అన్వేషించండి

Karimnagar: బీజేపీలో రహస్య సమావేశాల కలకలం, కరీంనగర్ సీనియర్ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి!

బీజేపీలో రహస్య సమావేశాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ కు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ పరిణామాలు బీజేపీలో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.

కరీంనగర్(Karimnagar) రాజకీయ మార్పులకు కీలకమైన ప్రాంతం. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)కి ఊపిరిపోసిన కరీంనగర్ ఈ మధ్య బీజేపీ(BJP) కి ఫైర్ బ్రాండ్ గా మారింది. బండి సంజయ్ కి ఆదరణ పెరిగేలా  అవకాశం ఇచ్చింది. గతంలో విద్యాసాగర్ రావు లాంటి జాతీయ స్థాయి నేతను అందలం ఎక్కించిన కరీంనగర్ పార్లమెంట్ స్థానం.. దక్షిణాదిలో మరింత బలపడాలని అనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఉత్తర తెలంగాణలోని కీలకమైన కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఉన్న విలువ బాగా తెలుసు. అందుకు వ్యూహాత్మకంగానే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్(Bandi Sanjay) కి ఉన్న ఫాలోయింగ్ ని సెంటిమెంట్ తో కలిపి పార్లమెంటు స్థానాన్ని చేజిక్కించుకుంది. అలా మొదలైన దూకుడు వరుసగా బండి సంజయ్ కి కీలకమైన పదవులు అప్పగించడంతో రాష్ట్రస్థాయిలో తనదైన శైలితో దూకుడుగా వెళ్లడం మొదలుపెట్టారు. అదే సమయంలో వచ్చిన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో. దుందుడుకు విధానాలతో బండి సంజయ్ తనదైన మార్క్ ని చూపించారు. దీంతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నలభైకి పైగా కార్పొరేషన్ స్థానాలను బీజేపీ గెలిచింది. తరువాత వరుసగా అధికార టీఆర్ఎస్, ఆ పార్టీ అధినాయకత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు బండి సంజయ్. మరోవైపు గ్రౌండ్ లెవెల్ లో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ నిరసనలు ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ తనకు పునాది లాంటి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు మాత్రం మింగుడు పడడం లేదు బీజేపీ బాస్ కి. 

జిల్లా బీజేపీలో అసలేం జరుగుతోంది?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు కీలకమైన సీనియర్ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, పోల్సని సుగుణాకర్ రావు కొన్ని దశాబ్దాలుగా జిల్లా బీజేపీలో పదవులతో మొదలై రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. వీరిద్దరూ ఇతర నేతలైన వెంకటరమణి, రాములు ఇతర నేతలతో కలిసి మంగళశారం హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్(MLA Quaters) లో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసిన బండి సంజయ్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే రహస్య సమావేశం నిర్వహించడం జిల్లా బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా మారింది. దీంతో అప్రమత్తమైన బండి సంజయ్ కేంద్ర నాయకత్వానికి మొత్తం విషయాన్ని వివరించారు. మరోమారు ఇలా జరగదని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేయడంతో అంతా ముగిసింది అనుకున్నారు. మరోమారు ఈ నేతలు సమావేశమై తమకు పార్టీలో ఎలాంటి ప్రాముఖ్యత లభించడం లేదని నిరసన వ్యక్తం చేయడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని చర్చనీయాంశమైంది. ఇద్దరు సీనియర్ నేతలు ఇతరులతో వరుసగా రహస్య సమావేశాలు నిర్వహించడం ఇక కఠినమైన చర్యలకు  కేంద్ర బీజేపీ నాయకత్వం సిద్ధం అవుతోందా లేదా అనేది వేచిచూడాలి. ఇదే విషయంపై జిల్లాకు చెందిన కీలక నాయకుణ్ణి ఏబీపీ దేశం సంప్రదించగా ఆ విషయం పై స్థాయి నేతలే చూసుకుంటారంటూ దాటవేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget