అన్వేషించండి

Why KCR Silent : మళ్లీ కేసీఆర్ మౌనవ్యూహం - టార్గెట్ మునుగోడా ? కేటీఆర్‌ను సీఎం చేయడమా ?

కేసీఆర్ మళ్లీ మౌనవ్యూహం పాటిస్తున్నారు. తర్వాత ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ఏమిటి ?

Why KCR Silent :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా మాట్లాడినా.. ఏమీ మాట్లాడకపోయినా రాజకీయమే.  కేసీఆర్ మౌనం తర్వాత ఒక్కో సారి కీలక నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటారు. తన మౌనంపై అదే పనిగా చర్చ జరిగిన తర్వాత అసలు విషయం బయటపెడతారు. విజయదశమికి  టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ లాంఛనంగా నిర్ణయం తీసుకున్నప్పటకీ ఆయన మీడియాతో మాట్లాడలేదు. ప్రజలకు చెప్పాల్సింది చెప్పలేదు. అలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నాక.. ప్రజలకు చెప్పక ఎవరికి చెబుతారనే సందేహం మొదటగా వస్తుంది. కానీ కేసీఆర్ మౌన వ్యూహం పాటిస్తున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీ వెళ్లి వచ్చారు. వచ్చీ రాగానే మునుగోడు ఎన్నికలపై సమీక్ష చేశారు. ఈ లోపే కేసీఆర్ కేబినెట్‌లోని కీలక మంత్రి తర్వాత కేటీఆరే సీఎం అనే ప్రకటన చేశారు. ఇదంతా యాధృచ్చికంగా జరిగింది కాదని.. పక్కా వ్యూహమేనని టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. 

కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారా ? 

మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో బీజేపీని ఓడించేందుకు ఢిల్లీలో రాజకీయాలు చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అప్పుడు కేటీఆర్ సీఎంగా ఉంటారన్నారు. అంటే... ఈ కేటీఆర్ సీఎం కావడం అన్నది వచ్చే ఎన్నికల తర్వాత కాదు.. కేవలం మునుగోడు ఎన్నికల్లో గెలుపు తర్వాతేనని ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు కేసీఆర్ తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, రాజకీయ వ్యూహాలపై అన్ని కసరత్తులు పూర్తి చేశారని.. ఢిల్లీలో వారం రోజుల్లో దీనికి సంబంధించిన పనుల్నే చక్కబెట్టారని టీఆర్ఎస్‌లోని కొన్ని వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఇక ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తరహాలోనే పలువురు .. కేటీఆర్ సీఎం నినాదంతో తెరపైకి వస్తారని  భావిస్తున్నారు. 

ఢిల్లీ నుంచి రాగానే మునుగోడుపై కేసీఆర్ సమీక్ష !

కేటీఆర్‌ను సీఎం చేసే పాజిటివ్ వాతావరణం  ఉండాలన్నా.. వచ్చే ఎన్నికల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగాలన్నా  మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపే అత్యంత కీలకం. అందుకే సీఎం సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే మునుగోడుపై సమీక్ష నిర్వహించారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మునుగోడులో జరుగుతున్న పరిణామాలు.. వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సమాలోచనలు చేశారు. ఎన్నికల సంఘం గతంలో కారును పోలిన గుర్తులను ఇతరులకు ఇవ్వబోమని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి వ్యతిరేకంగా గుర్తులను కేటాయించింది. అలాగే గొర్రెలను పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఈ అంశాలపై పోరాటం చేయాలని ..తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అలా అయితేనే మునుగోడులో ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. 

ఢిల్లీలో ఈసీ ముందు ధర్నాకు కేసీఆర్  ప్రయత్నాలు !?

కేంద్రం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని.. ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం  చేస్తోందని కేసీఆర్ నమ్ముతున్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల విషయంలోనే ఈసీ తీరును ఎక్స్ పోజ్ చేయాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఈసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని అనుకుంటున్నారు. అది మునుగోడు పోలింగ్ లోపే ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే.. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్లవుంది. పైగా ఈసీ  వ్యవహారంపై బీజేపీయేతర రాష్ట్రాల్లో అభ్యంతరాలున్నాయి. గుజరాత్‌కు షెడ్యూల్ ప్రకటించకుండా ఒక్క హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే షెడ్యూల్ ప్రకటించడంపైనా విమర్శలున్నాయి. వీటన్నింటికీ కలిసి వచ్చేలా ఈసీ ఎదుట ధర్నాకు కేసీఆర్ రెడీ అవుతున్నారని అంటున్నారు. 

కేసీఆర్ మౌనం సైలెంటే కానీ.. ఆ తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు వయోలెంట్‌గా ఉంటాయని చెబుతూంటారు. ఇప్పుడు మౌనం తర్వాత కేసీఆర్ వేయబోయే అడుగులు రాజకీయంగా కలకలం రేపడం ఖాయమనే నమ్మకానికి ఎక్కువ మంది వచ్చారు. ఆయనేం చేయబోతున్నారో వచ్చే వారంలో తేలే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
Pawan Kalyan:
"గద్దర్‌కు మీరేం చేశారు? పాశం యాదగిరి కూడా విమర్శిస్తున్నారు" పవన్ కల్యాణ్‌ పంచ్‌లు 
Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!
తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget