అన్వేషించండి

KA Paul: తెలుగు రాష్ట్రాలపై కేంద్రం కుట్రలు- విశాఖ ఉక్కు కోసం కేఏ పాల్ ఆమరణ దీక్ష

KA Paul: తెలుగు రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ కుట్రలకు తెరతీసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

KA Paul: తెలుగు రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ (BJP) కుట్రలకు తెరతీసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ..  మూడు రోజుల కిందట ఎవ్వరికీ తెలియకుండా ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుడు అయిన అదానీకి వెయ్యి కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ భూమిని కేటాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీ, గుజరాత్ గ్యాంగ్‌ను  ఢీకొనలేకపోతున్నారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని రాజకీయ నాయకులకు సత్తా లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీకి తెలుగు నేతలు అమ్ముడు పోయి, తొత్తులుగా మారారని విమర్శించారు. తానే గనక ఎంపీనైతే గంగవరం పోర్ట్‌ను సీజ్ చేస్తామన్నారు. ఏపీ, తెలంగాణ నేతలు ఏకం కావాలని, అందరూ కలిసి తెలుగు సత్తా చూపిద్దామని పిలుపు నిచ్చారు. తాను ముందుండి పోరాటం నడిపస్తానని పాల్ వ్యాఖ్యానించారు. పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న ఘనత తెలంగాణ బిడ్డల సొంతం అన్నారు.

తెలుగు రాష్ట్రాల తరఫున తాను మాట్లాడుతుంటే గుజరాతీ గుండాలు తనను చంపుతామని బెదిరిస్తున్నారని పాల్ ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మతిస్థిమితం ఉందా అని ప్రశ్నించారు.  మోదీతో పవన్ చేతులు కలిపి ఆయన కింద సాగిలపడ్డారని అన్నారు. పవన్‌కు ఏమాత్రం సత్తా, పౌరుషం ఉంటే తనతో చేతులు కలపాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నేతలు ఏకం అయ్యి కేంద్రానికి మన శక్తి ఏంటో చూపించాలన్నారు. 

నాలుగు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ వెళ్లడానికి మోదీకి ధైర్యం లేకపోయిందని కేఏ పాల్ విమర్శించారు. కానీ చంద్రయాన్ విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను అభినందించడానికి బెంగళూరు వెళ్లారని విమర్శించారు. ఏపీ ప్రజలు తనతో కలిసి నడవాలని, విశాఖ సత్తా ఏంటో కేంద్రానికి చూపిస్తానన్నారు. సోమవారం 28 నుంచి స్టీల్ పాయింట్ పరిరక్షణ కోసం తన ఫంక్షన్ హాల్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. ప్రజలు తన దీక్షకు మద్దతుగా నిలవాలని కోరారు. 

జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్‌పై పాల్ ఆగ్రహం
ఇటీవల ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కాంట్రాక్టర్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. హైదరాబాద్ అమీర్ పేట్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయం ముందు రోడ్డును తవ్వడం కేఏ పాల్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. రోడ్డును తవ్విన కాంట్రాక్టర్ పై ఒంటికాలుపై లేచారు. తాను నివాసం ఉంటున్న ఇంటి ముందు రోడ్డు తవ్వొద్దని చెప్తే ఎందుకు తవ్వారని ఆర్ అండ్ బి సిబ్బందిని కేఏ పాల్ నిలదీశారు. 

‘‘ఇక్కడ రోడ్డు తవ్వవద్దని నీకు ఇంజినీర్లు, మేయర్ చెప్పారు కదా? ఎందుకు తవ్వావు? జస్ట్ గెట్ అవుట్, లేదంటే మేమే గెంటేస్తాం’’ అని కేఏ పాల్ ఆర్ అండ్ బీకి చెందిన ఓ వ్యక్తిపై అరిచారు. దీనికి ఆ వ్యక్తి కూడా దీటుగానే స్పందిస్తూ.. ‘‘ఫస్ట్ సరిగ్గా మాట్లాడండి. నా దగ్గర గవర్నమెంట్ ఆర్నమెంట్ ఉంది’’ అని ఆ వ్యక్తి చెప్పగా, ఇంజినీర్లు, మేయరే అక్కడ రోడ్డు తవ్వవద్దని నీ ముందే చెప్పారని కేఏ పాల్ గట్టిగా చెప్పారు.

అంతటితో ఆగకుండా కేఏ పాల్ మరో వ్యక్తితో వాదనకు దిగారు. ఒరేయ్.. కొడతాను నిన్ను.. కొడతాను.. ఇంజినీర్లు అందరూ వచ్చి చెప్పారు.. ఇక్కడ రోడ్డు తవ్వవద్దని. వారు చెప్పిన తర్వాత కూడా రోడ్డు తవ్వుతావా? ఇక్కడ 30 దాకా కార్లు ఉన్నాయి. అందుకే ఇక్కడ రోడ్డు తవ్వవద్దని మేం మేయర్ ని అడిగాం. అందుకు అంగీకరించారు’’ అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Embed widget