అన్వేషించండి

పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?

పాకిస్థాన్ అనే పేరు తొలుత 1933లో ప్రాచుర్యం లోకి వచ్చింది. దీన్ని తొలి సారిగా చౌదరీ రహమత్ అలీ అనే వ్యక్తి ప్రతిపాదించారు.  ఇతను పాకిస్థాన్ స్వాతంత్రం కోసం పని చేసిన వ్యక్తి, .

Story Behind Name of Pakistan | బ్రిటీష్ ఇండియాలో పాక్ భూబాగమంతా ఇండియాలో భాగంగా ఉండేది. 1947 ఆగష్టు 14 న పాకిస్థాన్ దేశంగా అవతరించింది. లార్ట్ మౌంట్ బాటన్ భారత దేశానికి పరిపాలన పగ్గాలు అప్పగించే ప్రణాళికలో దేశ విభజన అంశం కూడా పొందుపరిచారు.  అయితే పాకిస్థాన్ ఏర్పాటుకు మహమ్మద్ అలీ జిన్నా మూల కారకుడు. భారత జాతీయ కాంగ్రెస్ లో జిన్నా  ఒకప్పుడు సభ్యుడయినా ఆ తర్వాత గాంధీ సిద్ధాంతాలు, ముస్లిం లకు ప్రత్యేక హక్కులు ఉండాలన్న తన వాదనతో వారితో విబేధించి ముస్లిం లీగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ముస్లింల హక్కులే ధ్యేయంగా స్వాతంత్రోద్యమ కాలంలో పని చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ముస్లింలకు ప్రత్యేక రాజ్యం ఉండాలన్న డిమాండ్ తో హింసాకాండకు దిగారు.  ఆ తరుణంలో అప్పటి బ్రిటిష్ పాలకులు  భారత ఉపఖండం రెండు దేశాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నారు.   ముస్లిం మెజార్టీ ప్రజలకు ఓ దేశం, హిందు, సిక్కు, జైనులు, ఇతర అల్ప సంఖ్యాక వర్గాల వారందరికి ఓ దేశం  ఉండాలని దేశ విభజన నిర్ణయం తీసుకున్నారు.

పాకిస్థాన్ అనే పేరు అర్థం ఇదే

పాకిస్థాన్ అనే పేరు తొలుత 1933లో ప్రాచుర్యం లోకి వచ్చింది. దీన్ని తొలి సారిగా చౌదరీ రహమత్ అలీ అనే వ్యక్తి ప్రతిపాదించారు. ఇతను పాకిస్థాన్ స్వాతంత్రం కోసం పని చేసిన వ్యక్తి, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ఓ డిక్లరేషన్ ను ప్రతిపాదించారు. ఆందులో ఈ పాకిస్థాన్ అనే పదం  వాాడారు.  అయితే ఇతను లండన్ లో ఉండేవాడు. చివరకు పాకిస్థాన్ దేశం ఏర్పడినా లండన్ లోనే నివాసం ఉండి అక్కడే మరణించారు.  పాక్ అనే పదం ఉర్దూ, పర్షియా భాషల్లో పరిపూర్ణత లేదా శుద్దత అనే అర్థం  వస్తుంది.  ఇస్తాన్ అనే దానికి భూమి లేదా దేశం అనే అర్థం వస్తుంది. అయితే పాకిస్థాన్ అనే పదంకు  కింది అర్థాలను కూడా చెప్పుకుంటారు. 

P - Punjab (పంజాబ్)
A - Afghania (అఫ్ఘానియా) లేదా బలూచిస్తాన్ (Balochistan)
K - Kashmir (కశ్మీర్)
S - Sindh (సింధ్)

ఈ అర్థంతో పాకిస్థాన్ ఏర్పడిందన్న ప్రచారం ఉంది. అయితే పాకిస్థాన్ ప్రధానంగా పంజాబ్, సింధ్,  బలుచిస్థాన్, ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రాంతాలతో  ఏర్పడింది. 1971 లో బంగ్లాదేశ్ ఓ దేశంగా  ఏర్పడక ముందు పాకిస్థాన్ లో భాగంగా ఉండేది. పాకిస్థాన్ లోని ప్రస్తుత ప్రదేశాలన్నీ బ్రిటీష్ ఇండియాలో అనేక ప్రావిన్స్ లలో భాగమై ఉన్నాయి.  ప్రస్తుతం పాకిస్థాన్  ఆనాడు పంజాబ్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేది.  మన దేశంలో ఆనాడు ఇది ఓ పెద్ద ప్రావిన్సు గా పరిగణించబడేది. విభజన సమయంలో రెండుగా విడిపోయింది.  పాకిస్తాన్ లోని పంజాబ్ గా, భారత్ లో పంజాబ్ గా  ఇది విభజించబడింది. పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలో సింధ్ ప్రావిన్సుగా పరిగణించబడేది.  బలుచిస్థాన్  బ్రిటీష్ ఇండియాలో భాగం. ఇప్పుడు పాకిస్థాన్ లో భాగమైంది. ఖైబర్ ఫక్తూన్ ఖ్వా బ్రిటీష్ ఇండియాలో అప్ఘన్ మాతా ప్రాంతంలో భాగమై ఉండేది.   పాకిస్థాన్ లోని కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్  పంజాబ్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేవి. ఇప్పుడు పాక్  లో భాగమయ్యాయి.

జిన్నా పాకిస్థాన్ అనే పేరును ఎప్పుడు ఆమోదించారు ?

పాకిస్థాన్ నిర్మాతగా మహమ్మద్ ఆలీ జిన్నాను పిలుస్తారుత. 1933 లో చౌదరీ రహమత్ అలీ పాకిస్థాన్ అనే పదాన్ని తొలి సారి ప్రస్తావనకు తెచ్చినప్పటికీ ఆలీ జిన్నా ఆమోదం తర్వాతే విశేష ప్రాచుర్యంలోకి వచ్చింది.  1940 లో  పాకిస్థాన్ అనే దేశం ముస్లింల కోసం ఏర్పడాలన్న తీర్మానంపై ముస్లింలీగ్  కోల్ కత్తాలో సమావేశమయింది.  లాహోర్ డిక్లరేషన్  దీన్నే లాహోర్ తీర్మానం అంటారు.  జిన్నా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముస్లింల కోసం ఏర్పడే దేశానికి పాకిస్థాన్ అనే పేరు పెట్టాలని  అధికారికంగా ప్రకటించారు. ఇలా మొదలయిన దేశ విభజన ఉద్యమ ఫలితంగా 1947లో పాకిస్థాన్ ఏర్పాటయింది.

Also Read: Syria Civil War: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Embed widget