అన్వేషించండి

నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడొక లెక్క- మైలవరంలో దేవినేని ఉమా Vs వసంత

మైలవరం రాజకీయం రూటు మారుతోంది. మొన్నటి వరకు వైసీపీలో మంత్రి జోగి, ఎమ్మెల్యే వసంత మధ్య నడిచిన వివాదం ఇప్పుడు వైసీపీ టీడీపీ రణంగా మారుతోంది.

మైలవరం నియోజకవర్గంలో వసంత, దేవినేని మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత్ కృష్ణ ప్రసాద్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా రాజకీయ వ్యభిచారి అంటూ వసంత మండిపడ్డారు. అతీగతి లేని తాడు బొంగరం లేని వెధవ దేవినేని ఉమామహేశ్వరరావు అంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వానికి పన్ను చెల్లించి వ్యాపారాలు చేసి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించానని, దేవినేని ఉమా తండ్రికి గవర్నమెంట్ ఒక సెంటులో 6 గజాలు భూమి ఇస్తే ఇందులో ఆరో భాగం నుంచి ఉమ బతుకు ప్రారంభమైందన్నారు. అలాంటి వ్యక్తి  తనను అవినీతిపరుడు అనేవారా అని నిలదీశారు. అవినీతిపరుడు కాకపోతే ఎక్కడ నుంచి సంపాదించి గత ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారో ఉమా చెప్పాలన్నారు. తాను అచెంలంచెలుగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నానని, ఆయన చేశారో చెప్పాలంటూ ఫైర్ అయ్యారు. 

దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్స్‌ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని అన్నారు వసంత్‌. తన అన్న చనిపోతే, కనీసం ఆయన చిన్నపిల్లలకు అచ్చట ముచ్చట కూడా తీర్చని వెధవ అంటూ దుయ్యబట్టారు. ఉమ తన రాజకీయం తాను చూసుకోవాలన్నారు. ఇంకా ఏమైనా మాట్లాడదలుచుకుంటే రా ఒకే వేదిక మీద చర్చకు దిగుదాం అని సవాల్ విసిరారు. ఎక్కడో ఏదో పైపులు లీకై బూడిద నీరు పోతుంటే దానికి కూడా తనపై ఆరోపణలు చేయడం ఏంటని నిలదీశారు. బురద కాల్వలను కూడా తవ్వి దాన్ని కూడా గీకి దోచుకునే పంది దేవినేని ఉమ అన్నారు. శవాల పక్కన చిల్లర పెంకులు ఏరుకునే వైఖరి ఉమాదని, తాము రైట్ రాయల్‌గా బతుకుతామని సవాల్ చేశారు. తాను రాజకీయంగా దేవినేని ఉమాను ఓడించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, ఆ పని పూర్తయ్యిందన్నారు. అంతే కాదు ఎవరు పోటీ చేస్తే దేవినేని ఉమాను ఓడించగలరో జగన్‌కు తెలుసని తెలిపారు. జోగికి కూడా ఇదే విషయాన్ని చెప్పానని, తామిద్దం కలసి చర్చించుకుంటామని అన్నారు.

ఉమా కౌంటర్...

దేవినేని ఉమా కూడా వసంత పై ద్వజమెత్తారు. బూడిద రాజకీయాలు చేసుకుంటూ కోట్ల రూపాయల అవినీతికి వసంత పాల్పడుతున్నారని, ఇందుకు అధికార యంత్రాంగాన్ని సైతం వినియోగించుకుంటున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో వసంత అవినీతిపై పోరాటం చేస్తామని తెలిపారు. కొండపల్లిలో ఇసుక దోపిడి, మత్య్సకారుల ఇళ్లు ఖాళీ చెయ్యించడంతోపాటు అక్రమంగా చేసే ఇసుక రవాణాల గురించి వసంత ఏం చెబుతారని నిలదీశారు. కొండపల్లి ప్రజలకు దేవినేని ఉమా ద్రోహం చేస్తున్నారన్నారని మాట్లాడటం వెనుక రాజకీయం ఏంటని నిలదీశారు. కొండపల్లి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలు అన్ని కూడా కుళ్లిపోయాయని ధ్వజమెత్తారు. బూడిద రవాణాపైన వెంటనే చర్యలు తీసుకోవాలని... పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు. ఎమ్మెల్యే ఎంత పనికి మాలీన వాడు కాబట్టే కనీసం అధికారులు కూడా మాట వినటం లేదని ఎద్దేవా చేశారు.

ఇప్పుడే ఎందుకు ఇలా....

మూడు సంవత్సరాల కాలంలో దేవినేని, వసంత మధ్య ఇంత స్థాయిలో రాజకీయాలు లేవు. అయితే ఇటీవల వసంతకు మంత్రి జోగికి మధ్య రాజకీయపరమైన పంచాయితీ జరిగింది. దీన్ని కేంద్రంగా చేసుకొని టీడీపీ పావులు కదిపింది. ఇందులో భాగంగానే దేవినేని ఉమా వసంతను టార్గెట్ చేశారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావటంతో జోగిని దేవినేని టచ్ చేయలేదని, తన వర్గానికి చెందిన వ్యక్తి కావటంతోపాటుగా, వసంత వలనే తాను పరాజయం పాలయ్యాను కాబట్టి, అదే కోణంలో దేవినేని రాజకీయం మొదలు పెట్టారని అంటున్నారు. వసంత కూడా జోగి ఎపిసోడ్ రాజకీయంగా చర్చనీయాంశం కావటంతో దాని నుంచి బయటకు వచ్చేందుకు దేవినేనిని టార్గెట్‌గా చేసుకొని రాజకీయం మొదలు పెట్టారని ప్రచారం జరుగుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP DesamTirupati Special Herbal Soup | తిరుపతిలో ప్రాచుర్యం పొందుతున్న హెర్బల్ సూప్ కార్నర్ | ABP DesamIdeas of India 2025 | ఎలన్ మస్క్ గురించి గోయెంకాల వారసుడు ఏం చెప్పారంటే | ABP DesamIdeas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Andhra Pradesh Group 2 Exam: 23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
Sourav Ganguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
Embed widget