అన్వేషించండి

YSRCP, BJP And TDP : ఏపీలో అన్నీ పార్టీలదీ ఒకే మాట - మళ్లీ ఇలాంటి సందర్భం వస్తుందా ?

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించే విషయంలో ఏపీలో అన్నిరాజకీయ పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయి. మరోసారి ఇలాంటి సందర్భం రావడం కష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

YSRCP, BJP And TDP :  ఆంధ్రప్రదేశ్‌లో అధికార , ప్రతిపక్ష పార్టీలు ఒకే మాట ఉన్న సందర్భాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి సందర్భం మంగళవారం చోటు చేసుకుంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ద్రౌపతి ముర్మును ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేరుగా మద్దతు  ప్రకటించింది. ఆ పార్టీ నేతలు ఆమె నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వెంటనే నిర్ణయం తీసుకోలేదు. సోమవారం మాత్రమే చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమీక్షించి సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.

చివరి నిమిషంలో ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటన ! 

రాష్ట్రపతి అభ్యర్థులు రాష్ట్రాలకు వచ్చి తమకు మద్దతు ప్రకటించిన వారితో మర్యాపూర్వకంగా సమావేశం కావడం మద్దతు ఇవ్వాలని కోరడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రకారం ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ఖరారైన తర్వాత వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినతిధులతో సమావేశం ఉంటుందని అనుకున్నారు. అయితే ఆమె విజయవాడకు వచ్చే ఒక్క రోజు ముందుగా తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించడంతో  వారు ఏర్పాటు చేసిన సమావేనికి కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ద్రౌపది ముర్ము అమరావతి వచ్చారు. సీఎం జగన్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన తర్వాత ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన  సమావేశంలో పాల్గొన్నారు. తనకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.  

వైఎస్ఆర్‌సీపీతో పాటు టీడీపీ సమావేశానికీ బీజేపీ నేతల ప్రాధాన్యత 

వైఎస్ఆర్‌సీపీ ఏర్పాటు చేసిన సమావేశానికి  బీజేపీ రాష్ట్ర నేతలు కూడా హాజరయ్యారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ రాష్ట్ర నేతలుహాజరయ్యారు.  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వేదిక మీద కూర్చున్నారు. కిషన్ రెడ్డి చంద్రబాబు ముర్ము అందరూ మాట్లాడారు. గిరిజన మహిళకు మద్దతు ప్రకటించడం అదృష్టమని అచ్చెన్నాయుడు ప్రకటించారు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ సోము వీర్రాజు మాట్లాడారు. గతంలో ఎన్జీఏలో ఉన్న సమయంలో అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి చాలా స్వల్ప సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. అవేమీ నిర్ణయాత్మకం కాదు. అయినప్పటికీ టీడీపీ ఆత్మీయ సమావేశానికి బీజేపీ నేతలు కూడా అందరూ హాజరయ్యారు. 

ఈ  ఏకాభిప్రాయం ఏపీ పార్టీల్లో మళ్లీ రావడం కష్టమే !

బీజేపీని వ్యతిరేకించడానికి ఏపీలో  రాజకీయ పార్టీలు సిద్దంగా లేవన్న విమర్శలు ఉన్నాయి. అయితే గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికవుతూండటం...  ప్రతిపక్ష పార్టీల తరపున నిలబడిన యశ్వంత్ సిన్హాకు పెద్దగా మద్దతు లభించకపోతూండటంతో ద్రౌపది ముర్ముకే- మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలు నిర్ణయించుకున్నారు. జనసేన తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకు ఓటు హ క్కు ఉంటుంది. అయితే ఆయన వైఎస్ఆర్‌సీపీలో అనధికారికంగా చేరిపోయారు. ఈ కారణంగా రాష్ట్రపతి ఎన్నికల విషయంలో జనసేన ఎలాంటి ప్రకటన చేయలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?SRH vs PBKS Match Preview IPL 2025 | పరాజయాల పరంపరలో పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసురుతుందా..?Rohit Sharma Panic Delhi Thunderstorm | ముంబై మ్యాచ్ ప్రాక్టీస్ లో సుడిగాలి బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్  పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
Love Story: ప్రేమిస్తే సినిమా చూపించాడు ఈ ప్రేమికుడు - కాకపోతే ఇంకా వైల్డ్ గా - వీడియో చూస్తే షాకే !
ప్రేమిస్తే సినిమా చూపించాడు ఈ ప్రేమికుడు - కాకపోతే ఇంకా వైల్డ్ గా - వీడియో చూస్తే షాకే !
Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
Embed widget