అన్వేషించండి

BRS News: 24న మహారాష్ట్రంలో సభకు బీఆర్‌ఎస్‌ విస్తృత ఏర్పాట్లు- ముందే భారీగా చేరికలు

మహారాష్ట్రలోని పార్టీలు, లీడర్ల చూపంతా 24న జరిగే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభపైనే ఉంది. అంత కంటే ముుందే ఆ పార్టీలో భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జీవన్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారు.

గులాబీ శిబిరంలో ఆపరేషన్ మరాఠా ఆకర్ష్‌ కంటిన్యూ అవుతోంది! ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నీ తానై నడిపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చింది మొదలు జీవన్‌ రెడ్డి మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలపై ఫోకస్ చేశారు. అక్కడి ప్రజలను, మాజీ ఎమ్మెల్యేలను, చోటామోటా నాయకులను తెలంగాణ బాట పట్టించడంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే నాందేడ్‌ నుంచి ఇబ్బడిముబ్బడిగా నాయకులు వచ్చి గులాబీ గూటికి చేరారు.

తాజాగా ఔరంగబాద్ జిల్లాలో సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఏ చేరిక చూసినా పక్కనే జీవన్ రెడ్డి ఉంటున్నారు. ఏ ఫోటో చూసినా జీవన్ రెడ్డే కనిపిస్తున్నారు. అంతేకాదు మరాఠా నేల మీద ఇప్పటి వరకు జరిపిన సభలన్నీ సింహభాగం జీవన్ రెడ్డే ఎగ్జిక్యూట్ చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు. తాజాగా ఈనెల 24న జబిందా మైదానంలో జరగబోయే సభా ఏర్పాట్లను కూడా జీవన్‌రెడ్డే చూసుకుంటున్నారు.   

ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న  బీఆర్ఎస్ లో చేరేందుకు వివిధ పార్టీల నేతలు  క్యూ కడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఔరంగబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రచారరథాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి యువతను ప్రగతి భవన్‌ గుమ్మం ఎక్కించడంలో జీవన్ రెడ్డి సక్సెస్ అవుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపి పార్టీలో చేరుతున్నారని ఆశన్నగారి జీవన్ రెడ్డి అంటున్నారు. ఆయన సమక్షంలో నిత్యం భారీ చేరికల పరంపర జోరుగా సాగుతోంది.

శుక్రవారం మహారాష్ట్ర లోని ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్) లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో  రాష్ట్రవాది పశ్చిమ షెహర్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్రార్, షేక్ ఫైజాన్, షేక్ ఇమ్రాన్,షేక్ అద్నాన్, రమేష్ పాటిల్, రాజ్ గైక్వాడ్, ఆకాష్ గైక్వాడ్ తదితరులు ఉన్నారు.

వీరందరికి  జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరో కార్యక్రమంలో ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్) జిల్లా కు చెందిన  వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ గూటికి చేరిన వారిలో మాలుంజా గ్రామ సర్పంచు జగదీశ్ సోలంకె , అబేద్ పటేల్, మన్సూర్ పటేల్, అనీఫ్, రాజారాం మాండే, అన్సారీలతో పాటు పలువురు ఆటో యూనియన్ సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టణ అధ్యక్షుడు వీర్ దేవరాజ్, వంచిత్ బహుజన్ అగాడి జిల్లా అధ్యక్షుడు అజయ్ మస్కి, ఔరంగాబాద్ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బన్సీలాల్ కుచే, పర్బని గ్రామ పంచాయతీ సర్పంచ్ గజానంద్, స్థానిక నాయకుడు సచిన్ సాత్ దివే, స్థానిక ఆటో యూనియన్ నాయకుడు యువరాజ్ తదితరులను జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. 24వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కాగా ఈ నెల 24వ తేదీన జబిందా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను జీవన్ రెడ్డి పరిశీలించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Who is Head Coach Amol Muzumdar | ఎవరీ అమోల్ మజుందార్..?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget