అన్వేషించండి

Telangana Politics : ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో 'బూచి'గా మారారా? పార్టీల వ్యూహాలేంటి?

Telangana Politics : తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యర్థిగా మారారు. ఆయన్ని టార్గెట్ చేస్తూనే అన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

Telangana Politics: ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌కి చంద్రబాబు బూచి పట్టుకున్నట్టు అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా తెలంగాణకు సంబంధించిన నేతలు చంద్రబాబును ఒక సాకుగా చూపిస్తూ తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వరుసగా స్టేట్‌మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. పైకి మామూలు కామెంట్స్‌లా కనిపిస్తున్నా నిజానికి వీటి వెనక ఆయా పార్టీల పెద్ద వ్యూహమే కనిపిస్తోంది అంటున్నారు ఎనలిస్ట్ లు.

నీటి ప్రాజెక్ట్‌లపై చంద్రబాబుతో యుద్దానికి సిద్ధం : రేవంత్ రెడ్డి 
తెలంగాణకు చెందిన పాలమూరు రంగారెడ్డి ప్రాజక్ట్‌కు 45 టీఎంసీల నీటి కేటాయింపుపై అభ్యంతరం చెబుతున్న ఏపీ మరోవైపు బనకచర్ల కట్టుకుంటామని చెప్పడమేంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంతో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా పోరాడతామని రేవంత్ రెడ్డి సహా మంత్రులు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో వివరించే ప్రయత్నం చేశారు. ఒకవైపు బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగదు, కేవలం వరద సమయంలో గోదావరి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని చంద్రబాబు చెబుతున్నా తెలంగాణ సీయం మాత్రం పదేపదే బనకచర్లపై అభ్యంతరాలు చెబుతున్నారు.

చంద్రబాబు గోదావరిని దోచుకెళ్లిపోతున్నారు:బీఆర్‌ఎస్‌ 
బీఆర్‌ఎస్ వాదన మరోలా ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వారు ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు గోదావరి నీటిని ఏపీకి దోచుకెళ్ళి పోవాలని చూస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఘాటుగా స్పందిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావు ఎన్నిక వెనుక చంద్రబాబు ప్రభావం ఉందని BRS సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి. డీకే అరుణ, ఈటెల రాజేందర్, రాజా సింగ్ లాంటి వాళ్ళను పక్కనబెట్టి చంద్రబాబు అనుకూలుడైన రామచందర్‌రావుకి ఆ పదవి ఎలా ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి చంద్రబాబు రామచంద్రరావు మధ్య అలాంటి సాన్నిహిత్యం ఉన్నట్టు కనిపించదు.

నాలుగేళ్లు గడిస్తే చంద్రబాబు లేవలేడు: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
బిజెపి కూడా తెలంగాణలో చంద్రబాబు ముద్ర పడకుండా ఉండడం కోసం తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. నాలుగేళ్లు గడిస్తే చంద్రబాబు ఇంట్లోంచి లేవలేడని అలాంటప్పుడు ఆయన ప్రభావం తమపై ఎందుకు ఉంటుందని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గట్టిగా విమర్శించారు. తమ పార్టీకి అధ్యక్షుడ్ని నియమించాలంటే చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం లేదని తమ అధిష్టానానికి లేదని కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు వాళ్లు చెబుతూ వస్తున్నారు.  

తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని కాంట్రాక్టులు ప్రాజెక్టులు అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించడం తాజాగా సంచలనమైంది. మంచిగా చెబితే వాళ్ళు మాట వినరని అలాంటి వాళ్లకు నల్లా కనెక్షన్లు, కరెంట్ కనెక్షన్‌లూ కట్ చేయాలని తీవ్రమైన విమర్శలు చేశారాయన.

చంద్రబాబు చుట్టూ తెలంగాణ పాలిటిక్స్- రీజన్ అదే
విచిత్రంగా పార్టీలకు అతీతంగా అందరూ చంద్రబాబుని తెలంగాణలో టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీని వెనుక తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్ళీ పైకి తీసుకువచ్చి ఓటర్ పోలరైజేషన్ చేయడం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నంగా ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. త్వరలో తెలంగాణలో జిహెచ్ఎంసి లాంటి ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ సెటిలర్ల ఓట్లు పార్టీల వారీగా చీలిపోయినా తెలంగాణ ఓటింగ్ మాత్రం తమకే దక్కాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. ఇటీవల చంద్రబాబు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో తెలంగాణలో పోటీ చేసే అంశంపైన దృష్టి పెడుతున్నట్టు తెలిపారు. దానితో అలర్ట్ అయిన తెలంగాణ పొలిటికల్ పార్టీలు ముందుగానే తెలంగాణ ఓటర్లను తమవైపు ఆకర్షించడం కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే జరుగుతున్న ప్రతి రాజకీయ పరిణామాన్ని చంద్రబాబుతో ముడిపెట్టి లబ్ధి పొందాలని తెలంగాణలోని పొలిటికల్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులకు దారి తీస్తాయో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget