అన్వేషించండి

Telangana News: యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయ విచారణ - విద్యుత్ రంగంపై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణలో విద్యుత్ పై జ్యుడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశించారు.

CM Revanth Reddy Ordered Judicial Enqury on Yadadri Project: తెలంగాణలో (Telangana) విద్యుత్ రంగానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాదాద్రి ప్రాజెక్టుతో (Yadadri Project) పాటు ఛత్తీస్ గఢ్ (Chattishgarh) తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపైనా సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు. విద్యుత్ రంగంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య శాసనసభలో వాడీ వేడీ చర్చ సందర్భంగా, తనపై వస్తోన్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సభాపతిని కోరారు. ఈ క్రమంలో సీఎం రేవంత్, జగదీష్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 

'రూ.వేల కోట్ల అవినీతి'

భద్రాద్రి ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించి 8 ఏళ్లైనా పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. 'ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉంది. టెండర్లు లేకుండానే ఒప్పందం జరిగింది. ఆనాడు మేము దీనిపై పోరాడితే మార్షల్స్ తో సభ నుంచి బయటకు పంపారు. 1000 మెగా వాట్ల ఒప్పందం వల్ల ప్రభుత్వంపై రూ.1,362 కోట్ల భారం పడింది. ఆ ఒప్పందాల వెనుక ఉద్దేశాలు బయటకు రావాలి. భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారు. ఒప్పందాల వల్ల ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చారు. దీనిపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం.' అని రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

24 గంటల విద్యుత్ పై కమిటీ

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ విషయంలో సాధించింది గుండుసున్నా అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయ విద్యుత్ అనే ప్రజల సెంటిమెంట్ ఆధారంగా ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. 24 గంటల విద్యుత్ పై అఖిలపక్షంతో నిజ నిర్దారణ కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. అప్పట్లో ఛత్తీస్ గఢ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెబితే సదరు ఉద్యోగి హోదా తగ్గించి మారుమూల ప్రాంతాలకు పంపారని అన్నారు. 'ఆనాటి ప్రభుత్వం ఏనాడూ సభ ముందు వాస్తవాలు బయటపెట్టలేదు. మేము విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను ప్రజలు ముందుంచాం. మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సవాల్ మేరకు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాం. అప్పుడు మంత్రులుగా ఉన్న వారిని చేరుస్తాం. విచారణలో మీ ఉద్దేశాలేంటో తేలుతాయి. ఇప్పటివరకూ కొత్త ప్రాజెక్టు కట్టలేదు. 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ అబద్ధాలు చెప్తున్నారు. సభలో దబాయిస్తూ ఇంకెంత కాలం గడుపుతారు.?' అంటూ సీఎం నిలదీశారు.

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు

అటు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దైంది. సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా ఆయన శాసనసభలో చర్చలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఫ్లైట్ మిస్ కావడంతో మరో విమానం కోసం సీఎంవో ప్రయత్నించింది. కాగా, ప్రస్తుత పరిణామాలతో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం, సభలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ అలర్ట్ - మళ్లీ పెరుగుతున్న కేసులు, అధికార యంత్రాగం అప్రమత్తం

టాప్ హెడ్ లైన్స్

Eng Playing XI Vs Ind in Manchester T20: ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ
ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై రగడ..బీసీసీఐ క్లారిటీ ఇదే!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై రగడ..బీసీసీఐ క్లారిటీ ఇదే!
ABP Desam Top 10, 3 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 3 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget