Iraq: ఇరాక్లో ఓ పెళ్లి వేడుకలో ఘోర అగ్ని ప్రమాదం, 100 మంది సజీవదహనం
Iraq Fire Accident: ఇరాక్లో ఓ పెళ్లి వేడుకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 మంది సజీవదహనమయ్యారు.

Iraq Fire Accident:
ఘోర ప్రమాదం..
ఇరాక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోగా...150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్లోని Nineveh ప్రావిన్స్లో పెళ్లి జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే...పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడి బిల్డింగ్ అంతా అంటుకున్నాయి.
"Heartbreaking news from Hamdaniya, northern Iraq, where a devastating fire has claimed the lives of over 100 people during a wedding celebration. Among the victims are the bride and groom. #iraq #الحمدانية #العراق pic.twitter.com/TX1aJoNgPZ
— Bizhar Zubair (@BBashqaly) September 26, 2023
ఆ బిల్డింగ్ కూడా పాతది కావడం వల్ల మంటలు అంటుకున్న వెంటనే పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు ఉన్న చోట సీలింగ్ ఫ్యాన్ ముక్కలు ముక్కలై పడిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందగానే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. సహాయక చర్యలు మొదలు పెట్టింది. అయితే...మంటలు ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం..ఈ పెళ్లి వేడుకకు వందలాది మంది హాజరయ్యారు. ఈ కారణంగానే మృతుల సంఖ్య 100కి చేరుకుంది. మంటలు ఎగిసిపడగానే ఎటు పడితే అటు అందరూ పరుగులు పెట్టారు. తప్పించుకున్న వాళ్లు తప్పించుకున్నారు. కానీ కొందరు మాత్రం ఆ మంటలకు ఆహుతయ్యారు. ఆంబులెన్స్లు, మెడికల్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీలైనంత వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీ ( Mohammed Shia al-Sudani) వెల్లడించారు.
BREAKING:
— Nizam Tellawi (@nizamtellawi) September 27, 2023
100 people dead in fire during wedding in Iraq event hall, state media reports.pic.twitter.com/hd6ue0M9rf
ఇటీవలే వియత్నాం రాజధాని హనోయ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ బ్లాక్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఓ ఫ్లాట్లో నుంచి ఓ చిన్నారి అరుపులు గట్టిగా వినిపించాయని స్థానికులు చెప్పారు. వెంటనే ఆ చిన్నారిని ఎవరో పై నుంచి కిందకు తోసేశారని తెలిపారు. పది అంతస్థుల ఈ బిల్డింగ్లో పార్కింగ్ ఫ్లోర్లో మంటలు మొదలయ్యాయి. అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్లు, కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎంత మంది మృతి చెందారన్నది అధికారికంగా వెల్లడించలేదు. 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంబులెన్స్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. 70 మందిని రక్షించారు. ఘటన తీవ్రత అనూహ్యంగా పెరిగిందని, అనుకున్న దాని కన్నా మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ టీమ్లు వెంటనే అప్రమత్తమై బిల్డింగ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. కానీ...మంటలు తీవ్రతరం కావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం కలిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Also Read: నిజ్జర్ హత్యలో విదేశీ హస్తం ఉంది, భారత్పై విషం కక్కిన కెనడా సిక్కు ఎంపీ





















