అన్వేషించండి
In Pics: మళ్లీ ఒకే వేదికపై చంద్రబాబు - పవన్, కలిసి చెట్లు నాటిన నేతలు
AP News: శుక్రవారం మంగళగిరిలో జరిగిన వనమహోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రాబాబునాయుడితో కలిసి పాల్గొని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

వనమహోత్సవంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్
1/12

వనమహోత్సవం సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్లో సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సియం పవన్ కల్యాణ్ గారు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొక్కలు నాటారు.
2/12

‘‘ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి.. ఆ మొక్కకి మీ అమ్మ పేరు పెట్టి సంరక్షించండి. మేం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇస్తాం. గత ప్రభుత్వ హయాంలో రూ.19 వేల కోట్ల ఎర్రచందనం, సహజ వనరలు దోపిడీ జరిగింది. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే బాధ్యతను తీసుకుందాం. మొక్కలను పెంచడం, సంరక్షించడం అలవాటుగా తీసుకోవాలి. తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో పచ్చదనం పెంచుతాం’’ అని చంద్రబాబు అన్నారు.
3/12

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘అరణ్య కాండమ్ చదివితే మొక్కలు, చెట్ల విశిష్టత తెలుస్తుంది. చెట్లు నుంచి మనం ప్రతి రోజూ ఎంత ప్రయోజనం పొందుతున్నామో అర్ధం అవుతుంది. వృక్షాలకు మనం ఎంత రుణపడ్డామో తెలుస్తుంది. చెట్టును పదిమంది సంతానంతో సమానంగా చూస్తారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్టును ఇంటి పెద్ద కొడుకుగా భావిస్తారు. ఓ చెట్టు చేసే మేలు అంతాఇంతా కాదు. పచ్చదనంతో రాష్ట్రం సుందరంగా, శుభకరంగా ఉంటే అది ప్రజలందరికీ మంచిద’’ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
4/12

‘‘పర్యావరణాన్ని ప్రేమించి, దాన్ని పరిరక్షించడం నా మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఓ మొక్కను నాటి, దాని పరిరక్షణ బాధ్యతలు తీసుకోవడం అదృష్టంగా భావిస్తాను. ప్రతి ఏటా నేను సొంతంగా మొక్కలు నాటి, వాటి పరిరక్షణ చూసేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం తరఫున రాష్ట్రం మొత్తం మీద కోటి మొక్కలు నాటే మహా క్రతువును ప్రారంభించడం సంతోషంగా ఉంది. వన మహోత్సవ సమయంలో వరుణుడు కూడా కరుణ చూపడం మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది’’ అని అన్నారు
5/12

‘‘ఒక చెట్టును కూల్చడం తేలిక. కాని అది పెరడగానికి ఏళ్లు పడుతుంది. మూడు కాళ్ల ముదుసలి అని చిన్పప్పుడు పాఠం ఉండేది. ఓ ముదుసలి వ్యక్తి తినేసిన మామిడి టెంకను ఓ దారిలో నాటుతుంటే అటువైపుగా వెళ్తున్న మహారాజు ఆ ముదుసలిని చూసి నవ్వుతాడు. ఈ వయసులో కూడా మామిడి ఫలాలు అనుభవించడానికి చెట్లను నాటుతున్నాడని అవహేళన చేస్తాడు. కాని ముదుసలి తాత నవ్వుతూ నేను మొక్కను నాటుతోంది ఫలాల కోసం కాదు... భావితరాల కోసం అని చెబుతాడు. ఆ మాట సత్యం. ప్రతి ఒక్కరూ భావితరాల కోసం మొక్కలు నాటాలి’’
6/12

‘‘ముఖ్యమంత్రి ద్వారా వన మహోత్సవ ప్రతిజ్ఞ చేయాలని భావించాము. గౌరవ ముఖ్యమంత్రి గారు పాఠశాల విద్యార్థుల ద్వారా చేయిద్దాము. భావి తరాలకు పచ్చదనం ప్రాముఖ్యం తెలుస్తుందనే ఆలోచనతో చేశారు. భావి తరాలు ఉన్నతంగా ఉండాలనే ఆలోచన ఉంది. మనం ఎంత జాగ్రత్తగా గత తరాల నుంచి ప్రకృతిని పొందామో.. అంతే జాగ్రత్తగా భావి తరాలకు అందించాలి
7/12

గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు నరికేసింది. చెట్టు నరకడం తేలికే. అయితే ఒక చెట్టు పెరగడం ఎంతో కష్టం. ఆ చెట్టు ఇచ్చే ఫలితాలు ఎంతో విలువైనవి. మన రాష్ట్రంలో 29 శాతం పచ్చదనం ఉంది. దీన్ని 50 శాతానికి పెంచాలి.
8/12

దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. నవంబరు నెల కార్తీక వనసమారాధనల వరకు ఈ వన మహోత్సవం సాగుతుంది. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను పెంచి, అవి పెద్దవి అయ్యేలా సంరక్షణ కూడా తీసుకోవాలి.
9/12

సమష్టిగా మొక్కలను పెంచడం మేలు. మొక్కలను నాటిన వెంటనే పెద్దవి కావు కానీ... వాటి ఫలాలు వచ్చే తరానికి అందుతాయి.
10/12

కూటమి ప్రభుత్వంలో మొక్కల పెంపకం మీద ఎక్కువగా దృష్టి పెడతాం. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటేలా చూడాలి. తక్కువ స్థలంలో, అడవులు పెంచే పద్ధతిని అవలంభించాలి.
11/12

జపాన్ కు కెందిన మియావకీ ఫారెస్ట్ మెథడ్ లో తక్కువ విస్తీర్ణంలో, తక్కువ ఖర్చుతో అడవుల్ని పెంచే పద్ధతి ఉంది. ఈ పద్ధతి వల్ల వేగంగా అడవులు, పచ్చదనం పెరుగుతుంది. రాబోయే అయిదేళ్లలో అడవులను తలపించే వనాలు సిద్ధం అవుతాయి.
12/12

వీటిపై ప్రతి ఒక్కరం దృష్టిపెడదాం. దీనిపై ఓ విధానాన్ని, సూచనలను ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతాం’’ అన్నారు.
Published at : 30 Aug 2024 09:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion