అన్వేషించండి

UP Police Panchang: అమావాస్యకు అలర్ట్‌గా ఉండాలన్న యూపీ డీజీపీ

UP Police Panchang: అమావాస్యకు అలర్ట్‌గా ఉండాలన్న యూపీ డీజీపీ. రాష్ట్రంలో ఎక్కువగా నేర ఘటనలు అమావాస్యకు వారం రోజుల ముందు జరుగుతున్నాయని డీజీపీ తెలిపారు.

UP Police Panchang: పౌర్ణమి, అమావాస్య, తిథులు, మంచి రోజులు అని సాధారణంగా ఏదైనా శుభకార్యాలకు చూస్తుంటాము. లేదా ఏదైనా మంచి పనులు ప్రారంభించడానికి పంచాంగం చూస్తుంటాము. అయితే ఉత్తరప్రదేశ్‌ లో మాత్రం పోలీసులు కూడా అమావాస్య, పౌర్ణమిలను చూసుకోవాలట. క్రైం కంట్రోల్‌కు పోలీసులకు పంచాంగం సహాయపడుతుందట. అదేంటి దొంగలను పట్టుకోవడానికి, కేసులను ఛేదించడానికి అమావాస్యతో ఏం సంబంధం ఉంటుందనుకుంటున్నారా.. సంబంధం ఉంటుందంట, ఆ విషయాన్ని స్వయంగా యూపీ డీజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ విషయంపై ఆయన సర్క్యులర్‌ కూడా జారీ చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లో క్రైమ్‌ రికార్డ్స్‌ను, క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్కింగ్‌ సిస్టమ్స్‌ను పరిశీలించాలని, అమావాస్య రోజులలో, ఆ తర్వాత వారం రోజుల్లో జరిగిన క్రైమ్స్‌పై స్టడీ చేయాలని రాష్ట్రంలో అన్ని జిల్లాల పోలీసు అధికారులకు యూపీ డీజీపీ విజయ్‌కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ స్టడీ ద్వారా ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ను నిర్మూలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.  

రాష్ట్రంలో ఎక్కువగా నేర ఘటనలు అమావాస్యకు వారం రోజుల ముందు జరుగుతున్నాయని డీజీపీ తెలిపారు. కృష్ణ పక్షంలో చంద్రుడి వెలుతురు లేని సమయంలో ఘటనలు ఎక్కువగా ఉంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమావాస్య తర్వాత వారం రోజుల వరకు కూడా క్రైమ్స్‌ ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. కాబట్టి ప్రతి నెల ఈ సమయంలో పోలీసులు మరింత అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. అలాగే వీటిపై ప్రతి నెలా రివ్యూ చేయాలని చెప్పారు.

డీజీపీ పోలీసులకు అందించిన రిపోర్ట్‌ ప్రకారం.. ఆగస్టు 1 న పౌర్ణమి ఉందని దీని వల్ల సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 2 న ఉదయం 6 గంటల వరకు చంద్రుడి వెలుగు ఉంటుందని దీని వల్ల క్రిమినల్స్‌ బయట తిరగడంలో ఇబ్బంది ఉంటుందని పేర్కొన్నారు. తర్వాత ఆగస్టు 16 న అమావాస్య ఉందని, రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 వరకు చీకటిగా ఉంటుందని దీన్ని క్రిమినల్స్‌ మంచిగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. బాగా చీకటిగా ఉన్న సమయంలో దొంగతనాలు, నేరాలు చేయడానికి అనువుగా భావిస్తున్నట్లు అన్నారు.  

అలాగే ఆయన తర్వాత రాబోయే అమావాస్య రోజులను కూడా గుర్తు చేసి ఆ రోజుల్లో పోలీసులు అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. సెప్టెంబరు 14 న, ఆ తర్వాత అక్టోబరు 14 న అమావాస్య వస్తుందని చెప్పారు. అమావాస్యకు వారం ముందు, వారం తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ఈ సర్క్యులర్‌ పోలీసులకు మాత్రమే కాదని, సాధారణ ప్రజలు కూడా అని చెప్పారు. ప్రజలు కూడా అమావాస్య సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని, దొంగల భయం ఆ రోజుల్లో ఎక్కువగా ఉందని అన్నారు. పెట్రోలింగ్‌ నిరంతరంగా జరుగుతుంటే నేరాలు అరికట్టవచ్చని డీజీపీ వెల్లడించారు.

పలు క్రైమ్‌ గ్యాంగ్స్‌ కూడా అమావాస్య రోజుల్లోనే దాడులు చేస్తున్నాయని హెచ్చరించారు. కొన్ని గ్యాంగ్స్‌ వాళ్లు అమావాస్య ముందు నేరాలు చేసి తర్వాత తమ దైవానికి జంతువులను బలి ఇస్తున్నాయని తెలిపారు. పార్డి, బవారియా లాంటి దాడులు చేసే గ్యాంగ్‌లు కూడా అమావాస్య రోజునే ఎంచుకుంటున్నాయని స్పష్టంచేశారు. వీళ్లు పౌర్ణమి రోజుల్లో దాక్కొని ఉండి, అమావాస్య సమయాల్లోనే బయటకు వస్తారని చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget