అన్వేషించండి
AP Rains: రాయలసీమలో వరద బీభత్సం.. మరీ ఇంత దారుణమా..!
AP_Rains1
1/10

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని దాటింది. వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడిన ప్రభావం ఏపీ, తమిళనాడును కుదిపేశాయి.
2/10

భారీ వర్షాల వల్ల తిరుమలలో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని.. తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 ఏళ్లలో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
3/10

భారీ వర్షాలకు పెన్నా నది పోటెత్తడంతో వరదనీరు నెల్లూరుపై ప్రతాపం చూపించింది. ఇప్పటికే నెల్లూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే నెల్లూరు-ముంబయి హైవే వరద నీటిలో మునిగిపోగా.. తాజాగా నెల్లూరు - విజయవాడ రహదారి మార్గానికి ఏకంగా గండి పడింది.
4/10

శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు.
5/10

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఇప్పటివరకూ 24 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు.
6/10

సహాయ చర్యల్లో పాల్గొనేందుకు నెల్లూరుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లోని ఓ కానిస్టేబుల్ వరద నీటిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని బుచ్చి మండలం దామరమడుగు వద్ద జరిగింది.
7/10

కడప- కమలాపురం మార్గంలో పాపాగ్ని బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. ఈ వంతెన ఏ క్షణంలో నైనా కుప్పకూలే ప్రమాదం ఉంది. బ్రిడ్జి వద్ద పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
8/10

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించావరు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిస్థితి సమీక్షించారు.
9/10

వేలాది మంది ఆశ్రయం కోల్పోగా.. పలు జిల్లాల్లో ఇళ్లల్లో వరద నీరు నిలిచిపోయింది.
10/10

తిరుమల పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆహారం, తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Published at : 21 Nov 2021 03:35 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















