అన్వేషించండి

AP Minister Anitha: రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్‌ పిటిషన్‌, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత

AP Minister Vangalapudi Anitha: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భద్రత పేరుతో రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

Andhra Pradesh News: రాజకీయ లబ్ధి కోసమే వైఎస్‌ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ కు సరిపడా భద్రత కల్పిస్తున్నామన్న ఆమె.. 980 మందితో భద్రతా అవసరమా..? అని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. భద్రత పేరుతో జగన్‌ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని హోం మంత్రి అనిత ఎద్దేవా చేశారు. తనకు వస్తున్న ఫిర్యాదుల్లో చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దోపిడీ, దాడులు, అక్రమాలకు సంబంధించినవే ఉంటున్నాయన్నారు. జగన్‌ బాధితులు భారీ సంఖ్యలో పులివెందులు నుంచి ప్రజాదర్భార్‌కు వస్తున్నారని ఆమె వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ బాధితులు ఫిర్యాదులకు వస్తుండడం గమనార్హమన్నారు. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి స్పష్టం చేశారు. 

పంచాయతీ స్థాయి సెక్యూరిటీ కోరుతున్న జగన్‌

సీఎం స్థాయిలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలంటూ జగన్‌ కోరడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి అనిత.. ఆయన హైకోర్టును ఆశ్రయించడం దారుణమన్నారు. 980 మందితో భద్రతను కల్పించాలని జగన్‌ కోరుతున్నారని, ఆ స్థాయిలో సెక్యూరిటీ అంటే చిన్న గ్రామంలోని ఓటర్ల సంఖ్య అంతని పేర్కొన్నారు. ఒక గ్రామ పంచాయతీ అంత సెక్యూరిటీ ఆయన కావాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎంగా ఆయనకు ఇవ్వాల్సిన భద్రతను కల్పిస్తున్నామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. సీఎంగా ఉన్నప్పుడు కొనసాగిన భద్రతను కావాలని కోరడం దేనికి సంకేతమని, అంత భద్రత ఎలా ఇస్తారని ప్రశ్నింఆచరు. భద్రతకు సంబంధించి హైకోర్టులో పిటిషన్‌ వేయడాన్ని తాము తప్పు పట్టడం లేదని, కానీ, ప్రభుత్వం బురదచల్లవద్దని స్పష్టం చేశారు. కోడికత్తి దాడి జరిగిందని ఐదేళ్ల తరువాత జగన్‌కు గుర్తుకు వచ్చిందా..? అని హోం మంత్రి ప్రశ్నించారు. 
Also Read: Chandrababu : ఏపీలో యూట్యూబ్ అకాడెమీ - యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చంద్రబాబు చర్చలు

సీఎంగా ఉన్న సమయంలో ఈ కేసును ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించిన మంత్రి అనిత.. ఎన్నిసార్లు కోర్టు విచారణకు హాజరుకావాలని పిలిచినా ఎందుకు వెళ్లలేదన్నారు. రకరకాల కారణాలు చెప్పి కోర్టుకు హాజరుకాకుండా విచారణ జాప్యానికి కారణమయ్యారని విమర్శించారు. దీన్నిబట్టి జగన్మోహన్‌రెడ్డి ఆడుతున్నదంతా డ్రామాగా ఆమె కొట్టిపారేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం అసెంబ్లీలో సీట్లు ఉండాలనే విషయం జగన్‌కు తెలుసని, అయినా హైకోర్టులో కేసు వేశారన్నారు. కోర్టులో కేసులు వేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ తరహా ఆలోచనలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రిని కాదన్న విషయాన్ని గుర్తించాలని, 11 స్థానాలు గెల్చుకున్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోమన్నారు. 

Also Read: YS Jagan: చంద్రబాబు, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు - జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget