అన్వేషించండి

TPCC: టీఆర్ఎస్ గూండాళ్లాగా పోలీసులు.. జంగ్ సైరన్ భగ్నం చేయాలని కుట్ర.. మధు యాష్కీ ఆరోపణ

శాంతియుతంగా తాము చేపట్టనున్న పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ గుండాల్లాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యాల కోసం శాంతియుతంగా జంగ్ సైరన్ ప్రారంభించామని మధు యాష్కీ తెలిపారు. దీనిలో భాగంగా ఈరోజు దిల్‌సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. శాంతియుతంగా తాము చేపట్టనున్న పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని మధు యాష్కీ ఆరోపించారు. మొన్న ఓయూలో కోట శ్రీనును.. ఈరోజు ఎల్బీ నగర్‌లో కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి తదితరులను అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులు టీఆర్ఎస్ గుండాల్లాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అరెస్టులు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Also Read: అధిక వడ్డీ పేరుతో కుచ్చుటోపీ.. రూ.50 కోట్ల వరకు వసూలు.. జగిత్యాలలో ఓ వ్యాపారి మోసం..

ఉద్యోగాల పేరిట మోసం..
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్‌లు ఉద్యోగాల పేరుతో విద్యార్థి, నిరుద్యోగులను మోసం చేశాయని మధు యాష్కీ ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్న యువత నేడు మళ్లీ ఉద్యోగాల కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ నియంత పోకడలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. దొరల పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. నేడు తాము నిర్వహించనున్న యాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పాదయాత్ర శాంతియుతంగా జరిగే విధంగా సహకరించాలని పోలీసులను కోరారు. 

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్... కీలక బిల్లుకు శాసనసభ ఆమోదం

2 లక్షల ఖాళీలను భర్తీ చేయాలి: మల్లు రవి
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండు కళ్లు లాంటి వారని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. వారి ఆశయాలను, సిద్ధాంతాలను దేశ, రాష్ట్ర పాలకులు అనుసరించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని తెలిపారు. శాంతియుత నిరసనను అణచివేయడం తగదని అన్నారు. అహింస పోరాటాన్ని అణచివేస్తే హింసాయుత పోరాటానికి దారి తీస్తుందని హెచ్చరించారు. యాత్రకు మొన్నటి వరకు పర్మిషన్ ఇచ్చామని చెప్పి.. ఇప్పుడు అరెస్టులు చేయడం ఏంటని నిలదీశారు. ఇలాంటి విపరీత పోకడలకు పోతే భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు. నేడు మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్బంగా  టీపీసీసీ నేతలు వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అజ్మత్ హుసేన్ కన్వీనర్, నేరేళ్ల శారద, బాల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్ న్యూస్.. పండగ చేసుకుంటున్న సిబ్బంది?

Also Read: వరంగల్ నుంచి త్వరలో విమాన సర్వీసులు... అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రానికి కేంద్ర పౌరవిమానయానశాఖ లేఖ... 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget