అన్వేషించండి

Why KCR Silent : మళ్లీ కేసీఆర్ మౌనవ్యూహం - టార్గెట్ మునుగోడా ? కేటీఆర్‌ను సీఎం చేయడమా ?

కేసీఆర్ మళ్లీ మౌనవ్యూహం పాటిస్తున్నారు. తర్వాత ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ఏమిటి ?

Why KCR Silent :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా మాట్లాడినా.. ఏమీ మాట్లాడకపోయినా రాజకీయమే.  కేసీఆర్ మౌనం తర్వాత ఒక్కో సారి కీలక నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటారు. తన మౌనంపై అదే పనిగా చర్చ జరిగిన తర్వాత అసలు విషయం బయటపెడతారు. విజయదశమికి  టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ లాంఛనంగా నిర్ణయం తీసుకున్నప్పటకీ ఆయన మీడియాతో మాట్లాడలేదు. ప్రజలకు చెప్పాల్సింది చెప్పలేదు. అలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నాక.. ప్రజలకు చెప్పక ఎవరికి చెబుతారనే సందేహం మొదటగా వస్తుంది. కానీ కేసీఆర్ మౌన వ్యూహం పాటిస్తున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీ వెళ్లి వచ్చారు. వచ్చీ రాగానే మునుగోడు ఎన్నికలపై సమీక్ష చేశారు. ఈ లోపే కేసీఆర్ కేబినెట్‌లోని కీలక మంత్రి తర్వాత కేటీఆరే సీఎం అనే ప్రకటన చేశారు. ఇదంతా యాధృచ్చికంగా జరిగింది కాదని.. పక్కా వ్యూహమేనని టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. 

కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారా ? 

మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో బీజేపీని ఓడించేందుకు ఢిల్లీలో రాజకీయాలు చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అప్పుడు కేటీఆర్ సీఎంగా ఉంటారన్నారు. అంటే... ఈ కేటీఆర్ సీఎం కావడం అన్నది వచ్చే ఎన్నికల తర్వాత కాదు.. కేవలం మునుగోడు ఎన్నికల్లో గెలుపు తర్వాతేనని ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు కేసీఆర్ తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, రాజకీయ వ్యూహాలపై అన్ని కసరత్తులు పూర్తి చేశారని.. ఢిల్లీలో వారం రోజుల్లో దీనికి సంబంధించిన పనుల్నే చక్కబెట్టారని టీఆర్ఎస్‌లోని కొన్ని వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఇక ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తరహాలోనే పలువురు .. కేటీఆర్ సీఎం నినాదంతో తెరపైకి వస్తారని  భావిస్తున్నారు. 

ఢిల్లీ నుంచి రాగానే మునుగోడుపై కేసీఆర్ సమీక్ష !

కేటీఆర్‌ను సీఎం చేసే పాజిటివ్ వాతావరణం  ఉండాలన్నా.. వచ్చే ఎన్నికల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగాలన్నా  మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపే అత్యంత కీలకం. అందుకే సీఎం సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే మునుగోడుపై సమీక్ష నిర్వహించారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మునుగోడులో జరుగుతున్న పరిణామాలు.. వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సమాలోచనలు చేశారు. ఎన్నికల సంఘం గతంలో కారును పోలిన గుర్తులను ఇతరులకు ఇవ్వబోమని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి వ్యతిరేకంగా గుర్తులను కేటాయించింది. అలాగే గొర్రెలను పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఈ అంశాలపై పోరాటం చేయాలని ..తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అలా అయితేనే మునుగోడులో ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. 

ఢిల్లీలో ఈసీ ముందు ధర్నాకు కేసీఆర్  ప్రయత్నాలు !?

కేంద్రం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని.. ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం  చేస్తోందని కేసీఆర్ నమ్ముతున్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల విషయంలోనే ఈసీ తీరును ఎక్స్ పోజ్ చేయాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఈసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని అనుకుంటున్నారు. అది మునుగోడు పోలింగ్ లోపే ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే.. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్లవుంది. పైగా ఈసీ  వ్యవహారంపై బీజేపీయేతర రాష్ట్రాల్లో అభ్యంతరాలున్నాయి. గుజరాత్‌కు షెడ్యూల్ ప్రకటించకుండా ఒక్క హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే షెడ్యూల్ ప్రకటించడంపైనా విమర్శలున్నాయి. వీటన్నింటికీ కలిసి వచ్చేలా ఈసీ ఎదుట ధర్నాకు కేసీఆర్ రెడీ అవుతున్నారని అంటున్నారు. 

కేసీఆర్ మౌనం సైలెంటే కానీ.. ఆ తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు వయోలెంట్‌గా ఉంటాయని చెబుతూంటారు. ఇప్పుడు మౌనం తర్వాత కేసీఆర్ వేయబోయే అడుగులు రాజకీయంగా కలకలం రేపడం ఖాయమనే నమ్మకానికి ఎక్కువ మంది వచ్చారు. ఆయనేం చేయబోతున్నారో వచ్చే వారంలో తేలే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న GenZ ట్రెండ్ !
Pawan Kalyan Political Strategy: పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget