అన్వేషించండి

NASA Artemis 1 : జాబిల్లిపై ఇన్ని ప్రయోగాలు చేయటం వెనుక ఉద్దేశమేంటీ..?

ఆర్టెమిస్ 1 కోసం సర్వం సిద్ధం చేసింది నాసా. 1972 అపోలో చివరి మిషన్ తర్వాత మళ్లీ ఇప్పడే ఇలాంటి ప్రయత్నం చేసింది. యాభై ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనిషి పంపే యత్నం ఇది.

చిన్నప్పుడు చందమామ రావే...జాబిల్లి రావే అని అమ్మ గోరుముద్దలు తినిపించటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆకాశంలో దూరంగా, తెల్లగా మెరుస్తూ కనిపించే చందమామ అంటే చిన్నప్పటి నుంచి అందరికీ తెలియని ఎమోషన్. ముఖ్యంగా తెలుగు వాళ్లైతే చందమామ అంటూ ఏదో సొంత మావయ్యను పిలుచుకునేంత ఎటాచ్ మెంట్. అమావాస్య రోజు ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతూ...నిండు పున్నమి రోజు వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో ఆడుకుంటూ గడిపిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అందుకే చందమామ అంటే అందరికీ ఫేసినేషన్.  

చివరిసారి మనిషి చంద్రుడిపై అడుగుపెట్టింది 1972 డిసెంబర్ లో. అంటే ఈ డిసెంబర్ కి దాదాపు యాభై ఏళ్లైపోతోంది. ఇప్పుడు ఆర్టెమిస్ పేరుతో మళ్లీ మనిషి చంద్రుడిపై అడుగుపెట్టేందుకు నాసా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 29 న ఫ్లోరిడాలోని నాసా కు చెందిన జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 1 ను ప్రయోగించనున్నారు. సరే ఆర్టిమెస్ 1 ప్రయోగం వల్ల ఉపయోగం ఏంటీ ...అసలు ఆర్టిమెస్ ప్రాజెక్ట్ లో ఎలాంటి ప్రయోగాలు చేస్తారు అనేది తర్వాతి వీడియోల్లో మాట్లాడుకుందాం. ముందు చంద్రుడి మీద అసలు ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం.

సైన్స్ పరంగా చూసినా చందమామ మానవ జాతికి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ భూమి కాకుండా మనం అడుగుపెట్టిన ఖగోళ ప్రాంతం అదొక్కటే. భూమి సైజులో కేవలం పావు వంతు మాత్రమే ఉంటుంది మన చందమామ. భూమి నుంచి 2లక్షల 38 వేల 855 మైళ్ల దూరంలో ఉంటుంది. ఒక పెద్ద రాయిలా ఉంటుంది. గ్రావిటీ కూడా భూమితో పోలిస్తే చంద్రుడి మీద చాలా తక్కువ. అంటే భూమిపై మన బరువు వంద కిలోలు అయితే చంద్రుడి మీద 16.5 కిలోలు మాత్రమే ఉన్నట్లు ఫీలవుతాం. కారణం గ్రావిటీ. చంద్రుడికి సొంతంగా లైట్ ఉండదు. సూర్యుడి నుంచి వచ్చే కాంతిని రిఫ్లెక్ట్ చేయటం ద్వారా మనకు ఆకాశంలో అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వాతావరణం కూడా ఉండదు. ఇప్పటికీ అమెరికా పాతిన జెండాలు, అక్కడికి వెళ్లిన వ్యోమగాముల కాలి గుర్తులు కూడా అలాగే ఉండి ఉంటాయి. చంద్రుడు భూమి చుట్టూ ఓ శాటిలైట్ లా తిరుగుతూ తన గురుత్వాకర్షణ శక్తి ద్వారా మన భూమి మీద సముద్రాల కదలికలను ప్రభావితం చేస్తూ ఉంటాడు.

చంద్రుడిపై మనిషి ఎందుకీ ప్రయోగాలు 

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, మన ఇస్రో ఇలా చాలా అంతరిక్ష సంస్థలకు చంద్రుడిపై ప్రయోగాలంటే ఎన లేని ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో భూమికి హాల్ట్ లా ఉపయోగపడగలిగే ప్రాంతం చంద్రుడు మాత్రమే. ఇప్పటివరకూ మన సైన్స్‌ను వాడుకుంటూ చంద్రుడిపై మాత్రమే మనిషి సేఫ్‌గా ల్యాండ్ కాగలిగాడు. అక్కడి పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగాడు. 1972 వరకూ నాసా పది సార్లు మనిషిని చంద్రుడిపైకి సేఫ్‌గా పంపించి తిరిగి వెనక్కి తీసుకురాగలిగింది. ఇస్రో అయితే చంద్రయాన్ ద్వారా చంద్రుడిపై నీటి జాడలను కనుగొనే ప్రయోగాలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.

సో ఇప్పుడు రేపు విశ్వంలో వేర్వేరు గ్రహాలపైకి మనిషి ప్రయోగాలు జరపాలన్నా..ప్రత్యేకించి మరో మానవ ఆవాసంగా భావిస్తున్న మార్స్ పై ప్రయోగాల కోసం చంద్రుడినే మనకు వయా పాయింట్ గా మార్చుకోవాలని నాసా భావిస్తోంది. సౌర కుటుంబంలో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు భూమిపై నుంచి అంతరిక్ష ప్రయోగాల కోసం ఖర్చు చేసే కంటే...చంద్రుడిపైనే స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా వాటిని మరింత సులభతరం చేసుకోవాలని నాసా సహా అన్ని అంతరిక్ష సంస్థలు భావిస్తున్నాయి. చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు చేయటం, రియల్ స్టేట్, కమర్షియలైజేషన్  ద్వారా అటు అంతరిక్ష ప్రయోగాలతో పాటు ఇటు మనుషులకు భూమి కాకుండా రెండో శాశ్వత ఆవాస కేంద్రంగా చంద్రుడిని మార్చాలని నాసా తో పాటు అనేక ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఉవ్విళ్లూరుతున్నాయి.  

చివరిగా ఇన్నాళ్లుగా మనిషికి అంతు చిక్కని రహస్యంగా మిగిలిన పోతున్న చంద్రుడి దక్షిణ ధ్రువంపైనా ప్రయోగాలు జరపటం ద్వారా ఆర్టిమెస్ 1 మానవ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక దశకు చేరుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రాజెక్ట్ ఆర్టిమెస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అంత అటెన్షన్ ను డ్రా చేస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Sri Lanka Death Sentence: శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
Embed widget