అన్వేషించండి

Eiffel Tower : వేలానికి ఈఫిల్‌ టవర్‌ మెట్టు! ప్రారంభ ధర కోటి రూపాయలు!

Eiffel Tower : పారిస్ ఐకానిక్ చిహ్నమైన ఈఫిల్ టవర్‌ మెట్ల భాగాన్ని వేలం వేయనున్నారు. ఇది 137ఏళ్ల నాటిదని చెబుతున్నారు. లిఫ్టు ఏర్పాటుతో అప్పట్లో దాన్ని తొలగించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈఫిల్ టవర్ అసలైన మెట్ల భాగాన్ని వేలం వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
  • 137 ఏళ్ల నాటి ఈ చారిత్రక మెట్లు 2026 మే 21న వేలం జరుగుతుంది.
  • 1983లో లిఫ్టుల ఏర్పాటుతో ఈ మెట్లను తొలగించారు, ఇప్పుడు వేలం వేస్తున్నారు.
  • గతంలో వేలం వేసిన మెట్లు భారీ ధరలకు అమ్ముడయ్యాయి.

Eiffel Tower : ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా నిలిచే పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ చరిత్రలో మరో అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. ఈ టవర్ నిర్మించిన కాలం నాటి అసలైన మెట్ల భాగాన్ని వేలం వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 137 ఏళ్ల నాటి ఈ చారిత్రక అవశేషం కేవలం ఇనుప ముక్క మాత్రమే కాదు, అది నాటి ఇంజినీరింగ్ అద్భుతానికి నిలువెత్తు సాక్ష్యం. 

వేలం ఎప్పుడు వేస్తారు?

ప్రముఖ ఫ్రెంచ్ వేలం సంస్థ ఆర్ట్‌క్యురియల్‌, 2026 మే 21న ఈ వేలాన్ని నిర్వహించనుంది. ఈ వేలంలో విక్రయించబోయే మెట్ల భాగం సుమారు8.5 నుంచి 9 అడుగులు ఎత్తు కలిగి ఉంది. ఇందులో మొత్తం 14మెట్లు వృత్తాకారంలో అమర్చారు. ఈ విభాగం టవర్‌ రెండో, మూడో అంతస్తులను కలుపుతూ ఉండే అసలైన మెట్ల మార్గంలో భాగంగా ఉండేది. 

ఎందుకు మెట్లు తొలగించారు?

చారిత్రక విలువ వల్లే కాకుండా దాని నిర్మాణ శైలి వల్ల కూడా ప్రాముఖ్యత పొందుతుంది. రివెటెడ్‌ షీట్ మెటల్ సిలిండర్‌పై అమర్చిన ఈ మెట్లు ఈఫిల్‌ టవర్ అసలైన గోధుమ రంగులో పునరుద్ధరించారు. ఈఫిల్ టవర్ నిర్మించిన సమయంలో పై అంతస్తు చేరుకోవడానికి 1701 మెట్లు ఉండేవి. కాలక్రమేణా పర్యాటకుల సౌకర్యార్థం లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 1983లో టవర్‌పై అంతస్తులకు చేరుకోవడానికి లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే టవర్ పైభాగంలో ఉన్న హెలికల్ మెట్ల మార్గాన్ని తొలగించాల్సి వచ్చింది.

ఇప్పటి వరకు ఎప్పుడైనా వేేలం వేశారా? 

అప్పట్లో అధికారులు ఈ మెట్ల మార్గాన్ని 24 విభాగాలుగా విభజించారు. ఒక విభాగాన్ని టవర్ మొదటి అంతస్తులో ప్రదర్శన కోసం మూడో విభాగాలను ఫ్రాన్స్‌లో ప్రముఖ మ్యూజియంలకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మిగిలిన 20 విభాగాలను 1983డిసెంబర్‌లో వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. ఇప్పుడు వేలం వేయబోతున్నది మొదటి విభాగంలోనిదే. 

గత రికార్డులు ఏం చెబుతున్నాయి. 

ఈ వేలానికి ముందు దీని ధరను సుమారు నలభై వేల నుంచి యాభై వేల యూరోలుగా అంటే దాదాపు 50 లక్షలుగా అంచా వేశారు. అయితే గత చరిత్రను పరిశీలిస్తే ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2016లో ఒక మెట్ల విభాగం ఏకంగా 5, 23, 800 యూరోలకు అంటే ఐదు కోట్లకుపైగా అమ్ముడైంది. 2020లో వేలం వేసిన మరో విభాగం సుమారు 2-7 కోట్లకుపైగా ధర పలికింది. 

ఈ మెట్ల విభాగాలు ఇప్పుడు కేవలం ప్రాన్స్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. కొన్ని జపాన్‌లోని యోషీ ఫౌండేషన్‌లో, మరికొన్ని న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ‌ లిబర్టీ సమీపంలోని, డిస్నీల్యాండ్‌లో కూడా నిపిస్తాయి. 

ఒక ఎగ్జిబిషన్ కోసం నిర్మించిన ఈ ఈఫిల్ టవర్ నేటికీ ప్రపంచ పర్యాటకులను అలరిస్తోంది. దీన్ని గుస్తావ్ ఈఫిల్ అనే వ్యక్తం రెండు సంవత్సరాల్లోనే నిర్మించారు. గాలి తీవ్రతను తట్టుకోవడానికి ప్రత్యేకమైన స్ట్రక్చర్ ప్రిన్సిపల్‌ ను ఉపయోగించారు. నిటారుగా చూస్తే టవర్ కాస్త వంగినట్టు ఉంటుంది. ఇది గాలి ఒత్తిడి తట్టుకోవడానికి ఇలా నిర్మించారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే ఎత్తైన కట్టడంగా ఉండేది. ఈ వింతైన ఆకారాన్ని చూసి చాలా మంది విమర్శలు చేశారు. కానీ కాలక్రమేణా ఈ నిర్మాణ మేధస్సు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. 

Frequently Asked Questions

ఈఫిల్ టవర్ యొక్క అసలైన మెట్ల భాగం ఎప్పుడు వేలం వేయబడుతుంది?

ఈఫిల్ టవర్ యొక్క అసలైన మెట్ల భాగం మే 21, 2026న వేలం వేయబడుతుంది. ప్రముఖ ఫ్రెంచ్ వేలం సంస్థ ఆర్ట్‌క్యురియల్‌ ఈ వేలాన్ని నిర్వహిస్తుంది.

వేలం వేయబోయే మెట్ల భాగం ఎంత ఎత్తు ఉంటుంది?

వేలం వేయబోయే మెట్ల భాగం సుమారు 8.5 నుంచి 9 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇందులో మొత్తం 14 వృత్తాకార మెట్లు ఉంటాయి.

ఈఫిల్ టవర్ నుండి మెట్లను ఎందుకు తొలగించారు?

పర్యాటకుల సౌకర్యార్థం లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి రావడంతో 1983లో ఈ మెట్ల మార్గాన్ని తొలగించారు. ఆ సమయంలో టవర్ పై అంతస్తులకు లిఫ్టులు ఏర్పాటు చేశారు.

గతంలో ఈఫిల్ టవర్ మెట్ల విభాగాలు ఏ ధరకు అమ్ముడయ్యాయి?

2016లో ఒక మెట్ల విభాగం 5,23,800 యూరోలకు (5 కోట్లకుపైగా) అమ్ముడైంది. 2020లో మరో విభాగం 2-7 కోట్లకుపైగా ధర పలికింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Gulf illegal residency help: గల్ఫ్ ఇరుక్కుపోయిన మహిళలకు పిల్లల పౌరసత్వ కష్టాలు - ఈ సమస్యను గుర్తించేది ఎవరు?
గల్ఫ్ ఇరుక్కుపోయిన మహిళలకు పిల్లల పౌరసత్వ కష్టాలు - ఈ సమస్యను గుర్తించేది ఎవరు?
US Attacks Iran: ఇరాన్ మిస్సైల్ సెంటర్లపై అమెరికా మెరుపు దాడులు! సీజ్ ఫైర్ సమయంలో మరోసారి ఉద్రిక్తత
ఇరాన్ మిస్సైల్ సెంటర్లపై అమెరికా మెరుపు దాడులు! సీజ్ ఫైర్ సమయంలో మరోసారి ఉద్రిక్తత
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget