అన్వేషించండి

Why KCR Silent : మళ్లీ కేసీఆర్ మౌనవ్యూహం - టార్గెట్ మునుగోడా ? కేటీఆర్‌ను సీఎం చేయడమా ?

కేసీఆర్ మళ్లీ మౌనవ్యూహం పాటిస్తున్నారు. తర్వాత ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ఏమిటి ?

Why KCR Silent :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా మాట్లాడినా.. ఏమీ మాట్లాడకపోయినా రాజకీయమే.  కేసీఆర్ మౌనం తర్వాత ఒక్కో సారి కీలక నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటారు. తన మౌనంపై అదే పనిగా చర్చ జరిగిన తర్వాత అసలు విషయం బయటపెడతారు. విజయదశమికి  టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ లాంఛనంగా నిర్ణయం తీసుకున్నప్పటకీ ఆయన మీడియాతో మాట్లాడలేదు. ప్రజలకు చెప్పాల్సింది చెప్పలేదు. అలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నాక.. ప్రజలకు చెప్పక ఎవరికి చెబుతారనే సందేహం మొదటగా వస్తుంది. కానీ కేసీఆర్ మౌన వ్యూహం పాటిస్తున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీ వెళ్లి వచ్చారు. వచ్చీ రాగానే మునుగోడు ఎన్నికలపై సమీక్ష చేశారు. ఈ లోపే కేసీఆర్ కేబినెట్‌లోని కీలక మంత్రి తర్వాత కేటీఆరే సీఎం అనే ప్రకటన చేశారు. ఇదంతా యాధృచ్చికంగా జరిగింది కాదని.. పక్కా వ్యూహమేనని టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. 

కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారా ? 

మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో బీజేపీని ఓడించేందుకు ఢిల్లీలో రాజకీయాలు చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అప్పుడు కేటీఆర్ సీఎంగా ఉంటారన్నారు. అంటే... ఈ కేటీఆర్ సీఎం కావడం అన్నది వచ్చే ఎన్నికల తర్వాత కాదు.. కేవలం మునుగోడు ఎన్నికల్లో గెలుపు తర్వాతేనని ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు కేసీఆర్ తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, రాజకీయ వ్యూహాలపై అన్ని కసరత్తులు పూర్తి చేశారని.. ఢిల్లీలో వారం రోజుల్లో దీనికి సంబంధించిన పనుల్నే చక్కబెట్టారని టీఆర్ఎస్‌లోని కొన్ని వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఇక ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తరహాలోనే పలువురు .. కేటీఆర్ సీఎం నినాదంతో తెరపైకి వస్తారని  భావిస్తున్నారు. 

ఢిల్లీ నుంచి రాగానే మునుగోడుపై కేసీఆర్ సమీక్ష !

కేటీఆర్‌ను సీఎం చేసే పాజిటివ్ వాతావరణం  ఉండాలన్నా.. వచ్చే ఎన్నికల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగాలన్నా  మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపే అత్యంత కీలకం. అందుకే సీఎం సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే మునుగోడుపై సమీక్ష నిర్వహించారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మునుగోడులో జరుగుతున్న పరిణామాలు.. వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సమాలోచనలు చేశారు. ఎన్నికల సంఘం గతంలో కారును పోలిన గుర్తులను ఇతరులకు ఇవ్వబోమని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి వ్యతిరేకంగా గుర్తులను కేటాయించింది. అలాగే గొర్రెలను పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఈ అంశాలపై పోరాటం చేయాలని ..తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అలా అయితేనే మునుగోడులో ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. 

ఢిల్లీలో ఈసీ ముందు ధర్నాకు కేసీఆర్  ప్రయత్నాలు !?

కేంద్రం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని.. ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం  చేస్తోందని కేసీఆర్ నమ్ముతున్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల విషయంలోనే ఈసీ తీరును ఎక్స్ పోజ్ చేయాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఈసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని అనుకుంటున్నారు. అది మునుగోడు పోలింగ్ లోపే ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే.. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్లవుంది. పైగా ఈసీ  వ్యవహారంపై బీజేపీయేతర రాష్ట్రాల్లో అభ్యంతరాలున్నాయి. గుజరాత్‌కు షెడ్యూల్ ప్రకటించకుండా ఒక్క హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే షెడ్యూల్ ప్రకటించడంపైనా విమర్శలున్నాయి. వీటన్నింటికీ కలిసి వచ్చేలా ఈసీ ఎదుట ధర్నాకు కేసీఆర్ రెడీ అవుతున్నారని అంటున్నారు. 

కేసీఆర్ మౌనం సైలెంటే కానీ.. ఆ తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు వయోలెంట్‌గా ఉంటాయని చెబుతూంటారు. ఇప్పుడు మౌనం తర్వాత కేసీఆర్ వేయబోయే అడుగులు రాజకీయంగా కలకలం రేపడం ఖాయమనే నమ్మకానికి ఎక్కువ మంది వచ్చారు. ఆయనేం చేయబోతున్నారో వచ్చే వారంలో తేలే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget