Breaking News: దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. హాజరైన కాంగ్రెస్ కీలక నేత భట్టి విక్రమార్క
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. హాజరైన భట్టి
దళితబంధు పథకం అమలుపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఓ సమీక్షా సమావేశం జరుగుతోంది. హుజూరాబాద్తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు హాజరయ్యారు.
వారంలో భక్తులందరికీ శ్రీవారి సర్వ దర్శన అవకాశం
మరో వారం రోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్ లైన్ బుకింగ్ ద్వారా సర్వ దర్శనానికి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శనం టోకెన్లను ఆన్ లైన్లో విడుదల చేస్తామని అన్నారు. టోకెన్ల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు చెప్పారు. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే సమయంలో ఆ టోకన్లు అయిపోయాయని, భక్తులు ఆందోళనకు దిగడం, లాఠీచార్జి వంటి పరిణామాలు జరగడం బాధాకరమని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.





















