అన్వేషించండి

Kim Jong Un: కిమ్ మరో దారుణం: 30 మంది అధికారుల‌కు ఉరి 

North Korea| వ‌ర‌ద‌ల కార‌ణంగా సంభ‌వించిన ప్రాణ న‌ష్టం, ఆస్థి న‌ష్టం నివారించ‌డంలో అధికారులు విఫ‌ల‌మ‌య్యార‌నే కార‌ణంతో అధికారుల‌ను ఉరితీయాల‌ని ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలు జారీ చేశారు. 

30 North Korean officials sentenced to death తీవ్రమైన క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కిమ్‌ను మించిన నాయ‌కుడు లేడు. కిమ్ నియంత చ‌ర్య‌లు నిత్యం ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తుంటాయి. ఒక్కోసారి ఆయ‌న చ‌ర్య‌లు ప్ర‌పంచాన్నే వ‌ణికిస్తుంటాయి. తాజాగా ఉత్త‌ర‌ కొరియాలో 30 మంది అధికారుల‌కు ఉరి శిక్ష విధించాల‌ని ఆ దేశాధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదేశించారు. ఈ దారుణ నిర్ణ‌యం ప్ర‌పంచాన్ని విస్మ‌యానికి గురిచేసింది. 

ఇటీవ‌ల ఉత్త‌ర‌ కొరియాలో తీవ్ర‌మైన వ‌ర్షాల‌తోపాటు వ‌ర‌ద‌లు ఆదేశాన్ని ముంచెత్తాయి. ఈ వ‌ర‌ద‌ల్లో దాదాపు 4 వేల మంది వ‌ర‌కు దేశ పౌరులు చ‌నిపోయారు. దాదాపు మ‌రో 5 వేల మంది వ‌ర‌కు నిరాశ్ర‌యుల‌య్యారు. వ‌ర‌ద‌ల నివార‌ణ‌లో అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంలో అధికారులు విఫ‌లమ‌య్యార‌ని ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ కి అనిపించింది. కొండ చ‌రియ‌లు విరిగిపడి భారీగా దేశ పౌరులు మృత్యువాత ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లు కిమ్‌ను క‌ద‌లించాయి. త‌క్ష‌ణ నివార‌ణ చ‌ర్య‌లకు పూనుకున్నాడు. ఈ వర‌ద ప్ర‌భావాన్ని అడ్డుకోవ‌డంలో అధికారుల వైఖ‌రి కార‌ణ‌మ‌ని, వారు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ఘోరం జ‌రిగింద‌ని కిమ్ గ్ర‌హించారు. దీంతో ఈ దారుణ దుర్ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన 30 మంది అధికారుల‌కు ఉరి శిక్ష విధించాల‌ని కిమ్ ఆదేశించిన‌ట్టు ఉత్త‌ర‌ కొరియా మీడియా పేర్కొంది.

ఇటీవ‌ల వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో కిమ్ స్వ‌యంగా ప‌ర్య‌టించారు. భారీగా జ‌రిగిన‌ ప్రాణ‌న‌ష్టం ఆయ‌న్ను క‌ల‌వ‌ర‌పాటుకు గురించేసింది. మొద‌ట వెయ్యి మంది మ‌ర‌ణించి ఉంటార‌ని భావించినా త‌న ప‌ర్య‌ట‌న‌లో మాత్రం అస‌లు వాస్త‌వాలు వెలుగుచూశాయి. భారీ జ‌రిగిన ప్రాణ న‌ష్టం త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించింద‌ని కిమ్ భావించారు. అందుకు కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆ దేశ సైనికులు ప‌ర్య‌టించి స‌హాయ‌క చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. బాధితుల‌ను ఆదుకుంటున్నారు. భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగిపడ‌టంతోపాటు వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో వేల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. వారిని పున‌రావాస శిబిరాల‌కు త‌ర‌లిస్తున్నారు. 
అయితే వాస్త‌వ స్థితికి రావ‌డానికి క‌నీసం మ‌రో 3 నెల‌లైనా స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని ఆ దేశ మీడియా వెల్ల‌డించింది. 15వేల మందికి పైగా వృద్ధులు,విక‌లాంగులు, చిన్నారుల‌ను సైనికులు ర‌క్షించి పున‌రావాస శిబిరాలు, సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియాలోని పలు రాష్ట్రాల్లో కిమ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget