CM Vijay: తమిళనాడులో మళ్ళీ అమ్మ మెనూ.. రూ.1కే ఇడ్లీ , రూ.5కే భోజనం - పూర్తిగా మార్చేస్తున్న విజయ్
Tamil Nadu Amma Canteen: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అమ్మ క్యాంటీన్ల పునరుద్ధరణకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 620 క్యాంటీన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదల, నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.

CM Vijay Amma Canteen: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం సామాన్యుల ఆకలి తీర్చనుంది. దివంగత జె. జయలలిత ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మ క్యాంటీన్ల పూర్వ వైభవం కోసం ఆయన నడుం బిగించారు. రాజకీయాలకు అతీతంగా, ఆకలి విలువ తెలిసిన నేతగా విజయ్ ఈ పథకాన్ని పునరుద్ధరించాలని ఆదేశించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మళ్ళీ కనిపిస్తున్న రూపాయి ఇడ్లీ ముచ్చట!
ఒకప్పుడు నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, పేద వృద్ధులకు ఆకలి తీర్చే దేవాలయాలుగా వెలిగిన అమ్మ క్యాంటీన్లు.. గత కొన్నాళ్లుగా నిర్వహణ లోపంతో వెలవెలబోయాయి. శిథిలమైన కిచెన్ మౌలిక సదుపాయాలు, నాణ్యత లేని భోజనంపై వస్తున్న ఫిర్యాదులపై సీఎం విజయ్ సీరియస్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 620 క్యాంటీన్లను వెంటనే మరమ్మతులు చేయాలని, ఆధునిక వంట సామగ్రిని సమకూర్చాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రూపాయికే ఇడ్లీ, మూడు రూపాయలకే పెరుగన్నం, ఐదు రూపాయలకే సాంబార్ అన్నం.. మళ్ళీ అదే రుచితో ప్రజలకు అందేలా చూడాలని ఆయన పట్టుబడుతున్నారు.
ఆకలి తీర్చిన 'అమ్మ' అస్త్రం..
2013లో జయలలిత ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం. కేవలం తక్కువ ధరకు భోజనం పెట్టడమే కాకుండా, పోషకాహార లోపాన్ని తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. కోవిడ్ మహమ్మారి సమయంలో వేలాది మంది వలస కూలీల ప్రాణాలను కాపాడింది ఈ అమ్మ క్యాంటీన్లే. ఆటో డ్రైవర్ల నుంచి ఆఫీసులకు వెళ్లే సామాన్యుల వరకు అందరికీ ఇవి ఇష్టమైన అడ్డాలుగా మారాయి. అయితే రాజకీయ కారణాల వల్ల మధ్యలో నిధుల కొరత ఏర్పడి, ఈ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన నెలకొంది.
The name board of the Amma Unavagam was covered up.
— முத்து (@muthuhere3) May 22, 2026
Near the central bus stand in Udhagamandalam, TVK cadres allegedly covered and concealed the word “Amma” written on the name board of the Amma Unavagam.
pic.twitter.com/uca9v32Gwh
రాజకీయాలకు అతీతంగా విజయ్ అడుగు..
సాధారణంగా కొత్తగా వచ్చే ప్రభుత్వాలు పాత ప్రభుత్వం పేరున్న పథకాలను అటకెక్కిస్తాయి. కానీ, విజయ్ మాత్రం ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించారు. గత డీఎంకే ప్రభుత్వం వీటిని కొనసాగించినప్పటికీ, నిర్వహణలో అలసత్వం వహించిందని అన్నాడీఎంకే ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు విజయ్ ఈ ప్రాజెక్టును తన భుజస్కంధాలపైకి తీసుకోవడం ద్వారా, తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించే ద్రవిడ సంక్షేమ నమూనా'ను కాపాడాలని నిర్ణయించుకున్నారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 383 సెంటర్లతో సహా అన్ని జిల్లాల్లోని క్యాంటీన్లకు నిధుల విడుదల సులభతరం చేశారు.
సామాన్యుడి 'ఫుడ్ కల్చర్'కు పునర్జీవం..
ఇది కేవలం ఒక భోజన పథకం మాత్రమే కాదు, తమిళనాడు జీవనశైలిలో ఒక భాగం. హోటళ్లలో టిఫిన్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేటి కాలంలో, రూపాయి ఇడ్లీ అనేది ఒక కలలా అనిపిస్తుంది. కానీ, ఆ కలను నిజం చేస్తూ, పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన వేడి వేడి భోజనాన్ని అందించడానికి యంత్రాంగం సిద్ధమైంది. కిచెన్ అప్గ్రేడ్, కొత్త నీటి ఫిల్టర్లు, సరిపడా పాత్రలను సమకూర్చడం ద్వారా అమ్మ క్యాంటీన్లు మళ్ళీ పాత కళను సంతరించుకోనున్నాయి. ఆకలి లేని తమిళనాడు లక్ష్యంగా విజయ్ వేస్తున్న ఈ అడుగు సామాన్యుడికి పెద్ద ఊరట.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు





















