By: Ram Manohar | Updated at : 31 Dec 2022 05:32 PM (IST)
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్లో చేరుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
BJP MP Varun Gandhi:
సొంత పార్టీపైనే వరుణ్ గాంధీ విమర్శలు...?
యూపీలోని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పార్టీ మారతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ మధ్య కాలంలో సొంత పార్టీపైనే నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే...ఆయన బీజేపీని వీడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనీ అంటున్నారు. బీజేపీని విమర్శించే విధంగా హిందూ ముస్లింలపై ఆయన చేసిన వ్యాఖ్యలూ సంచలనమయ్యాయి. రైతుల ఉద్యమం
చేసిన సమయంలో వారికి అండగా నిలబడి ఆహారం అందించిన వారికి మద్దతుగా మాట్లాడారు వరుణ్ గాంధీ. ఈ కారణంగా...ఆయన బీజేపీకి దూరం అవుతున్నారన్న సంకేతాలొచ్చాయి. దీనిపై రాహుల్ గాంధీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్లో చేరుతున్నారా అన్న ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పారు రాహుల్. "ఈ ప్రశ్న మీరు మా పార్టీ అధ్యక్షుడు ఖర్గేని అడగాలి" అని దాట వేశారు. అయితే...భారత్ జోడో యాత్రకు ఎవరు మద్దతు ఇచ్చినా మేం స్వాగతిస్తామని స్పష్టం చేశారు. "ప్రస్తుతం వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నారు. ఎప్పుడో అప్పుడు ఆయన ఆ పార్టీ నుంచి సమస్యలు ఎదుర్కోక తప్పదు" అని అన్నారు. దేశానికి కొత్త దారి చూపించేందుకే...భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు వెల్లడించారు. తన ఉద్దేశం కూడా నెరవేరిందని తెలిపారు. ప్రెస్కాన్ఫరెన్స్ చాలా సేపు మాట్లాడిన రాహుల్...2024 ఎన్నికల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడం కష్టమేనంటూ జోస్యం చెప్పారు. చాలా చోట్ల బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటోందని అన్నారు.
"Everyone is welcome in Congress" response by Rahul Gandhi on Varun Gandhi.
All congress volunteers wants to see them together , wants to see them work together for India
Now way is cleared for the entry of @varungandhi80 in Congress. ✋#RahulGandhiAddressesMedia pic.twitter.com/TPKOPUwtNS — Kiran WithRG (@KiranINC29) December 31, 2022
స్పీచ్ వైరల్..
ఈ మధ్య వరుణ్ గాంధీ ప్రసంగం ఒకటి బాగా వైరల్ అయింది. సొంత పార్టీని పరోక్షంగా విమర్శించినట్టుగానే అనిపించింది. "పండిట్ నెహ్రూకి కానీ, కాంగ్రెస్కు కానీ నేను వ్యతిరేకం కాను. రాజకీయాలేవైనా సరే మన దేశాన్ని సమష్టిగా ఉంచాలి. ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉండకూడదు. వాళ్లను అణగదొక్కే రాజకీయాలు చేయడం మానుకోవాలి. రాజకీయాలెప్పుడూ ప్రజలు ఎదిగేలా ఉండాలి. ఇప్పుడంతా హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. కుల రాజకీయాలు కూడా పెరిగిపోతున్నాయి. సోదరుల్లాంటి వాళ్లు విడదీస్తున్నారు. ఒకరిని ఒకరు చంపుకునేలా చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలను ఎప్పటికీ ఉపేక్షించకూడదు" అని అన్నారు వరుణ్ గాంధీ.
आप के लिए बोल रहे वरुण, 2 मिनिट का समय निकाल कर सुन लो।#VarunGandhi pic.twitter.com/qe4j1UowUI
— Shambhu Kumar (@shambhukumar91) December 30, 2022
Also Read: Bharat Jodo Yatra: వాళ్ల రోడ్షోల్లో కొవిడ్ ప్రోటోకాల్స్ గుర్తు రాలేదా? కావాలనే ఇష్యూ చేస్తున్నారు - బీజేపీపై రాహుల్ ఫైర్
TSLPRB: ఆ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీలక నిర్ణయం! ఏంటంటే?
విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు
Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్ఎంల నిర్బంధం
Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి