అన్వేషించండి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Balochistan Explosion: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటికి 52 మంది చనిపోయారు.

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటికి 52 మంది చనిపోయారు. మరో 130 మంది గాయాలపాలయ్యారు. అయితే ఆత్మాహుతి దాడి కారణంగానే పేలుడు జరిగిందని అక్కడి అధికారులు ధృవీకరించినట్లు పాక్‌ మీడియా డాన్‌ కథనాల్లో వెల్లడించింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని  మస్తుంగ్‌ జిల్లాలో అల్పాలా రోడ్‌లోని మదీనా మసీదు సమీపంలో మిలాదున్‌ నబీ ఉరేగింపు కోసం ప్రజలు ర్యాలీ నిర్వహిస్తుండగా భారీ పేలుడు సంభవించినట్లు పేర్కొంది. దీంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో మృతిచెందారు. దాడిలో మృతిచెందిన వారిలో పోలీసు అధికారి కూడా ఉన్నారు.

పేలుడు సంభవించిన ప్రాంతంలో పరిస్థితి భయానకంగా మారింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో విషాదకరంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను సహాయక సిబ్బంది క్వెట్టాలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అన్ని ఆస్పత్రులలో అత్యవసర పరిస్థితిని విధించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది.  బలూచిస్థాన్‌లో మత సామరస్యం, శాంతిని నాశనం చేసేందుకు విదేశీ సహాయంతో దాడులు చేశారని పాక్‌ మంత్రి జాన్‌ అచక్‌జాయ్‌ వెల్లడించారు. ఈ దాడి భరించలేనిది అని అన్నారు.బ పేలుడు కారణమైన వారిని అరెస్ట్‌ చేయాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్‌ డోమ్కి వెల్లడించారు. 

మిలాదునబీ కారణంగా మసీదు వద్ద భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ర్యాలీ నిర్వహణ పర్యవేక్షణ విధుల్లో ఉన్న డీఎస్పీ గాష్కోరి కూడా ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. డీఎస్పీ కారు వద్దే బాంబు పేలినట్లు తెలిపారు. సూసైడ్‌ బాంబర్‌ డీఎస్పీ కారు పక్కనే నిల్చుని తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పేలుడు ఘటనపై పాకిస్థాన్‌ మంత్రి సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. పేలుడులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మిలాదునబీ ఊరేగింపుపై ఇలాంటి దాడి హేయమైన చర్య అని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. తీవ్రవాదులను వదలిపెట్టబోమని, ఉగ్రవాదుల విషయంలో జీరో టాలరెన్స్‌ను అనుసరిస్తున్నామని ఆయన వెల్లడించారు.

గత నెలలో ఖైబర్‌ ఫంఖ్తున్వా ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో పాక్‌ బలగాలకు చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు. సుసైడ్‌ బాంబర్‌ మోటార్‌ బైక్‌పై వచ్చి భద్రతా దళాల కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో బాంబు పేలుడు సంభవించింది. అలాగే ఈ ఏడాది జులైలో కూడా పాక్‌లో ఓ ర్యాలీ సందర్భంగా ఇస్లామిక్‌ స్టేట్ తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాది ఈ దాడికి పాల్పడినట్లు అప్పుడు ఖైబర్‌ ఫంఖ్తున్వా ప్రావిన్స్‌ పోలీసులు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget