అన్వేషించండి

KCR North Tours : ఉత్తరాదిలో కేసీఆర్ "ఓదార్పు యాత్ర" - ఇదే జాతీయ రాజకీయ వ్యూహమా ?

అమరులైన సైనికులు, రైతులకు గతంలో కేసీఆర్ ఆర్థిక ఆర్థిక సాయం ప్రకటించారు. వాటిని అంద జేసేందుకు కేసీఆర్ రాష్ట్రాలు పర్యటించే అవకాశం కనిపిస్తోంది.

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) జార్ఖండ్ వెళ్లి అక్కడ పుల్వామా ( Pulwama Attack ) దాడిలో చనిపోయిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ నుంచి  రాంచీ వెళ్లి ఝార్ఖండ్ సీఎం ( Jharkhand CM ) హేమంత్ సోరేన్ తో కలిసి, వారి అధికారిక నివాసం లో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్ కు చెందిన ఇద్దరు  అమర జవాన్ల కుటుంబాలకు చేస్తారు. చైనా సైనికులతో  జరిగిన ఘర్షణ లో కల్నల్ సంతోష్ బాబు ( Santosh Babu ) వీర మరణం చెందారు.   గల్వాన్ ఘటనలో చనిపోయిన వారికి కేసీఆర్ 2020 జూన్ 19వ తేదీన కుటుంబానికి  రూ. ఐదు కోట్ల సాయాన్ని కేసీఆర్ ఇచ్చారు.  సంతోష్ బాబు కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు.. ఆయన భార్యకు.. గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇచ్చారు. 

ఆ ఘటనలో మరణించిన మరో 19 మంది సైనికులకు తలా పది లక్షల సాయం ప్రకటించారు.  అయితే కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీకి ప్రకటించిన అన్ని సౌకర్యాలు ఇచ్చేశారు కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన జవాన్లకు ప్రకటించిన సాయాన్ని ఇంత వరకూ పంపిణీ చేయలేదు. అయితే ఇప్పుడు ఇవ్వాలని నిర్ణయించారు. ముందుగా జార్ఖండ్‌తో ప్రారంభిస్తారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు  జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించిన ప్రకారం మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసిఆర్ చర్యలు చేపడతారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే  ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ( Farmar Families )  ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. టికాయత్ ( Rakesh Tikait ) నేతృత్వంలోని రైతు సంఘంతో మాట్లాడి అందరికీ పంపిణీ చేస్తామని అప్పట్లో ప్రకటించారు.  కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలో రాకేష్ టికాయత్ కూడా కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమంలో చనిపోయిన రైతుల జాబితాను కేసీఆర్ అడిగి ఉంటారని భావిస్తున్నారు. ఇలా  కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సాయానికి అర్హులైన వారి జాబితాలను ఖరారు చేసుకుని కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు వెళ్లి పంపిణీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఓ రకంగా ఇది ఓదార్పు యాత్ర( Odarpu Yatra )  తరహా రాజకీయమని అంచనా వేస్తున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఉత్తరాదిలో విస్తృతంగా పర్యటించానుకుంటున్నారు. అలా పర్యటించడానికి ఈ ఓదార్పు యాత్ర తరహా రాజకీయం సరిగ్గా సూటవుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆర్థిక సాయం చెక్కులతో  ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉందని అనుకోవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget