అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Attack On Jagan Case : జగన్‌పై కోడి కత్తి దాడికి నాలుగేళ్లు - విచారణ ఎక్కడి వరకు వచ్చింది ? నిందితుడికి బెయిల్ ఎందుకు రాలేదు ?

కోడికత్తి దాడి కేసుకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. కానీ విచారణ ముందుకు సాగడం లేదు. నిందితుడు శీను జైల్లోనే మగ్గిపోతున్నాడు.


Attack On Jagan Case :   2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన ఘటనల్లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడి కత్తితో దాడి కేసు ఒకటి. సరిగ్గా నాలుగేళ్ల కిందట 2018లో సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్‌ జగన్‌పై శీను అనే ఎయిర్ పోర్ట్ క్యాంటీన్‌లో పని చేసే యువకుడు  కోడి పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది.  దాడి జరిగిన వెంటనే  శీనును సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 

ఆ రోజు ఏం జరిగిందంటే ? 

అప్పట్లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు.  ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు  హాజరవ్వాల్సి ఉంటుంది.  అందుకే ప్రతి గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర నిలిపివేసి.. వెంటనే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరేవారు. అలాగే 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్‌..సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది.  చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్ చేరుకున్న తరవాత   సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది. 

ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న వైఎస్ఆర్సీపీ ! 

శీను జగన్ అభిమాని అని.. జగన్ పై సానుభూతి రావడం కోసం చేశారని పోలీసులు తేల్చారు. అయితే వైసీపీ నేతలు దీన్ని ఖండించారు. కేసును నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.   సీబీఐకి అప్పగించాలం’టూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది వైసీపీ.  ఈ కేసుపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేసింది. అయితే ఏపీ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న ద‌ర్యాప్తు మీద త‌మ‌కు అనుమానాలు ఉన్నాయంటూ జగన్‌, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుంటూరుకు చెందిన అనిల్‌ కుమార్‌‌లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్ర‌యించారు. మూడు రకాలుగా పిటిషన్లు దాఖలు చేశారు.  ఈ కేసులో కేంద్ర హోం శాఖ కూడా ప్రతివాదిగా ఉంది. ఆ సందర్భంగా హోం శాఖ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ లక్ష్మణ్ ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించినట్లు నిర్ణయాన్ని ధర్మాసనానికి తెలిపారు. అలా కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లింది. 

చార్జిషీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ 

వేగంగా విచారణ జరిగిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది.  ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. తుది చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని ఎన్ఐఎ అధికారులు పేర్కొన్నారు. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్‌ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు పేర్కొంది.ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం ఇవ్వాలని వారిని కోరినట్లుగా చెప్పింది.ఇందుకోసం వైసీపీలో ఎవరితోనైనా మాట్లాడాలని సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని స్పష్టంచేసింది.సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకోసం తాను మాట్లాడతానని హేమలత భరోసా ఇచ్చినట్లుగా వివరించింది. పార్టీ నేతలతో కలిసి జగన్‌ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక.వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్‌ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లినట్లుగా చార్జిషీట్ లో స్పష్టం చేసింది.

జైల్లోనే కోడికత్తి శీను.. తల్లిదండ్రుల ఆవేదన !

ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలుచేసింది. కానీ కోర్టులో విచారణకు మాత్రం రావడం లేదు. మరో వైపు ఓ సారి కోర్టులో శ్రీనివాస్‌కు బెయిల్ వచ్చింది. కానీ ఎన్‌ఐఏ కోర్టుకు వెళ్లి కొట్టి వేయించింది. దీంతో అప్పటి నుండి శ్రీనివాస్ జైల్లోనే ఉన్నాడు. తమ కుమారుడ్ని విడిపించాలని వారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా లేఖ రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. నాలుగేళ్లయిన సందర్భంగా జైల్లో తల్లిదండ్రులు శ్రీనివాస్‌ను కలిశారు. తమ కుమారుడు బయటకు వచ్చేలా సాయం చేయమని.. జగన్‌ను కలుస్తామని వారంటున్నారు. లేకపోతే ధర్నాకూ సిద్ధమంటున్నారు. ఈ కేసు ఎప్పటికి తేలుతుందో కానీ.. మిస్టరీ మాత్రం అలాగే ఉండిపోయింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Bengal Trends: తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
Kaleshwaram issue: కాళేశ్వరంలోకి సీబీఐ దింపడం ఎలా ? - సీఎం రేవంత్ ముందున్న పెద్ద టాస్క్ ఇదే !
కాళేశ్వరంలోకి సీబీఐ దింపడం ఎలా ? - సీఎం రేవంత్ ముందున్న పెద్ద టాస్క్ ఇదే !
TDP Lokesh regime: టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
West Bengal Election 2026 Phase 2 Voting: పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. ఆసక్తికరంగా మమతా వర్సెస్ సువేందు పోరు!
పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. ఆసక్తికరంగా మమతా వర్సెస్ సువేందు పోరు!

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Embed widget