అన్వేషించండి

పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?

పాకిస్థాన్ అనే పేరు తొలుత 1933లో ప్రాచుర్యం లోకి వచ్చింది. దీన్ని తొలి సారిగా చౌదరీ రహమత్ అలీ అనే వ్యక్తి ప్రతిపాదించారు.  ఇతను పాకిస్థాన్ స్వాతంత్రం కోసం పని చేసిన వ్యక్తి, .

Story Behind Name of Pakistan | బ్రిటీష్ ఇండియాలో పాక్ భూబాగమంతా ఇండియాలో భాగంగా ఉండేది. 1947 ఆగష్టు 14 న పాకిస్థాన్ దేశంగా అవతరించింది. లార్ట్ మౌంట్ బాటన్ భారత దేశానికి పరిపాలన పగ్గాలు అప్పగించే ప్రణాళికలో దేశ విభజన అంశం కూడా పొందుపరిచారు.  అయితే పాకిస్థాన్ ఏర్పాటుకు మహమ్మద్ అలీ జిన్నా మూల కారకుడు. భారత జాతీయ కాంగ్రెస్ లో జిన్నా  ఒకప్పుడు సభ్యుడయినా ఆ తర్వాత గాంధీ సిద్ధాంతాలు, ముస్లిం లకు ప్రత్యేక హక్కులు ఉండాలన్న తన వాదనతో వారితో విబేధించి ముస్లిం లీగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ముస్లింల హక్కులే ధ్యేయంగా స్వాతంత్రోద్యమ కాలంలో పని చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ముస్లింలకు ప్రత్యేక రాజ్యం ఉండాలన్న డిమాండ్ తో హింసాకాండకు దిగారు.  ఆ తరుణంలో అప్పటి బ్రిటిష్ పాలకులు  భారత ఉపఖండం రెండు దేశాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నారు.   ముస్లిం మెజార్టీ ప్రజలకు ఓ దేశం, హిందు, సిక్కు, జైనులు, ఇతర అల్ప సంఖ్యాక వర్గాల వారందరికి ఓ దేశం  ఉండాలని దేశ విభజన నిర్ణయం తీసుకున్నారు.

పాకిస్థాన్ అనే పేరు అర్థం ఇదే

పాకిస్థాన్ అనే పేరు తొలుత 1933లో ప్రాచుర్యం లోకి వచ్చింది. దీన్ని తొలి సారిగా చౌదరీ రహమత్ అలీ అనే వ్యక్తి ప్రతిపాదించారు. ఇతను పాకిస్థాన్ స్వాతంత్రం కోసం పని చేసిన వ్యక్తి, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ఓ డిక్లరేషన్ ను ప్రతిపాదించారు. ఆందులో ఈ పాకిస్థాన్ అనే పదం  వాాడారు.  అయితే ఇతను లండన్ లో ఉండేవాడు. చివరకు పాకిస్థాన్ దేశం ఏర్పడినా లండన్ లోనే నివాసం ఉండి అక్కడే మరణించారు.  పాక్ అనే పదం ఉర్దూ, పర్షియా భాషల్లో పరిపూర్ణత లేదా శుద్దత అనే అర్థం  వస్తుంది.  ఇస్తాన్ అనే దానికి భూమి లేదా దేశం అనే అర్థం వస్తుంది. అయితే పాకిస్థాన్ అనే పదంకు  కింది అర్థాలను కూడా చెప్పుకుంటారు. 

P - Punjab (పంజాబ్)
A - Afghania (అఫ్ఘానియా) లేదా బలూచిస్తాన్ (Balochistan)
K - Kashmir (కశ్మీర్)
S - Sindh (సింధ్)

ఈ అర్థంతో పాకిస్థాన్ ఏర్పడిందన్న ప్రచారం ఉంది. అయితే పాకిస్థాన్ ప్రధానంగా పంజాబ్, సింధ్,  బలుచిస్థాన్, ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రాంతాలతో  ఏర్పడింది. 1971 లో బంగ్లాదేశ్ ఓ దేశంగా  ఏర్పడక ముందు పాకిస్థాన్ లో భాగంగా ఉండేది. పాకిస్థాన్ లోని ప్రస్తుత ప్రదేశాలన్నీ బ్రిటీష్ ఇండియాలో అనేక ప్రావిన్స్ లలో భాగమై ఉన్నాయి.  ప్రస్తుతం పాకిస్థాన్  ఆనాడు పంజాబ్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేది.  మన దేశంలో ఆనాడు ఇది ఓ పెద్ద ప్రావిన్సు గా పరిగణించబడేది. విభజన సమయంలో రెండుగా విడిపోయింది.  పాకిస్తాన్ లోని పంజాబ్ గా, భారత్ లో పంజాబ్ గా  ఇది విభజించబడింది. పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలో సింధ్ ప్రావిన్సుగా పరిగణించబడేది.  బలుచిస్థాన్  బ్రిటీష్ ఇండియాలో భాగం. ఇప్పుడు పాకిస్థాన్ లో భాగమైంది. ఖైబర్ ఫక్తూన్ ఖ్వా బ్రిటీష్ ఇండియాలో అప్ఘన్ మాతా ప్రాంతంలో భాగమై ఉండేది.   పాకిస్థాన్ లోని కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్  పంజాబ్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేవి. ఇప్పుడు పాక్  లో భాగమయ్యాయి.

జిన్నా పాకిస్థాన్ అనే పేరును ఎప్పుడు ఆమోదించారు ?

పాకిస్థాన్ నిర్మాతగా మహమ్మద్ ఆలీ జిన్నాను పిలుస్తారుత. 1933 లో చౌదరీ రహమత్ అలీ పాకిస్థాన్ అనే పదాన్ని తొలి సారి ప్రస్తావనకు తెచ్చినప్పటికీ ఆలీ జిన్నా ఆమోదం తర్వాతే విశేష ప్రాచుర్యంలోకి వచ్చింది.  1940 లో  పాకిస్థాన్ అనే దేశం ముస్లింల కోసం ఏర్పడాలన్న తీర్మానంపై ముస్లింలీగ్  కోల్ కత్తాలో సమావేశమయింది.  లాహోర్ డిక్లరేషన్  దీన్నే లాహోర్ తీర్మానం అంటారు.  జిన్నా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముస్లింల కోసం ఏర్పడే దేశానికి పాకిస్థాన్ అనే పేరు పెట్టాలని  అధికారికంగా ప్రకటించారు. ఇలా మొదలయిన దేశ విభజన ఉద్యమ ఫలితంగా 1947లో పాకిస్థాన్ ఏర్పాటయింది.

Also Read: Syria Civil War: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Iran Closes Strait of Hormuz 2026: హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ నమ్మకద్రోహం చేశాయని ఆగ్రహం !
హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ నమ్మకద్రోహం చేశాయని ఆగ్రహం !
Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
Tulsi Gabbard: పక్కా ప్లాన్ ప్రకారమే కరోనా వైరస్ వ్యాప్తి! తులసీ గబ్బర్డ్ బిగ్‌బాంబు! ప్రపంచాన్ని కుదిపేస్తున్న రహస్య పత్రాలు! 
పక్కా ప్లాన్ ప్రకారమే కరోనా వైరస్ వ్యాప్తి! తులసీ గబ్బర్డ్ బిగ్‌బాంబు! ప్రపంచాన్ని కుదిపేస్తున్న రహస్య పత్రాలు! 
Donald Trump vs Giorgia Meloni: ఫొటో కావాలని వెంటపడింది! జార్జియా మెలోనిపై ట్రంప్‌ కామెంట్స్! రివర్స్‌లో ఇచ్చిపడేసిన ఇటలీ ప్రధాని!
ఫొటో కావాలని వెంటపడింది! జార్జియా మెలోనిపై ట్రంప్‌ కామెంట్స్! రివర్స్‌లో ఇచ్చిపడేసిన ఇటలీ ప్రధాని!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Rukmini Vasanth: ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
Embed widget