అన్వేషించండి

చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై సర్వత్రా ఆసక్తి- బీజేపీ పెద్దలతోనూ భేటీకి ప్రయత్నాలు!

తెలంగాణతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమిపిస్తున్నాయ్. గులాబీ బాస్ కెసిఆర్...115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి నడిచే అంశంపై బిజెపి నేతలతో చర్చించే అవకాశం ఉంది.

టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 28న హస్తినకు వెళ్లనున్నారు. ఏపిలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. పనిలో పనిగా కేంద్ర పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కమలం పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోడీ, హోం మినిస్టర్ అమిత్ షాతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసే అవకాశం ఉంది.  2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి కూటమికి దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ అమరావతితో పాటు ఢిల్లీలో కూడా ఆందోళనలు చేశారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది. టిడిపి కేవలం  23 సీట్లకే పరిమితం అయింది.  ఆ తర్వాత టిడిపి తరపున గెలిచిన కొందరు శాసనసభ్యులు  అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీలోకి జంప్ అయ్యారు. పార్టీకి అండగా ఉండే వారిని అధికార పార్టీ టార్గెట్ చేసిందన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. అధికార పార్టీ కేసులు, ఒత్తిళ్లతో టీడీపీ నేతలతోపాటు చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ.. చాలాసార్లు ప్రధానికి లేఖలు రాశారు. పలుసార్లు కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. జగన్ కు అడ్డుకట్ట వేయాలంటే బిజెపికి దగ్గరైతేనే సాధ్యమనే నిర్ణయానికి వచ్చారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు, మోడీ...ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ మీటింగ్ లో కలిసారు. పార్లమెంట్ లో కేంద్రం పెట్టిన పలు బిల్లులకు మద్దతు ఇచ్చారు. 

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమిపిస్తున్నాయ్. గులాబీ బాస్ కెసిఆర్...115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి నడిచే అంశంపై బిజెపి నేతలతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి... ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఎక్కడెక్కడ దొంగ ఓటర్లు ఉన్నారో...వాటి జాబితాను ఎన్నికల సంఘానికి అందించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రిపోర్టును తయారు చేసుకున్నారు.

దొంగ ఓట్ల వ్యవహారంలో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా పరిషత్ సిఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురంలో ఆరు వేల దొంగ ఓట్లను చేర్పించడంతోపాటు, ఉన్న వారి ఓట్లను కూడా తొలగించిన అంశంపై  ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్...కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేశవ్ ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా ఉరవకొండ వచ్చి పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు... క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని తేల్చారు. దీంతో అతనిని సస్పెండ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. జడ్‌పి సీఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో అనంతపురంలో జడ్‌పి సీఈఓగా పనిచేసిన శోభ స్వరూప రాణిఫై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Embed widget