అన్వేషించండి

3 Years of YSR Congress Party Rule : పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా మారిన సచివాలయ వ్యవస్థ ! మేలు జరుగుతుందా ? కీడు చేస్తుందా ?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడగానే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పంచాయతీలకు మేలు జరుగుతుందా ? కీడు చేస్తుందా ?

3 Years of YSR Congress Party Rule :  ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతి రెండు వేల మందికి ఓ గ్రామ, వార్డు సచివాలయం ఉంటుంది. ఆ పరిధిలో ప్రజలకు అన్ని రకాల సేవలు చేస్తుంది. అధికారాలన్నీ ఆ గ్రామ సచివాలయ సిబ్బందికి ఉంటాయి. మరి పంచాయతీలు ఏం చేస్తాయి ?. ఈ ప్రశ్న మొదటి నుంచీ వస్తోంది. చివరికి కోర్టుకు కూడా ఇదే సందేహం వచ్చింది. కానీ సమాధానం మాత్రం దొరకలేదు. సీఎం జగన్ పాలన మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సచివాలయ వ్యవస్థ.. పంచాయతీలను నిర్వీర్యం చేయడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా ? 

పంచాయతీ అధికారాలు గ్రామ సచివాలయాలకు !
 
సచివాలయ వ్యవస్థ ఏర్పడిప్పుడే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోతాయన్న ఆందోళన గ్రామాల్లో కనిపించింది.   పంచాయతీరాజ్‌ వ్యవస్ధ అమల్లో ఉండగా.. పంచాయతీల్ని కాదని సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  రాష్ట్రంలో సమాంతర వ్యవస్ధ ఏర్పాటు ఎందుకని అనేక మంది ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం పథకాల అమలు కోసం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని ప్రకటించిం. కానీ  పంచాయతీలతోనే అమలు చేయించ వచ్చు కదా అని ప్రశ్నలు సహజంగానే వవచ్చాయి. 

జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసిన హైకోర్టు !


సర్పంచ్‌ల అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవడం కూడా వివాదాస్పదమయింది. సచివాలయాల ద్వారానే గ్రామాల్లో పాలన సాగుతోంది. అయితే ఇప్పటివరకు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత పంచాయితీరాజ్ పరిధిలో వుండగా ఇటీవల జీవో నెంబర్ 2 ద్వారా రెవెన్యూ శాఖకు బదలాయించారు. దీంతో వాలంటీర్లతో పాటు మిగతా సచివాలయ సిబ్బంది రెవెన్యూ వ్యవస్థలోకి బదలాయించడం ద్వారా సర్పంచ్ ల అధికారాలను కత్తిరించింది ప్రభుత్వం.  దీనిపై కోర్టుల్లో కేసులు పడ్డాయి. హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేసింది. 
 

అధికారాలన్నీ గ్రామ సచివాలయానికే !

పంచాయతీరాజ్‌ వ్యవస్థలో గ్రామ పంచాయతీ పాలన సెక్రటరీ, ఈవోపీఆర్‌డీ, డీఎల్‌పీవో, డీపీవో స్థాయిల్లో ఉంటుంది. ప్రస్తుతం సంక్షేమ పథకాలు, ఇతర పౌర సేవలన్నీ సచివాలయానికి దఖలైపోయాయి. అభివృద్ధి పనులు మాత్రమే ఉంటాయి. దీనిపై గ్రామ స్థాయిలో సర్పంచ్‌ పాలకవర్గం అజమాయిషీ కూడా ఉంటుంది. ఇక వీరి బాధ్యతలు, అధికారాలు అంతంత మాత్రమే. సర్పంచ్‌కు కూడా సచివాలయం మీద పెత్తనం ఉండే అవకాశం లేదు. సర్పంచ్‌లూ నామమాత్రమేసర్పంచుల అధికారం కూడా నామమాత్రం అవుతుందనే ప్రచారం ఉంది. సంక్షేమ, పౌర సేవలకు కేంద్రంగా మారిన సచివాలయం మీద వారికి పెత్తనం లేదు. అది రెవెన్యూ పరిధిలో ఉండడంతో రిక్వెస్ట్‌ చేయగలరేకానీ పర్యవేక్షణ చేయలేరు. పైగా ప్రజలు నేరుగా వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే సచివాలయం నుంచి ఏ పథకమైనా అమలవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా సర్పంచులను పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. 

గ్రామ స్వరాజ్యం కోసమేనంటున్న ప్రభుత్వం !
 
గ్రామ, వార్డు సచివాలయాలు గ్రామ స్వరాజ్యంలో భాగమని ప్రభుత్వం చెబుతోంది. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినవి మాత్రమేనని కోర్టు కొట్టి వేసిన జీవోను మళ్లీ లోపాలు దిద్దుకుని రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గాంధీజీ చెప్పే గ్రామ స్వరాజ్యం పంచాయతీలకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చినప్పుడే వస్తుందని ఇతరపార్టీలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రానికి ప్రభుత్వ ఎలాగో.. గ్రామాలకు పంచాయతీలు అలాగే ప్రభుత్వమని .. ఏదైనా స్థానిక ప్రభుత్వాల ద్వారానే జరగాలి కానీ ఇలా ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఏమిటన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం  తాము మహాత్ముడి అడుగుజాడల్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని ప్రకటిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Navratri 2024: శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
Embed widget