అన్వేషించండి

జనసేన సభ, అనంతర పరిణామాలపై బీజేపీ హై కమాండ్ ఆరా

జనసేన సభ తరువాత పరిణామాలు మారుతున్నాయా.. ప్రధానంగా పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ పవన్‌ని రాజకీయంగా మరింతగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంలో ఉందా...అంటే కాషాయ దళం నేతలు అవుననే అంటున్నారు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14న భారీ ఎత్తున జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చి పవన్‌కు మద్దతు తెలిపారు. మచిలీపట్టణంలో నిర్వహించిన సభలో జనం ఊహించిన దాని కన్నా ఎక్కువగానే వచ్చారు. ప్రధానంగా జనసేన అదినేత పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి నిర్వహించిన రోడ్ షోకు మరింత క్రేజ్ వచ్చింది. రాజకీయంగా నిర్వహించిన రోడ్‌లో అభిమానులు, పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే సందర్బంలో మహిళలు సైతం రోడ్ షోలో ఉత్సాహంగా పవన్‌ను చూసేందుకు వచ్చారు. దీంతో జనసేన వీరమహిళల్లో ఉత్సాహం కనిపించింది. విజయవాడ నుంచి మచిలీపట్టణం సభ వేదిక వరకు జనం పవన్ ను ఫాలో అవుతూనే ఉన్నారు. పవన్ నిర్వహించిన రోడ్ షో, మచిలీపట్టణంలో సభ ముగింపు వరకు అన్నింటిని పూర్తి వివరాలతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు వివరాలను తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులో ఉన్నవేళ పవన్ నిర్వహించిన కార్యక్రమం దాని పరిణామాలు, వచ్చిన వారిలో అభిమానులు, ఓటర్లు శాతం ఏంటి అనే వివరాలను కూడా నిఘా వర్గాల ద్వార భారతీయ జనతా పార్టీలోని పెద్దలు ఆరా తీసినట్లుగా చెబుతున్నారు..

భారతీయ జనతా పార్టీపై కీలక వ్యాఖ్యలు...

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలపై ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని పెద్దలతో సంప్రదింపులు జరిపి, కార్యక్రమాలను రూపొందిస్తే, రాష్ట్రంలోని నేతలు ముందుకు రావటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతల్లో కూడా చర్చ జరిగింది. పవన్ ఇలా మాట్లాడటానికి గల కారణాలు ఏంటనే దానిపై పార్టీ నేతల్లో కూడా వివిద రూపాల్లో చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలపై కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి కేంద్రంలోని పెద్దలు వివరాలు అడిగారని అంటున్నారు..

పవన్ ను వాడుకోవటం లేదా...

భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు కొనసాగుతున్నప్పటికి, ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య సమన్వయం లేకపోయిందని స్వయంగా పవన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏం చేయాలనే దానిపై క్లారిటి లేకుండా పోయిందన్నారు. ఇప్పటంలో నిర్వహించిన 9వ ఆవిర్బావ సభలో కూడా పవన్ భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర నాయకత్వాన్ని రోడ్ మ్యాప్ ఇవ్వాలని బాహాటంగానే అడిగారు. అయినా ఆ పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. 

పవన్ నేరుగా విశాఖపట్టణం వేదిగా ప్రదానితో సమావేశం అయ్యారు. తర్వాత ఇప్పటి వరకు వరకు ఇరు పార్టీలకు చెందిన నాయకులు మధ్య సంప్రదింపులు జరిగినట్లుగా ఎక్కడా కనిపించిన దాఖాలు లేవు. వీటన్నింటికి మించి పార్టీకి రాజీనామా చేయకముందు కన్నా లక్ష్మినారాయణ కూడా పవన్‌ను బీజేపి సరిగ్గా వాడుకోవటం లేదని, అది రాష్ట్ర నాయకత్వం వైఫల్యమని కామెంట్‌ చేశారు. దీంతో పార్టీ నేతల్లో ఇప్పటికి అదే చర్చ జరుగుతుంది. పవన్‌ను సరైన రీతిలో వాడుకొని ఉంటే, ఇప్పటికే బీజేపి ఆంధ్రప్రదేశ్‌లో బలబడి ఉండేదని పార్టీ నేతల్లో అభిప్రాయం ఉన్నప్పటికి, రాష్ట్ర నాయకత్వంలోని మరి కొందరు నేతలు ఆ దిశగా అడుగులు పడకుండా, అడ్డుతగులుతున్నారా...అనే అనుమానాలు సైతం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget