అన్వేషించండి

చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై సర్వత్రా ఆసక్తి- బీజేపీ పెద్దలతోనూ భేటీకి ప్రయత్నాలు!

తెలంగాణతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమిపిస్తున్నాయ్. గులాబీ బాస్ కెసిఆర్...115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి నడిచే అంశంపై బిజెపి నేతలతో చర్చించే అవకాశం ఉంది.

టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 28న హస్తినకు వెళ్లనున్నారు. ఏపిలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. పనిలో పనిగా కేంద్ర పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కమలం పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోడీ, హోం మినిస్టర్ అమిత్ షాతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసే అవకాశం ఉంది.  2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి కూటమికి దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ అమరావతితో పాటు ఢిల్లీలో కూడా ఆందోళనలు చేశారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది. టిడిపి కేవలం  23 సీట్లకే పరిమితం అయింది.  ఆ తర్వాత టిడిపి తరపున గెలిచిన కొందరు శాసనసభ్యులు  అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీలోకి జంప్ అయ్యారు. పార్టీకి అండగా ఉండే వారిని అధికార పార్టీ టార్గెట్ చేసిందన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. అధికార పార్టీ కేసులు, ఒత్తిళ్లతో టీడీపీ నేతలతోపాటు చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ.. చాలాసార్లు ప్రధానికి లేఖలు రాశారు. పలుసార్లు కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. జగన్ కు అడ్డుకట్ట వేయాలంటే బిజెపికి దగ్గరైతేనే సాధ్యమనే నిర్ణయానికి వచ్చారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు, మోడీ...ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ మీటింగ్ లో కలిసారు. పార్లమెంట్ లో కేంద్రం పెట్టిన పలు బిల్లులకు మద్దతు ఇచ్చారు. 

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమిపిస్తున్నాయ్. గులాబీ బాస్ కెసిఆర్...115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి నడిచే అంశంపై బిజెపి నేతలతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి... ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఎక్కడెక్కడ దొంగ ఓటర్లు ఉన్నారో...వాటి జాబితాను ఎన్నికల సంఘానికి అందించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రిపోర్టును తయారు చేసుకున్నారు.

దొంగ ఓట్ల వ్యవహారంలో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా పరిషత్ సిఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురంలో ఆరు వేల దొంగ ఓట్లను చేర్పించడంతోపాటు, ఉన్న వారి ఓట్లను కూడా తొలగించిన అంశంపై  ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్...కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేశవ్ ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా ఉరవకొండ వచ్చి పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు... క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని తేల్చారు. దీంతో అతనిని సస్పెండ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. జడ్‌పి సీఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో అనంతపురంలో జడ్‌పి సీఈఓగా పనిచేసిన శోభ స్వరూప రాణిఫై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Entertainment Top Stories Today: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Hyderabad News: భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
Drugs Seized: మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
Embed widget