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  గతంలో అవసరం లేకపోయినా దేశవ్యాప్తంగా ప్రతి చిన్నా చితకా పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చారు. ఇందు కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు జాతీయ రాజకీయ వ్యూహాలతోనే రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలకు ఓదార్పునిచ్చినా.. పెద్దగా వ్యతిరేకత వచ్చి ఉండేది కాదుకానీ  తెలంగాణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం పెరిగిపోవడం  టీఆర్ఎస్ నేతలకూ మింగుడు పడటం లేదు.  కేసీఆర్ రాజకీయ పర్యటనలు చేస్తే ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత రాదు కానీ.. తెలంగాణ ప్రజల సొమ్మును.. ఇతర రాష్ట్రాల్లో పంపిణీ చేయడానికి వెళ్తూండటం వల్లనే సమస్య వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget