అన్వేషించండి

Pakistan Crisis: ఉదయం నుంచి పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో పొలిటికల్ క్రికెట్- స్లాగ్ ఓవర్స్‌లో రెచ్చిపోతున్న ఇమ్రాన్, ప్రతిపక్షాలు

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యాన్ని నిర్ణయించే జాతీయ అసెంబ్లీ సమావేశం వాయిదాలు పడుతూ సాగింది. ఉదయం నుంచి వివిధ కారణాలతో సభకు అధికార పక్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది.

పాకిస్థాన్‌లో తలెత్తిన రాజ్యాంగ సంక్షోభం ఇంకా ముగియలేదు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ వేదికగా అధికార, విపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులతో వ్యవహారాన్ని సాగదీస్తున్నారు. 

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించేందుకు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు కోర్టు ఆదేశాలతో సమావేశమైంది జాతీయ అసెంబ్లీ. దీనికి ఎన్‌ఏ స్పీకర్‌ అసద్‌ ఖైజర్‌ స్పీకర్‌గా ఉన్నారు. ఉదయం పదిన్నరకు సమావేశం స్టార్ట్ అయింది. 

సభ చర్చా సమయం స్టార్ట్ అవ్వగానే ప్రతిపక్ష నేత షెహబాజ్‌ షరీఫ్‌ పాయింట్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియ చేపట్టాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం దీని అభ్యంతరం తెలపడంతో సభ మొదటిసారి వాయిదా పడింది. 

షరీఫ్ మాట్లాడుతుండగానే పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్‌సాఫ్‌(పీటీఐ) ఎంపీ రన్నింగ్ కామెంట్రీ చెప్పారు. ఆయనో బెగ్గర్‌ అంటూ గట్టిగా అరిచారు. అడ్డుకునే వాళ్లు ఎప్పుడూ తమ నాయకుడిని ఎన్నుకోలేరూ అంటు గట్టిగా నినదించారు. దీంతో ప్రతిపక్షం గొడవ చేయడం స్టార్ట్ చేసింది. ఈ గందరగోళం మధ్యే మొదటిసారి సభ వాయిదా పడింది. 

వాయిదా పడిన తర్వాత అధికార ప్రతిపక్షాలు స్పీకర్‌ను కలిశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిగతా ప్రక్రియను పూర్తి చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇందులో విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ, అమర్‌ దోగర్‌ ప్రభుత్వం తర్వాత స్పీకర్‌ను కలిస్తే... ప్రతిపక్షం తరఫున బిలావల్‌ భుట్టో జర్దారీ, రానా సనావుల్లా, అయాజ్‌ సాదిక్‌, నవీద్‌ ఖమర్‌, మౌలానా అసాద్‌ మహ్మద్‌ ఉన్నారు. 

ఈ ప్రక్రియ ఇలా సాగుతుండగానే ఇమ్రాన్ ఖాన్ పార్టీ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి అవిశ్వాసంపై ఓటింగ్‌కు వెళ్లాలన్న తీర్పుపై కోర్టుకు వెళ్లింది. ఇది రాజ్యాంగ విరుద్దమని... తీర్పును పునరాలోచించాలని విజ్ఞప్తి చేసింది. 

రివ్యూ పిటిషన్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్, సింధ్ హైకోర్టు బార్ అసోసియేషన్,  సింధ్ బార్ కౌన్సిల్‌లను ప్రతివాదులుగా చేర్చింది. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అత్యవసర క్యాబినెట్‌ సమావేశానికి పిలిచారు. అవిశ్వాస ఓటింగ్‌లో ఓడిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ ఖాన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 

ఖాన్ రాత్రి 9.00 గంటలకు మంత్రివర్గ సమావేశాన్ని పిలిచారు. ప్రధానమంత్రి నివాసంలో సమావేశం కానున్న మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించాలంటే 342 మంది సభ్యులు ఉన్న జాతీయ అసెంబ్లీలో అవిశ్వాసానికి 172 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. అంతకు మించే తమకు మద్దతు ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.  అయినా ఎక్కడా తగ్గకుండా ఇమ్రాన్‌ ఖాన్‌ చాలా దూకుడుగా రాజకీయ ఆట ఆడుతున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget