అన్వేషించండి

విద్యలో నాణ్యత పెంచడం ప్రధాన లక్ష్యం: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యమని సీఎం జగన్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యమని సీఎం జగన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి సచివాలయం కార్యాలయంలో ఈ మేరకు ఎంవోయూ పై సీఎం జగన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.... ప్రభుత్వ విద్యా రంగంలో మరో విప్లమాత్మక అడుగు ముందు పడిందని వెల్లడించారు. ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులోకి ఐబీ సిలబస్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ప్రభుత్వ బడిలో చదువుకునే పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ సిలబస్ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఐబీ సిలబస్ ప్రవేశంపై విధి విధానాలు, మార్గదర్శక ప్రణాళికలు తయారు చేయాలని ఇప్పటికే సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఐబీ సిలబస్ ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అవి సంస్థతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ పై సంతకాలు చేయనున్నారు. ఇందుకోసం సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యుకే  నుంచి ఐబీ సంస్థ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ఐబీ సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతూ... " మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం మీ సహకారాన్ని కోరుతున్నా. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఐబీ సిలబస్ అన్నది సవాల్ తో కూడుకున్న పని. అందులోనూ ప్రభుత్వ స్కూల్ లలో ప్రవేశపెట్టడం అన్నది మరింత సవాల్ తో కూడుకున్న పని. కానీ సంకల్పం ఉంటే సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం. స్కూళ్లను బాగు చేయడం దగ్గర నుంచి డిజిటలైజేషన్ వరకు అనేక చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ప్రతిరోజు ఒక పిరియడ్ టోఫెల్ పరీక్షకు శిక్షణ ఇస్తున్నాం. అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఐబీని కూడా తీసుకువచ్చాం. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు. ఒకటో క్లాస్తో మొదలుపెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయి. ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది. దిగువ స్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ప్రభుత్వ ఉద్దేశం. ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న" అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో విద్యా రంగం కోసం వేల కోట్లలో ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ వ్యాకరించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి కావాల్సిన చదువును అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐబీ డైరెక్టర్ జనరల్ ఒల్లి పెక్కా హీనోనెన్, ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మాట్ కాస్టెల్లో తదితరులు పాల్గొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Cases against KTR: ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!

వీడియోలు

Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget