అన్వేషించండి

YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్‌సీపీ ఆశలు నెరవేరుతాయా ?

జగనన్నకు చెప్పుకుందాం .. కార్యక్రమం ద్వారా అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నిస్తోంది. ప్రజల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించేలా సన్నాహాలు చేస్తున్నారు.


YSRCP Politics :   ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్నకు చెప్పుకుందాం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాని నిర్ణయించుకున్నారు. మూడున్నరేళ్ల పాలన తర్వాత ప్రజల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ను.. సీఎం జగన్ ఇంత కాలం ప్రజలను నేరుగా కలిసిన సందర్భం లేకపోడంతో.. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నిజానికి ప్రజాదర్భార్ పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ మొదటే అనుకున్నారు. తేదీని కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా రద్దయింది. ఆ తర్వాత మళ్లీ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఎక్కువ మంది సమస్యలను ఆలకించాలంటే నేరుగా కలవడం కన్నా ఫోన్ ద్వారాఅయితే బెటరని అనుకుంటున్నారు. అందుకే జగనన్నకు చెప్పుకుందాం అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జగనన్నకు చెప్పుకుందాం ! 

రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో మరింత జవాబుదారీ పెంచే విధంగా ‘జగనన్నకు చెబుతా’ కొత్త కార్యక్రమానికి రూపకల్పన జరుగుతోంది. ఈ కేబినెట్‌లో కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది.. గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చే మెజారిటీ వినతులను గుర్తించి ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి వరకు సమస్య పరిష్కారమయ్యే దిశగా యంత్రాంగాన్ని జాగృతం చేసే విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి టోల్‌ ఫ్రీ నెంబరు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ పోన్ నెంబర్‌కు కాల్ వచ్చిన వెంటనే అధికారులు సమస్యను  పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు.ఇలా చేయడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

స్పందనకు అప్ డేటెడ్ వెర్షన్ !

ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తోంది. మొదట్లో చురుకుగా సాగిన ఈ గ్రీవెన్స్ తర్వాత పూర్తిగా వెనుకబడిపోయింది. సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దీంతో గ్రీవెన్స్ కు వచ్చే  వారు తగ్గిపోయారు. అదే సమయంలో సీఎం జగన్ కు సమస్య చెప్పుకోవాలని ఆకాంక్షించేవారి సంఖ్య పెరిగిపోయింది. స్పందనలో పరిష్కారం రాకపోతే నేరుగా సీఎం జగన్ ను కలిసి చెప్పుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా జగనన్నకు చెప్పుకున్నట్లుగా ఉండేలా...ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనిపై కసరత్తు తుది దశకు వచ్చింది. కేబినెట్ భేటీ తర్వాత ఎప్పటి నుంచి ప్రారంభించే అంశంపై ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. 

ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో ఈ కార్యక్రమం కీలకం!

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న అభిప్రాయం  బలపడుతోంది. ఇలాంటి సమయంలో.. తమకు ప్రజలే ఫస్ట్ అని నిరూపించేలా ఈ జగనన్నకు చెప్పుకుందాం కార్యక్రమాన్ని అనూహ్య రీతిలో విజయవంతం  చేయాలని అనుకుంటున్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి పడేలా చేయాలనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందలేదని ఎక్కువ మంది ఫిర్యాదులు చేసే అవకాశం ఉన్నందున దీనిపై ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. ఎందుకు పథకాలు ఇవ్వలేకపోయారో.. స్ఫష్టంగా చెప్పనున్నారు. ఇలా చెప్పి వారిలో ఉన్న అసంతృప్తిని తగ్గించాలనుకుంటున్నారు. ఎలా చూసినా.. యాంటీ ఇన్ కంబెన్సీ అనేదాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Advertisement

వీడియోలు

పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
అబ్బాయిలకో న్యాయం?  అమ్మాయిలకో న్యాయమా?
3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Kumbh Mela Mona Lisa: మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ -   తెలుగు సినిమాల్లో ఎంట్రీ
మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ - తెలుగు సినిమాల్లో ఎంట్రీ
Embed widget