అన్వేషించండి

US warning to Pakistan: ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక

General Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌కు అమెరికా కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఆర్థిక ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

US warning to Pakistan General Asim Munir : పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, అతిగా అధికార ప్రయోగం, ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో పెట్టడం,  2024 ఎన్నికల్లో హింస,  అమెరికాలోని పౌరులపై  దాడులు  వంటి ఆరోపణలతో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్,  ప్రభుత్వ అధికారులపై అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. 44 మంది బైపార్టిసన్ US కాంగ్రెస్ సభ్యులు, ప్రమిలా జయపాల్, గ్రెగ్ కాసార్ నేతృత్వంలో డిసెంబర్ 3న రాష్ట్ర కార్యదర్శి మార్కో రూబియోకు లేఖ రాశారు. గ్లోబల్ మాగ్నిట్స్కీ చట్టం ప్రకారం వీసా నిషేధాలు,  ఆస్తి జప్తుచేయడం, ఆర్థిక ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.  ఈ చర్యలు US-పాక్ సంబంధాల్లో  ఉద్రిక్తతకు దారితీస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.                         

డెమొక్రటిక్ కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమిలా జయపాల్, రిపబ్లికన్ గ్రెగ్ కాసార్ నేతృత్వంలో 44 మంది సభ్యుల లేఖలో మునీర్, ఇతర పాకిస్తాన్  అధికారులు  US పౌరులు, రెసిడెంట్లు పాక్ మిలిటరీని విమర్శిస్తే వారి కుటుంబాలపై దాడులు  చేస్తున్నారని ఆరోపించారు.  US పౌరులపై మునీర్ ప్రభావిత దాడులకు అమెరికా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు.  ఇటీవలి US-పాక్ సమావేశాలు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తాయని ప్రశ్నించారు.  ఇమ్రాన్ ఖాన్ వంటి రాజకీయ ఖైదీల విడుదలకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. పై ఏమి చేస్తారు?  అని ప్రభుత్వాన్ని నిలదీశారు.                  

 పాకిస్తాన్‌లో అధికార దుర్వినియోగం పెరుగుతోంది. విపక్ష నాయకులు, జర్నలిస్టులు, సామాన్య పౌరులను టార్గెట్ చేస్తున్నారు.  ఈ హెచ్చరిక మార్చి 2025లో ప్రవేశపెట్టిన  పాకిస్తాన్ డెమాక్రసీ యాక్ట్ కు కొనసాగింపుగా వచ్చింది.  ఆ బిల్లులో మునీర్‌ను  రాజకీయ వ్యతిరేకులపై తప్పుడు కేసులు, శిక్షలకు బాధ్యులుగా చేర్చారు.  180 రోజుల్లో ఆంక్షలు విధించాలని కోరారు. ఇమ్రాన్ ఖాన్  ఆగస్ట్ 2023 నుంచి జైలులో  పొలిటికల్ ప్రిజనర్ ఉన్నారని ఆయనను విడుదల చేయాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది.                 

పాక్ లో అమెరికన్లపై దాడులు పెరుగుతున్నాయి. అమెరికా జాతీయుడైన  జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ కుటుంబాన్ని అపహరించారు. మిలటరీలో అవినీతి గురించి నూరాని కథనాలు రాశారు.  అలాగే పాక్-అమెరికన్ మ్యూజిషియన్ సల్మాన్ అహ్మద్ బంధువులను కూడా కిడ్నాప్ చేశారు.  FBI జోక్యం తర్వాత విడుదల చేశారు. అలాగే బలూచిస్తాన్ సహా పలు చోట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు పాక్ సైన్యమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. 

అయితే పాక్ ప్రభుత్వం, మిలిటరీ ఈ లేఖను పాక్ సార్వభౌమత్వంపై దాడిగా చెబుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ను వదిలి పెట్టేది లేదని అంటున్నారు. ఇమ్రాన్ ను వదిలి పెట్టకపోతే అమెరికా పాక్ పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.                

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Advertisement

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget