అన్వేషించండి

Sailajanath Latest News: మాజీ మంత్రి శైలజనాథ్ దారి ఎటు..? ఫ్యాన్‌ పార్టీలో చేరడం పక్కా అయిందా ?

singanamala Latest News: సెంటిమెంట్ నియోజకవర్గంలో వైసీపీ మళ్లీ మార్పునకు సిద్దమవుతోందా? చేతులు కాల్చుకున్నాక కూడా ప్రయోగానికి సిద్ధమవుతుందా? మాజీ మంత్రి శైలజానాథ్‌ను రంగంలోకి దింపుతుందా? 

Sake Sailajanath and Singanamala Latest News: అనంతపురం జిల్లాలో సింగనమల ఎస్సీ  నియో జకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్. గత 30 సంవత్సరాలుగా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత టిడిపి నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా , ఎంఎల్ఏలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచిన 2024 ఎన్నికల్లో మాత్రం జొన్నలగడ్డ పద్మావతికి వైసిపి టికెట్ దక్కలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరంజానేయులు అనే టిప్పర్ డ్రైవర్‌నీ వైసిపి బరిలోకి దింపింది. దీంతో అక్కడ వైసిపి ఓటమి చవి చూసింది. 

ఓటమి అనంతరం సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియమించింది వైసీపీ అధిష్టానం. కానీ పైకి మాత్రమే వీరాంజనేయులు పేరు కానీ నియోజక వర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త వైసీపీ నాయకుడు ఆలూరు సాంబశివ రెడ్డిదే హవా కొనసాగుతుందని  వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. 
ఇప్పుడు మరోసారి సెంటిమెంట్ సెగ్మెంట్‌లో మార్పులకు వైసిపి సిద్ధమౌతోంది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వైసిపి సింగనమల నియోజకవర్గం ఇన్చార్జిగా వీరాంజనేయులు కొనసాగుతున్నా ఆయనకు పెద్దగా ఎక్కడ సపోర్ట్ లేదు. దీంతో ఆయన ఉన్న లేనట్టే అని వైసిపి అధిష్టానం భావిస్తూండడంతో ఇక వేరే వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించింది. ఇదిలా ఉంటే, శైలజానాథ్ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందని మరో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా సింగనమలలో జరుగుతున్న మార్పులతో శైలజానాథ్ వైసీపీలోకి రానున్నారని టాక్ నడుసోతంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయట. 

2019లో పద్మావతి అదే స్థానంలో గెలిచింది. 2024లో పద్మావతిపై పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థిని వెతుక్కోవాలని చంద్రబాబు భావించడంతో చాలా మంది శైలజానాథ్‌ను తలచుకున్నారు. శైలజానాథ్‌ను తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. దానికి బదులు చంద్రబాబు శ్రావణిని ఎంపిక చేశారు. వైసీపీ జొన్నలగడ్డ పద్మావతికి బదులు వీరాంజనేయులు అనే టిప్పర్ ట్రక్ డ్రైవర్‌ను ఎంచుకుంది. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. 

Also Read: లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఇప్పుడు సింగనమలలో వైసీపీకి కొత్త నాయకుడు కావాలి కాబట్టి జగన్ మళ్లీ శైలజానాథ్‌ను పరిశీలిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించిన కారణంగానే సాకే శైలజానాథ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా 2004లో ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచారు.  2009లో మళ్లీ గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పని చేశారు. 2014లో శైలజానాథ్‌ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ అప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి శమంతకమణి కూతురు యామిని బాలకు టికెట్ కేటాయించారు. దీంతో శైలజనాథ్ కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. మరోసారి ఎంపీగా ఉన్న జెసి దివాకర్ రెడ్డి ఒకరోజు శైలజనాథ్ ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారని గట్టిగా వినపడింది. ఆ టైంలో కూడా శైలజనాథ్‌కు టికెట్ రాలేదు. ఆ స్థానంలో బండారు శ్రావణికి చంద్రబాబు టికెట్ కేటాయించారు.  దీంతో శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. 

వైసీపీలో చేరికపై శైలజానాథ్ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తొంది. శైలజానాథ్ కుమారుడుకి మరో స్థానం అడుగుతున్నట్టు ప్రచారం. ఈ సారి నియోజకవర్గాలు పెంచే అవకాశం ఉండడంతో శైలజానాథ్ తన కుమారుడు రిత్విక్‌కి ఒకస్థానం అడుగుతున్నారు అని టాక్ వినపడుతుంది. అందుకు తగ్గట్టు శైలజానాథ్ కుమారుడు కూడా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో ఈసారి శైలజానాథ్ కుమారుడిని రాజకీయ  రంగంలోకి దింపుతాడని కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. చూడాలి మరి సెంటిమెంట్ సెగ్మెంట్‌లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో.

Also Read: ఎంబీయూలోకి మనోజ్ ఎంట్రీ - పోలీసుల లాఠీచార్జ్ - పరిష్కారం చూపిస్తానని వార్నింగ్ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MAVIGUN: అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే..  --జగన్
అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే.. !  
Tamil Nadu Assembly Elections 2026: స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?
స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Ippasara Anirudh Reddy: ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?
ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Oracle Layoffs: భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
Embed widget