అన్వేషించండి

చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై సర్వత్రా ఆసక్తి- బీజేపీ పెద్దలతోనూ భేటీకి ప్రయత్నాలు!

తెలంగాణతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమిపిస్తున్నాయ్. గులాబీ బాస్ కెసిఆర్...115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి నడిచే అంశంపై బిజెపి నేతలతో చర్చించే అవకాశం ఉంది.

టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 28న హస్తినకు వెళ్లనున్నారు. ఏపిలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. పనిలో పనిగా కేంద్ర పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కమలం పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోడీ, హోం మినిస్టర్ అమిత్ షాతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసే అవకాశం ఉంది.  2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి కూటమికి దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ అమరావతితో పాటు ఢిల్లీలో కూడా ఆందోళనలు చేశారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది. టిడిపి కేవలం  23 సీట్లకే పరిమితం అయింది.  ఆ తర్వాత టిడిపి తరపున గెలిచిన కొందరు శాసనసభ్యులు  అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీలోకి జంప్ అయ్యారు. పార్టీకి అండగా ఉండే వారిని అధికార పార్టీ టార్గెట్ చేసిందన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. అధికార పార్టీ కేసులు, ఒత్తిళ్లతో టీడీపీ నేతలతోపాటు చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ.. చాలాసార్లు ప్రధానికి లేఖలు రాశారు. పలుసార్లు కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. జగన్ కు అడ్డుకట్ట వేయాలంటే బిజెపికి దగ్గరైతేనే సాధ్యమనే నిర్ణయానికి వచ్చారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు, మోడీ...ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ మీటింగ్ లో కలిసారు. పార్లమెంట్ లో కేంద్రం పెట్టిన పలు బిల్లులకు మద్దతు ఇచ్చారు. 

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమిపిస్తున్నాయ్. గులాబీ బాస్ కెసిఆర్...115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి నడిచే అంశంపై బిజెపి నేతలతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి... ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఎక్కడెక్కడ దొంగ ఓటర్లు ఉన్నారో...వాటి జాబితాను ఎన్నికల సంఘానికి అందించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రిపోర్టును తయారు చేసుకున్నారు.

దొంగ ఓట్ల వ్యవహారంలో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా పరిషత్ సిఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురంలో ఆరు వేల దొంగ ఓట్లను చేర్పించడంతోపాటు, ఉన్న వారి ఓట్లను కూడా తొలగించిన అంశంపై  ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్...కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేశవ్ ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా ఉరవకొండ వచ్చి పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు... క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని తేల్చారు. దీంతో అతనిని సస్పెండ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. జడ్‌పి సీఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో అనంతపురంలో జడ్‌పి సీఈఓగా పనిచేసిన శోభ స్వరూప రాణిఫై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget