అన్వేషించండి

Vijayawada Trains: విజయవాడ నుండి తరలి వెళ్లిపోతున్న రైళ్లు... మిగిలింది 6 ఎక్స్ ప్రెస్ లే అంటే నమ్ముతారా..?

Andhra Pradesh News | విజయవాడ నుండి రైళ్లు తరలి వెళ్లిపోతున్నాయి. మిగిలింది 6 ఎక్స్ ప్రెస్ లే. ఎందుకీ పరిస్థితి, అసలేం జరుగుతుందో ఈ వివరాలు చదివితే అర్థమవుతుంది.

 విజయవాడ.. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ లలో ఒకటి.  హౌరా- చెన్నై, న్యూ ఢిల్లీ -చెన్నై, విజయవాడ -నిడదవోలు (లూప్ ) వంటి కీలక మైన రైల్వే లైను ఈ స్టేషన్ గుండా వెళ్తాయి. 10 ప్లాట్ ఫామ్ లు,24 ట్రాకులు తో రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే రైళ్లన్నీ ఇతర స్టేషనులకు తరలి వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం కేవలం 6 ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే విజయవాడ నుంచి (అంటే ఆరిజన్ స్టేషన్ విజయవాడ గా)  నడుస్తున్నాయి. 


మిగిలింది ఈ 6 ఎక్స్ ప్రెస్ రైళ్ళే 

 ప్రస్తుతం విజయవాడ స్టేషన్ నుంచి బయలుదేరే  ఎక్స్ప్రెస్ రైళ్లు 6 మాత్రమే ఉన్నాయి. అవి 3 సిస్టర్స్ గా పిలుచుకునే 

1) ట్రైన్ నెంబర్ 12713- విజయవాడ- కాచిగూడ- శాతవాహన ఎక్స్ ప్రెస్ 

2) ట్రైన్ నెంబర్ 12711- విజయవాడ- చెన్నై - పినాకిని ఎక్స్ ప్రెస్

3)  ట్రైన్ నెంబర్ 12718- విజయవాడ- విశాఖపట్నం- రత్నాచల్ ఎక్స్ ప్రెస్

 ఈ మూడు సూపర్ ఫాస్ట్ రైళ్లను త్రీ సిస్టర్స్ గా పిలుస్తారు. ఈ మూడూ ఉదయం 6 గంటల ప్రాంతంలో విజయవాడ స్టేషన్ నుండి  బయలుదేరి మళ్లీ సాయంత్రానికి  విజయవాడ చేరుకుంటాయి.

 ఇది కాక మిగిలింది మరో మూడు ఇంటర్ సిటీ లే.. 

అవి ట్రైన్ నెంబర్ 12707/12708 చెన్నై- విజయవాడ- చెన్నై జన శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది మంగళవారం మినహా మిగిలిన 6 రోజులూ ప్రయాణిస్తుంది. విజయవాడలో  మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ట్రైన్ బయలుదేరుతుంది.

2) 12743/12744- గూడూరు- విజయవాడ- గూడూరు- విక్రమసింహపురి అమరావతి ఎక్స్ ప్రెస్. ఈ ట్రైన్ ప్రతిరోజు విజయవాడలో 6 గంటలకు బయలుదేరుతుంది. 

3) 12796/12795 లింగంపల్లి- విజయవాడ- లింగంపల్లి  ఎంప్లాయిస్ స్పెషల్.  ఈరైలు ప్రతిరోజు సాయంత్రం 5:30 కి విజయవాడలో బయలుదేరి లింగంపల్లి వెళుతుంది.
ఓవరాల్ గా విజయవాడకు ప్రస్తుతం మిగిలిన  ఆరు ఇంటర్సిటీ రైళ్లు ఇవి మాత్రమే. 

 విజయవాడ నుంచి తరలి వెళ్లిపోయిన రైళ్లు ఇవే

 ఇంతకుముందు  విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లే ధర్మవరం రైళ్లను  ఇప్పుడు మచిలీపట్నం నుంచి ఒకటి, నరసాపురం మరొకటి గా మార్చేశారు. అలాగే విజయవాడ హౌరా మధ్య తిరిగే  హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ను తిరుపతి కి తీసుకుపోయారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమైన విజయవాడ రాయగడ ప్యాసింజర్ ను ఎక్స్ప్రెస్ గా ప్రమోట్ చేసి  దానిని గుంటూరు రాయగడగా మార్చేశారు. ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న వందేభారత్ ను కూడా నరసాపురం నుంచి నడిపేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న ప్రచారం  బలంగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే  అతి ముఖ్యమైన విజయవాడ రైల్వే స్టేషన్ ఆరిజన్ స్టేషన్గా ఉండే ఆరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లు కొన్ని ప్యాసింజర్ రైళ్లు మాత్రమే మిగులుతాయి.

అసలు సమస్య అదే

 విజయవాడ స్టేషన్ కి అతి ముఖ్యమైన సమస్య స్థలం లేకపోవడం. ఎప్పుడో 1888లో  కట్టిన ఈ రైల్వే స్టేషన్ కు గతంలో ఏడు ప్లాట్ ఫామ్ లు ఉండేవి. ప్రస్తుతం వన్ టౌన్ సైడు  మరో మూడు ప్లాట్ ఫామ్ లు పెంచి  మొత్తానికి 10 చేశారు. ప్రస్తుతం ఈ స్టేషన్ NSG 1 క్యాటగిరి లో ఉంది. అంటే కనీసం లక్ష మంది ప్రయాణికులు రోజు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. 190 ట్రైన్స్,170 గూడ్స్ రైళ్లు విజయవాడ స్టేషన్ మీదుగా ప్రతిరోజు ప్రయాణిస్తుంటాయి. దానితో స్టేషన్ నుండి కొత్తగా బయలుదేరే రైళ్లను వేయలేకపోతోంది రైల్వే శాఖ. హలో కొత్తగా వేసే రైళ్లకి ఇక్కడ ప్లేస్ ఉండటం లేదు. ఏదన్నా కొత్త రైలు విజయవాడ నుంచి బయలుదేరేలా దానిని ప్లాట్ ఫామ్ పై ఎక్కువసేపు నిలిపి ఉంచాలి. దానివల్ల వేరే రైళ్లకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ప్రస్తుతం కొత్త రైళ్లను విజయవాడ నుంచి బయలుదేరేలా వేయడం లేదు. పోనీ ప్లాట్ఫామ్ లు పెంచుదామా అంటే విజయవాడ రైల్వే స్టేషన్ సరిగ్గా నగరం నడిబొడ్డున ఉంది. అక్కడ కొత్తగా ప్లాట్ ఫామ్ లు కట్టే అవకాశం లేదు.


రెడీ అవుతున్న శాటిలైట్ స్టేషన్ లు- ఈ సమస్య కు అదే పరిష్కారం

 ప్రస్తుతం ఈ సమస్యకు  విజయవాడకి చుట్టుపక్కల  శాటిలైట్ స్టేషన్లు కట్టడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది రైల్వే శాఖకు. అందుకే విజయవాడ నిడదవోలు మార్గంలో రామవరప్పాడు, విజయవాడ హౌరా మార్గంలో గుణదల, విజయవాడ న్యూఢిల్లీ మార్గంలో  రాయనపాడు స్టేషన్లను  సాటిలైట్ స్టేషన్లుగా  ఆధునికంగా మార్చుతున్నారు. మరొక మూడు నాలుగు నెలల్లో ఇవి రెడీ అయిపోతే  చాలా ట్రైన్లను విజయవాడ మెయిన్ స్టేషన్కు రాకుండా డైవర్ట్ చేయొచ్చు. అప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లేలా  సరికొత్త రైళ్లను  కేటాయించే అవకాశం కేంద్రానికి ఉంటుంది. అందుకే రైల్వే డిపార్ట్మెంట్  ఈ సాటిలైట్ స్టేషన్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget