అన్వేషించండి

Amaravati Capital : సెంటు స్థలాలిస్తే ఇక అమరావతే రాజధానా ? ప్రభుత్వం ఈ లాజిక్ మర్చిపోయిందా ?

రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు అనే వాదన వల్ల వైసీపీ రాజధానిగా అమరావతికి అంగీకరించినట్లే అయిందా ? కోర్టులో మూడు రాజధానుల్ని ఎలా సమర్థించుకుంటారు ?

Amaravati Capital  :  రాజధానిలో పేదలు ఉండకూడదా అని ప్రశ్నిస్తూ.. రాజదాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో రైతులు ఇచ్చిన భూముల్లో సెంటు స్థలాలను ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తోంది. ప్రశ్నించిన విపక్షాలపై అదే ఎదురుదాడి చేస్తోంది. ఇంకా సుప్రీంకోర్టులోనూ అదే వాదన వినిపించింది. రాజధానిలో పేదలకు కేటాయించిన ఐదు శాతం భూముల్లోనే స్థలాలు ఇస్తున్నామని చెప్పింది. దీంతో న్యాయస్థానం కూడా తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది. కానీ ప్రభుత్వ విధానం ప్రకారం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ. మరి రాజధానిలో ఇళ్ల స్థలాలని సుప్రీంకోర్టుకు చెప్పడం ద్వారా అమరావతి  రాజధానిగా ప్రభుత్వం అంగీకరించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. 

అమరావతి తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఏ వాదన వినిపిస్తుంది ? 
 
హైకోర్టు, సుప్రీంకోర్టులో రాజధానిలో  పేదలకు స్థలాలు ఇస్తున్నామని ప్రభుత్వం  చెప్పింది. రాజధానిలో పేదలకు చోటు లేదా అని వాదిందించింది. ఇదంతా రికార్డెడ్. ఈ కారణంగానే న్యాయస్థానాలు స్థలాల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోబోమన్నాయి.   అమరావతి అంశంపై హైకోర్టు తర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. వచ్చే జూలైలో విచారణ జరగాల్సి ఉంది.  అమరావతే రాజధాని అని ప్రభత్వమే అత్యున్నత న్యాయస్థానం ముందు ప్రభుత్వం స్థలాల విషయంలో  స్పష్టం చేసింది. జూలైలో జరగబోయే విచారణలో  అమరావతే రాజధాని అని పేదలకు భూములు పంచారు కదా  అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఏం చెబుతుందన్న ప్రశ్న న్యాయనిపుణుల నుంచి వస్తోంది.  రాజధానిలో అందరూ ఉండాలని పేదలకు రైతులు ఇచ్చిన భూములు ఇచ్చి ఇప్పుడు మళ్లీ రాజధాని విశాఖ అంటే.. అక్కడ భూములు కేటాయిస్తారా  అనే మౌలికమైన ప్రశ్న సహజంగానే వస్తుందని చెబుతున్నారు. 

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ - ఆ ప్రస్తావనే ఉండదు !

అమరావతి కూడా రాజధానే .. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాం అనే వాదన వినిపించడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. సుప్రీంకోర్టులో జరుగుతోంది మూడు రాజధానులపై విచారణ కాదు. సీఆర్డీఏ చట్టం అమలు, ప్రభుత్వ ఉల్లంఘనలపై జరుగుతోంది. ఒప్పందం ప్రకారం రాజధానిని అమరావతిలోనే నిర్మించాలి. రైతులకు ఒప్పందం ప్రకారం కల్పించాల్సిన ప్రయోజనాలు కల్పించాలి.  వాటిని అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వాటిని అమలు చేయకుండా రాజధానిపై వేరే చట్టాలు చేయలేరని రిట్ ఆఫ్ మాండమస్ ఇచ్చింది. అంతే కానీ మూడు రాజధానుల బిల్లు కూడా ఉపసంహరించుకున్నందున ఆ ప్రస్తావన అసలు ఉండదని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. 

అమరావతే రాజధానిగా ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు చెప్పినట్లయిందా ? 

అమరావతి కూడా రాజధానే అంటే చట్టప్రకారం చెల్లదు. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతిగా నిర్దారించారు. ఒప్పందం చేసుకున్నారు. దాన్ని అమలు చేయాలి. లేకపోతే ప్రభుత్వం ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు ద్రోహం చేసినట్లే అని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి.   మొత్తంగా పేదల ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం చేసిన వాదనలు.. అంతిమంగా ప్రభుత్వ వాదనకు వ్యతిరేకంగా..  అమరావతి రాజధానికి మద్దతుగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. జూలైలో జరిగే విచారణలో ఇదే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారితే వ్యూహాత్మ తప్పిదం చేసినట్లే అవుతుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget