అన్వేషించండి

Chandrababu Naidu: నా కోసం, మీ కోసం 100 రోజులు పని చేయండి - ప్రజలకు చంద్రబాబు పిలుపు

Chittoor News: చిత్తూరు జిల్లాలో  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

TDP Chief Chandrababu Naidu Comments: చిత్తూరు (Chittoor) జిల్లాలో  తెలుగుదేశం పార్టీ (TDP News) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం (Kuppam) నియోజకవర్గంలోని గుడుపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గుడుపల్లి నాకు గుండె లాంటిదన్న ఆయన, కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ భాగంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామన్నారు. నిరుద్యోగులకు నెలకు 3వేలు ఇస్తామని, యువత ఇంట్లో కూర్చుంటే మార్పు రాదన్నారు.

వంద రోజులు తన కోసం, మీ కోసం పని చేయాలని ప్రజలు, తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందన్న చంద్రబాబు, ప్రజల జీవితాలను మార్చే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటాయని హామీ ఇచ్చారు.  వైసీపీకి వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని,  ఆ పార్టీ సినిమా అయిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు చంద్రబాబు. ప్రతి ఇంటికి రెండు ఆవులు ఉంటే మంచిదని ఎప్పుడో చెప్పానన్న చంద్రబాబు, అపుడు తనను ఎగతాలి చేశారని విమర్శించారు. పాడిని పరిశ్రమగా తయారు చేసి ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తానన్నారు.

విద్యార్థులే గెలిపించారు

అంతకుముందు కర్ణాటకలోని బెంగళూరులో పర్యటించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. తొలిసారి తనను విద్యార్థులే గెలిపించాలని గుర్తు చేసుకున్నారు. విజన్‌-2020 గురించి చెప్పినప్పుడు అందరూ అవమానించారని, ఐటీ ఏర్పాటు చేస్తానన్నప్పుడు హేళన చేశారని గుర్తు చేశారు. రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ...ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్రొత్సహించానన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్న చంద్రబాబునాయుడు, విద్యార్థులందరూ ఉపాధి కల్పించేస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్‌ను పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆందోళన చేస్తున్న త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget