అన్వేషించండి

Canada Wildfire: కెనడా వైపు దూసుకొస్తున్న కార్చిచ్చు, ఎల్లోనైఫ్‌ను ఖాళీ చేయిస్తున్న అధికారులు

Canada Wildfire: కెనడా నగరం ఎల్లోనైఫ్‌ కు అధికారులు కార్చిచ్చు హెచ్చరికలు జారీ చేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Canada Wildfire: హవాయి దీవుల సమూహంలోని మౌయి ద్వీపాన్ని కార్చిచ్చు దహించి వేసిన విషయం తెలిసిందే. లహైనా రిసార్టు నగరంలో కార్చిచ్చు బూడిదను మిగిల్చింది. గతవారం కార్చిచ్చు సృష్టించిన విలయానికి వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 2 వేలకుపైగా నివాసాలు ఖాళీ బూడిదయ్యాయి. వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ప్రకృతి విపత్తు ఇంకా మర్చిపోకముందే.. ఇప్పుడు కెనడా వైపు మరో కార్చిచ్చు వేగంగా దూసుకొస్తోంది. కెనడాలోని నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ వస్తోంది. ఈ కార్చిచ్చు నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కల్లా ప్రజలంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఆ దావానలం పదుల కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ వారాంతంలో ఎల్లో నైఫ్ శివార్లను సమీపిస్తుందని పేర్కొంది. ఎల్లో నైఫ్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 

ఎల్లోనైఫ్ నగరంలో దాదాపు 20 వేల మంది నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రజలను తరలించేందుకు విమానాలు అందుబాటులో ఉంటాయని ఆ నగర మేయర్ తెలిపారు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో వీలైనంత వరకు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని.. వాహనంలో ఖాళీ ఉంటే.. ఇతరులను ఎక్కించుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. ఎల్లోనైఫ్ నగరంతో పాటు హే రివర్ పట్టణాన్ని కూడా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 3 వేల మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో తరలింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. బలమైన గాలుల వల్ల కార్చిచ్చు అతి వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

హవాయి మౌయి దీవిలో కార్చిచ్చు

ఇహలోకపు స్వర్గంలా ఉండే హవాయి ద్వీపంలోని మౌయి దీవి ఇప్పుడు కాలి బూడిదైపోయింది. కార్చిచ్చు ఈ ప్రాంతంలో తీవ్రాతితీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఈ దీవిలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 100కు పైగా చేరింది. ఈ మంటల ధాటికి ఏకంగా 3 వేలకు పైగా జంతువులు మృత్యువాత పడ్డాయి. శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం గాలిస్తున్నారు. వెయ్యి డిగ్రీల ఫారెన్‌హీట్ (538 డిగ్రీల సెల్సియస్) ను దాటి వేడి జ్వలించింది. ఈ మంటల ధాటికి ఏకంగా లోహాలు కూడా కరిగిపోయాయి. 2 వేల 200లకు పైగా నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. వందలాది వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయి. రిసార్టు నగరం లహైనా కూడా గుర్తు పట్టలేని స్థితికి మారిపోయింది. ఆ ఘోర ప్రకృతి విపత్తు వల్ల ఏకంగా 50 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కార్చిచ్చు చెలరేగిన సమయంలో అధికారులు ప్రజల సెల్ ఫోన్లకు హెచ్చరిక సందేశం పంపారని, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ప్రమాదాన్ని చేరవేసినప్పటికీ అది అందరికీ చేరలేదని సమాచారం. 

Also Read: First Biodiversity Village: దేశంలోనే తొలి జీవవైవిధ్య గ్రామం అట్లాస్ లాంచ్ చేసిన గోవా సర్కారు

లహైనాలో 1300 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. హవాయి రాష్ట్రం చవిచూసి ఈ అతిపెద్ద ప్రకృతి విపత్తు గురించి అధికారులు సన్నద్ధత, స్పందనపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మంటలు వ్యాప్తి చెందుతున్న ప్రారంభ దశలో కొన్ని అగ్నిమాపక పైపులైన్లలో నీళ్లు లేకుండా పోయినట్లు స్థానికులు అంటున్నారు. పౌరులను అప్రమత్తం చేసేందుకు సైరన్ వంటి హెచ్చరికలనూ ఉపయోగించలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మంటలు సమీపంలోకి వచ్చిన తర్వాత మాత్రమే చాలా మందికి వాటి గురించి తెలిసి పరుగు పెట్టారని, వారిని చూసి మరికొందరు దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget