అన్వేషించండి

Kavitha News: 'మహిళా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారు' - మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

Women Reservations: తెలంగాణ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తోందని కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆమె లేఖ రాశారు.

BRS Mlc Kavitha Letter To Mallikarjun Kharge on Women Reservations: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో (Telangana) అధికార కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చాలా రోజుల తర్వాత మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kalavakuntal Kavitha) ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికే రాష్ట్ర పార్టీ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపిస్తూ ఓ లేఖ రాశారు.

మహిళా రిజర్వేషన్లకు మంగళం

మహిళల ఓట్లతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్(Congress) పార్టీ ఇప్పుడు వారి హక్కులనే కాలరాస్తోదంటూ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) ఆరోపించారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడబిడ్డల హక్కులను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. 1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు(Mahila Reservations) కల్పిస్తూ జీవో నెంబరు 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చిందని ఆమె గుర్తు చేశారు. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోందన్నారు. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్(Rajasthan) పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకొచ్చిందంటూ  కాంగ్రెస్(Congress) పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuana Kharge)కు కవిత లేఖ రాశారు. 

'కేసీఆర్ వద్దే వద్దన్నారు'

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా... మహిళల హక్కులను హరించబోమని 2023  కేసీఆర్(KCR) ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిందని కవిత(Kavitha) ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండానే మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకుందన్నారు. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా మారనుందని కవిత మండిపడ్డారు. ఈ ఏడాది 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని.. ఆ లెక్కన చూస్తే మహిళలకు 33.3 శాతం ప్రకారం 66 వేలకు పైగా ఉద్యోగాలు రావాలి. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల  ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సుప్రీం తీర్పును పాటించబోమని ఇప్పటికే  బిహార్, కర్నాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆడబిడ్డలకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఖర్గేకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో  కాంగ్రెస్ అధినాయకత్వం జోక్యం చేసుకుని జీవోను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఆదేశించాలని ఆమె మల్లికార్జున ఖర్గేను కోరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget