అన్వేషించండి

YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్‌సీపీ ఆశలు నెరవేరుతాయా ?

జగనన్నకు చెప్పుకుందాం .. కార్యక్రమం ద్వారా అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నిస్తోంది. ప్రజల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించేలా సన్నాహాలు చేస్తున్నారు.


YSRCP Politics :   ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్నకు చెప్పుకుందాం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాని నిర్ణయించుకున్నారు. మూడున్నరేళ్ల పాలన తర్వాత ప్రజల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ను.. సీఎం జగన్ ఇంత కాలం ప్రజలను నేరుగా కలిసిన సందర్భం లేకపోడంతో.. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నిజానికి ప్రజాదర్భార్ పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ మొదటే అనుకున్నారు. తేదీని కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా రద్దయింది. ఆ తర్వాత మళ్లీ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఎక్కువ మంది సమస్యలను ఆలకించాలంటే నేరుగా కలవడం కన్నా ఫోన్ ద్వారాఅయితే బెటరని అనుకుంటున్నారు. అందుకే జగనన్నకు చెప్పుకుందాం అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జగనన్నకు చెప్పుకుందాం ! 

రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో మరింత జవాబుదారీ పెంచే విధంగా ‘జగనన్నకు చెబుతా’ కొత్త కార్యక్రమానికి రూపకల్పన జరుగుతోంది. ఈ కేబినెట్‌లో కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది.. గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చే మెజారిటీ వినతులను గుర్తించి ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి వరకు సమస్య పరిష్కారమయ్యే దిశగా యంత్రాంగాన్ని జాగృతం చేసే విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి టోల్‌ ఫ్రీ నెంబరు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ పోన్ నెంబర్‌కు కాల్ వచ్చిన వెంటనే అధికారులు సమస్యను  పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు.ఇలా చేయడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

స్పందనకు అప్ డేటెడ్ వెర్షన్ !

ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తోంది. మొదట్లో చురుకుగా సాగిన ఈ గ్రీవెన్స్ తర్వాత పూర్తిగా వెనుకబడిపోయింది. సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దీంతో గ్రీవెన్స్ కు వచ్చే  వారు తగ్గిపోయారు. అదే సమయంలో సీఎం జగన్ కు సమస్య చెప్పుకోవాలని ఆకాంక్షించేవారి సంఖ్య పెరిగిపోయింది. స్పందనలో పరిష్కారం రాకపోతే నేరుగా సీఎం జగన్ ను కలిసి చెప్పుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా జగనన్నకు చెప్పుకున్నట్లుగా ఉండేలా...ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనిపై కసరత్తు తుది దశకు వచ్చింది. కేబినెట్ భేటీ తర్వాత ఎప్పటి నుంచి ప్రారంభించే అంశంపై ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. 

ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో ఈ కార్యక్రమం కీలకం!

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న అభిప్రాయం  బలపడుతోంది. ఇలాంటి సమయంలో.. తమకు ప్రజలే ఫస్ట్ అని నిరూపించేలా ఈ జగనన్నకు చెప్పుకుందాం కార్యక్రమాన్ని అనూహ్య రీతిలో విజయవంతం  చేయాలని అనుకుంటున్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి పడేలా చేయాలనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందలేదని ఎక్కువ మంది ఫిర్యాదులు చేసే అవకాశం ఉన్నందున దీనిపై ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. ఎందుకు పథకాలు ఇవ్వలేకపోయారో.. స్ఫష్టంగా చెప్పనున్నారు. ఇలా చెప్పి వారిలో ఉన్న అసంతృప్తిని తగ్గించాలనుకుంటున్నారు. ఎలా చూసినా.. యాంటీ ఇన్ కంబెన్సీ అనేదాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
Telangana Delimitation 2026: తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget