అన్వేషించండి

పవన్ కల్యాణ్ స్ట్రాటజీ మార్చేశారా ? బీజేపీని సైడ్ చేసేసినట్లేనా ?

చంద్రబాబును జైలులో కలిసి వచ్చిన తర్వాత జనసేనాని రూటు మార్చేశారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అక్రమాలు, అవినీతిపై వరుసగా ట్వీట్లు, విమర్శలు చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యాక ఖండించిన జనసేనాని, ఆ తర్వాత నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామంటూ...బంతిని కమలం కోర్టులోనే వేసేశారు. దీంతో అప్పటి వరకు జనాలకు ఉన్న అనుమానాలు పటా పంచలయ్యాయి. పవన్ కల్యాణ్ కామెంట్స్ తో ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. ఎప్పటిలాగే వైసీపీ తన పాత పల్లవి అందుకుంది. చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసింది. 

బీజేపీ ఊసెత్తడం లేదు
చంద్రబాబును జైలులో కలిసి వచ్చిన తర్వాత జనసేనాని రూటు మార్చేశారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అక్రమాలు, అవినీతిపై వరుసగా ట్వీట్లు, విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పలుమార్లు చెప్పారు. జగన్ అవినీతి మొత్తం ప్రధాని మోడీకి తెలుసని అన్నారు. కొంతకాలంగా బీజేపీ పార్టీ గురించి మాట్లాడటం పూర్తిగా తగ్గించేశారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని జనసేన, టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తే ముస్లింలు, క్రిస్టియన్లు ఓటర్లు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ముస్లింలు, క్రిస్టియన్లు గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడంతో, ఆ పార్టీ 151 సీట్లలో గెలుపొందింది. ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే బీజేపీకి దూరంగా ఉండమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

అవనిగడ్డలో వారాహి యాత్ర నిర్వహించిన పవన్ కల్యాణ్, జగన్‌ పాలనపై ధ్వజమెత్తారు. ఎక్కడా బీజేపీ పార్టీ గురించి మాట్లాడలేదు. జగన్ అవినీతి మొత్తం మోడీకి తెలుసు అంటూనే ఆగిపోయారు. బీజేపీ పేరు ఎంత తక్కువగా ప్రస్తావిస్తే, అంత మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళితే మళ్లీ జగన్ కే అది లాభిస్తుందనే అంచనా వచ్చినట్లు సమాచారం. అందుకే బీజేపీ దూరంగా ఉంటూనే ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 

ఈ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం
వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించటమే జనసేన లక్ష్యమని... ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. జగన్ సేన కౌరవులని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ ఓటమి ఖాయం, మేం అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, తనకు డబ్బుమీద, నేలమీద ఎప్పుడూ కోరిక లేదని స్పష్టం చేశారు. 

ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నాం
ఈ పదేళ్లలో జనసేన పార్టీ అనేక దెబ్బలు తిందన్న పవన్ కల్యాణ్, కేవలం ఆశయాలు, విలువల కోసం మేం పార్టీ నడుపుతున్నట్లు వెల్లడించారు. తాను యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటానని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ కోసం కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనకు తన పార్టీ కంటే ఈ రాష్ట్రం ముఖ్యమని పవన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను వెంపర్లాడనని పవన్‌ వెల్లడించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
NEET 2026 Paper Leak: నీట్, సీబీఎస్ఈ వివాదాలతో కేంద్రంపై యువతలో వ్యతిరేకత - దేవేంద్ర ప్రధాన్ పదవికి ముప్పు?
నీట్, సీబీఎస్ఈ వివాదాలతో కేంద్రంపై యువతలో వ్యతిరేకత - దేవేంద్ర ప్రధాన్ పదవికి ముప్పు?
Revanth Reddy Sentiment Politics: తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు - భాగమవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - రేవంత్ ప్లానేంటి?
తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు - భాగమవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - రేవంత్ ప్లానేంటి?
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget