అన్వేషించండి

NASA Artemis 1 : జాబిల్లిపై ఇన్ని ప్రయోగాలు చేయటం వెనుక ఉద్దేశమేంటీ..?

ఆర్టెమిస్ 1 కోసం సర్వం సిద్ధం చేసింది నాసా. 1972 అపోలో చివరి మిషన్ తర్వాత మళ్లీ ఇప్పడే ఇలాంటి ప్రయత్నం చేసింది. యాభై ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనిషి పంపే యత్నం ఇది.

చిన్నప్పుడు చందమామ రావే...జాబిల్లి రావే అని అమ్మ గోరుముద్దలు తినిపించటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆకాశంలో దూరంగా, తెల్లగా మెరుస్తూ కనిపించే చందమామ అంటే చిన్నప్పటి నుంచి అందరికీ తెలియని ఎమోషన్. ముఖ్యంగా తెలుగు వాళ్లైతే చందమామ అంటూ ఏదో సొంత మావయ్యను పిలుచుకునేంత ఎటాచ్ మెంట్. అమావాస్య రోజు ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతూ...నిండు పున్నమి రోజు వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో ఆడుకుంటూ గడిపిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అందుకే చందమామ అంటే అందరికీ ఫేసినేషన్.  

చివరిసారి మనిషి చంద్రుడిపై అడుగుపెట్టింది 1972 డిసెంబర్ లో. అంటే ఈ డిసెంబర్ కి దాదాపు యాభై ఏళ్లైపోతోంది. ఇప్పుడు ఆర్టెమిస్ పేరుతో మళ్లీ మనిషి చంద్రుడిపై అడుగుపెట్టేందుకు నాసా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 29 న ఫ్లోరిడాలోని నాసా కు చెందిన జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 1 ను ప్రయోగించనున్నారు. సరే ఆర్టిమెస్ 1 ప్రయోగం వల్ల ఉపయోగం ఏంటీ ...అసలు ఆర్టిమెస్ ప్రాజెక్ట్ లో ఎలాంటి ప్రయోగాలు చేస్తారు అనేది తర్వాతి వీడియోల్లో మాట్లాడుకుందాం. ముందు చంద్రుడి మీద అసలు ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం.

సైన్స్ పరంగా చూసినా చందమామ మానవ జాతికి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ భూమి కాకుండా మనం అడుగుపెట్టిన ఖగోళ ప్రాంతం అదొక్కటే. భూమి సైజులో కేవలం పావు వంతు మాత్రమే ఉంటుంది మన చందమామ. భూమి నుంచి 2లక్షల 38 వేల 855 మైళ్ల దూరంలో ఉంటుంది. ఒక పెద్ద రాయిలా ఉంటుంది. గ్రావిటీ కూడా భూమితో పోలిస్తే చంద్రుడి మీద చాలా తక్కువ. అంటే భూమిపై మన బరువు వంద కిలోలు అయితే చంద్రుడి మీద 16.5 కిలోలు మాత్రమే ఉన్నట్లు ఫీలవుతాం. కారణం గ్రావిటీ. చంద్రుడికి సొంతంగా లైట్ ఉండదు. సూర్యుడి నుంచి వచ్చే కాంతిని రిఫ్లెక్ట్ చేయటం ద్వారా మనకు ఆకాశంలో అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వాతావరణం కూడా ఉండదు. ఇప్పటికీ అమెరికా పాతిన జెండాలు, అక్కడికి వెళ్లిన వ్యోమగాముల కాలి గుర్తులు కూడా అలాగే ఉండి ఉంటాయి. చంద్రుడు భూమి చుట్టూ ఓ శాటిలైట్ లా తిరుగుతూ తన గురుత్వాకర్షణ శక్తి ద్వారా మన భూమి మీద సముద్రాల కదలికలను ప్రభావితం చేస్తూ ఉంటాడు.

చంద్రుడిపై మనిషి ఎందుకీ ప్రయోగాలు 

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, మన ఇస్రో ఇలా చాలా అంతరిక్ష సంస్థలకు చంద్రుడిపై ప్రయోగాలంటే ఎన లేని ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో భూమికి హాల్ట్ లా ఉపయోగపడగలిగే ప్రాంతం చంద్రుడు మాత్రమే. ఇప్పటివరకూ మన సైన్స్‌ను వాడుకుంటూ చంద్రుడిపై మాత్రమే మనిషి సేఫ్‌గా ల్యాండ్ కాగలిగాడు. అక్కడి పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగాడు. 1972 వరకూ నాసా పది సార్లు మనిషిని చంద్రుడిపైకి సేఫ్‌గా పంపించి తిరిగి వెనక్కి తీసుకురాగలిగింది. ఇస్రో అయితే చంద్రయాన్ ద్వారా చంద్రుడిపై నీటి జాడలను కనుగొనే ప్రయోగాలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.

సో ఇప్పుడు రేపు విశ్వంలో వేర్వేరు గ్రహాలపైకి మనిషి ప్రయోగాలు జరపాలన్నా..ప్రత్యేకించి మరో మానవ ఆవాసంగా భావిస్తున్న మార్స్ పై ప్రయోగాల కోసం చంద్రుడినే మనకు వయా పాయింట్ గా మార్చుకోవాలని నాసా భావిస్తోంది. సౌర కుటుంబంలో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు భూమిపై నుంచి అంతరిక్ష ప్రయోగాల కోసం ఖర్చు చేసే కంటే...చంద్రుడిపైనే స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా వాటిని మరింత సులభతరం చేసుకోవాలని నాసా సహా అన్ని అంతరిక్ష సంస్థలు భావిస్తున్నాయి. చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు చేయటం, రియల్ స్టేట్, కమర్షియలైజేషన్  ద్వారా అటు అంతరిక్ష ప్రయోగాలతో పాటు ఇటు మనుషులకు భూమి కాకుండా రెండో శాశ్వత ఆవాస కేంద్రంగా చంద్రుడిని మార్చాలని నాసా తో పాటు అనేక ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఉవ్విళ్లూరుతున్నాయి.  

చివరిగా ఇన్నాళ్లుగా మనిషికి అంతు చిక్కని రహస్యంగా మిగిలిన పోతున్న చంద్రుడి దక్షిణ ధ్రువంపైనా ప్రయోగాలు జరపటం ద్వారా ఆర్టిమెస్ 1 మానవ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక దశకు చేరుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రాజెక్ట్ ఆర్టిమెస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అంత అటెన్షన్ ను డ్రా చేస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget