అన్వేషించండి

Sri Lanka Crisis : శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం, మరోసారి సాయం అందించేందుకు హామీ!

Sri Lanka Crisis :శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు భారత్ మరింత సాయం అందించనుంది. ఇప్పటికే 4 బిలియన్ డాలర్ల సాయం అందించిన భారత్ మరింత సాయం అందిస్తామని ఇవాళ్టి దౌత్యవేత్తల సమావేశంలో హామీ ఇచ్చింది.

Sri Lanka Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ మరో అడుగు ముందుకేసింది. భారత దౌత్యవేత్త గురువారం శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాన మంత్రితో చర్చలు జరిపారు. భారత్ ఇప్పటికే 4 బిలియన్ డాలర్ల రుణాలు, ఇతర సాయం అందించింది. తాజాగా మరింత సాయం అందించేందుకు శ్రీలంకకు భారత్ సూచనలు ఇచ్చింది. శ్రీలంక ఏడు దశాబ్దాలలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, ఔషధాలతో సహా నిత్యావసరాల దిగుమతికి విదేశీ మారకద్రవ్యం కొరత ఏర్పడింది. 

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ద్వీప దేశం 

ద్వీప దేశమైన శ్రీలంక 22 మిలియన్ల మంది ప్రజలకు ప్రాథమిక అవసరాలను తీర్చడానికి రాబోయే ఆరు నెలల్లో సుమారు 5 బిలియన్లు డాలర్లు కావాల్సి ఉంది. శ్రీలంకలో ఎక్కడ చూసిన పొడవాటి క్యూలు దర్శనం ఇస్తున్నాయి. విద్యుత్ కోతలు మరింత తీవ్రం అయ్యాయి. భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘేలతో చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, కనెక్టివిటీ,  ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంకకు సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు. విక్రమసింఘే, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో భారత బృందం ప్రత్యేకంగా సమావేశమైందని ప్రధాని కార్యాలయ అధికారి తెలిపారు.

ఇప్పటికే 4 బిలియన్ డాలర్ల సాయం 

"దేశంలోని ఆర్థిక పరిస్థితి, స్వల్పకాలిక దీర్ఘకాలిక సహాయ అవసరాలపై భారత ప్రతినిధి బృందం సీనియర్ అధికారులతో చర్చిస్తుంది" అని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం శ్రీలంకకు విదేశీ సహాయానికి భారతదేశం ప్రధాన వనరుగా ఉంది. 4 బిలియన్ల డాలర్లకు పైగా సాయం అందించిందని ప్రధాని విక్రమసింఘే పార్లమెంటుకు చెప్పారు.

ఐఎమ్ఎఫ్ తో చర్చలు 

ఇంధనం కోసం 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌తో సహా అదనపు మద్దతు కోసం పొరుగుదేశాలతో చర్చలు జరుపుతున్నట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. ఆహార సంక్షోభాన్ని నివారించడానికి శ్రీలంక ప్రయత్నిస్తున్నందున ఎరువులు, బియ్యం దిగుమతికి సాయం అందిస్తామని భారత దౌత్య అధికారులు తెలిపారు. 3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు కొనసాగిస్తున్నందున, చైనా, భారత్, జపాన్‌లతో సదస్సు నిర్వహించాలని యోచిస్తున్నామని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget