అన్వేషించండి

Polavaram CM Jagan : సీఎం జగన్ ఇవ్వలేమంటున్నారు - కేంద్రం మాకు సంబంధం లేదంటోంది ! పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బాధ్యత ఎవరిది ?

పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై వివాదం ఏర్పడింది. తాము ఇవ్వలేమని జగన్ నిర్వాసితులకు చెప్పారు. కేంద్రం మాకు సంబంధం లేదంటోంది. ఇంతకూ నిర్వాసితులకు పరిహారం ఎవరివ్వాలి ?


Polavaram CM Jagan :  పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే నిర్వాసితులకు పరిహారం, పునరావాసం పూర్తి కావాలి. లేకపోతే  డ్యాం కట్టినంత మాత్రాన అది ప్రాజెక్ట్ కాదు. ముంపు ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించిన తర్వాతనే ప్రాజెక్టులో నీళ్లు నిలపడం సాధ్యమవుతుతుంది. లేకపోతే ఏ ప్రయోజనమూ ఉండదు. ప్రాజెక్ట్ అంటే.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా. అది పూర్తయితేనే ప్రాజెక్టు పూర్తయినట్లు. అయితే పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో మొదటి నుంచి వివాదం ఏర్పడింది. కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

తాము ఇవ్వలేమని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని నిర్వాసితులకు చెప్పిన సీఎం జగన్! 

 వెయ్యో..రెండు వేల కోట్లో అయితే తానే ఏదో విధంగా సర్దేవాడినని కానీ ఇరవై వేల కోట్లకుపైగా కావాలి కాబట్టి ఆలోచిస్తున్నామని పోలవరం నిర్వాసితులకు పరిహారంపై సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని  పోలవరం ముంపు నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తూ సీఎం వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వ్యాఖ్యలు పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజల్లోనే కాదు సాగునీటి నిపుణుల్లోనూ చర్చకు కారణం అవుతున్నాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయలేదని నేరుగా సీఎం జగన్ చెప్పినట్లయింది. అయితే కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అంటున్నారు. గత మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం... ఏ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేదు. పోలవరం విషయంలోనూ అంతే. ఇక ముందు ముందు చేస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కేంద్రం ఓ స్పష్టతతో ఉంది. అదేమిటంటే.. ఆ బాధ్యత తమది కాదంటోంది. 

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో సంబంధం లేనట్లుగా కేంద్రం ప్రవర్తన !

పోలవరం జాతీయ  ప్రాజెక్ట్. నిబంధనల ప్రకారం జాతీయ ప్రాజెక్టులో 90 శాతం నిధులు కేంద్రం పెట్టుకోవాలి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా చేర్చి వంద శాతం ప్రాజెక్టు ఖర్చును భరించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం వంద శాతం పోలవరం ప్రాజెక్టు ఖర్చు కేంద్రానిదే అవుతుంది.  అయితే ప్రభుత్వం మారిన తర్వాత సీన్ మారిపోయింది. చంద్రబాబు హయాంలో సవరించిన అంచనాలకు టెక్నికల్ ఆమోదం లభించింది. అయితే ఆ అంచనాలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించకపోగా 2014 ధరల ప్రకారమే పోలవరం ఖర్చు భరిస్తామని కేంద్రం మెలిక పెట్టింది. అదే సమయంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో తమకు సంబంధం లేదని కేంద్రం చెబుతోంది. దీంతో ఈ అంశంపై పీటముడి పడిపోయింది. ఇప్పుడు పోలవరానికి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా కనిపించలేదు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంచనాలపై జగన్ ఆరోపణలు - నిర్వాసితులకు భారీ హామీైలు ! 

పోలవరం నిర్మాణ ఖర్చులో అత్యధికం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకతే. పోలవరం వల్ల దాదాపు లక్ష ఎకరాలు ముంపునకు గురవుతాయి. ఏడు మండలాలను ఏపీలో కలిపింది అందుకే . ప్రభుత్వ భూములు పోను.. ప్రైవేటు భూములు... ప్రజల ఇళ్లు, చెట్లు ఇలా అన్నింటికీ పరిహారం ఇవ్వాలి. ఇందు కోసం దాదాపుగా రూ.. ముఫ్పై వేల కోట్లకుపైగానే ఖర్చవుతుందని అంచనా. ఈ అంచనాల కారణంగా గత ప్రభుత్వం అంచనాలను పెంచి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. చివరి దశ వరకూ అంచనాకు ఆమోదం లభించినప్పుడు ప్రభుత్వం మారింది. అయితే అంచనాలు పెంచినప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతా అవినీతి కోసమేనని కేంద్రానికి ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదుల ప్రభావం కనిపించేదమో కానీ  అంచనాలను కేంద్రం తగ్గించేసింది. అర్ అండ్ ఆర్ ప్యాకేజీతో తమకు సంబంధం లేదని కేంద్రం చెబుతోంది. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి పది లక్షలు ఇస్తామన్నారు. దీంతో నిర్వాసితులు ఎక్కువ ఆశలు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తంగా వారికి ఎలాంట ిపరిహారం అందని పరిస్థితి.

కేంద్ర, రాష్ట్రాలు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకుంటే నిర్వాసితుల పరిస్థితి ఏమిటి ?

తమకు ఆర్ అండ్ ఆర్ ఇచ్చేంత స్తోమత లేదని సీఎం జగన్ నేరుగానే చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా రూ. వేల కోట్లు ఇస్తుందా అంటే చెప్పడం కష్టమే. గత మూడేళ్ల పరిణామాలను బట్టి చూస్తే ప్రభుత్వం ఒత్తిడి చేయడం కష్టం.., కేంద్రం నిధులివ్వడం అంత కంటే కష్టం అని అనుకోవచ్చు. మరి పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎలా వస్తుంది ?. ఇప్పుడిదే పెద్ద ప్రశ్నగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Embed widget