అన్వేషించండి

Tamil Nadu Politics: అన్నాడీఎంకే బీజేపీ కూటమికి బీటలు, తమిళనాడులో పొలిటికల్ హీట్

Tamil Nadu Politics: అన్నాడీఎంకే బీజేపీ మధ్య దూరం, వైరం పెరుగుతూ వస్తున్నాయి.

 Tamil Nadu Politics:

ఉప్పు నిప్పులా..

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. AIDMK,BJP కూటమి చీలిపోతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలంతా AIDMKకి వరుస కడుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య వివాదం ముదిరింది. పొత్తు ధర్మాన్ని మరిచిపోయి ఏఐడీఎమ్‌కే కుట్ర చేస్తోందంటూ  బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. పళని స్వామి దిష్టిబొమ్మల్ని తగల బెడుతూ నిరసన వ్యక్తం చేస్తోంది. గత వారం ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదురుతూ వస్తోంది. వీరిలో బీజేపీ ఐటీ వింగ్ చీఫ్ సీఆర్‌టీ నిర్మల్ కుమార్ కూడా ఉండటం కలకలం రేపింది. ఆ తరవాత ఒకేసారి 13 మంది బీజేపీ నేతలు పార్టీ వీడటం రాజకీయాలను మరో మలుపు తిప్పింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై..డీఎంకేతో అంటకాగుతున్నారని ఆరోపిస్తున్నారు బయటకొచ్చిన నేతలు. 2019లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాయి. దాదాపు మూడు ఎన్నికల్లో కలిసే పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఇటీవల జరిగిన ఓ ఉప ఎన్నికలోనూ AIDMK ఓడిపోయింది. అప్పటికే రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఆ ఉప ఎన్నిక ప్రచారంలో కలిసి ప్రచారం కూడా చేయలేదు. బీజేపీ కారణంగానే తాము ఓడిపోతున్నామని అన్నా డీఎంకే భావిస్తోంది. క్యాడర్ లేని పార్టీతో పొత్తు ఎందుకు అన్న పునరాలోచనలో పడింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తమిళనాడు పర్యటనకు వచ్చారు. అప్పుడు కూడా అన్నా డీఎంకే చీఫ్ పళని స్వామి అమిత్‌షాను కలిసేందుకు వెళ్లలేదు. కలిసే అవసరం తనకు లేదంటూ బహిరంగంగానే అన్నారు. 

వాదోపవాదాలు..

ప్రస్తుత పరిణామాలపై స్పందించిన బీజేపీ చీఫ్ అన్నమలై అన్నా డీఎంకే భయపడుతోందని విమర్శించారు. ప్రస్తుతం తమ పార్టీ క్యాడర్ పెరుగుతోందనటానికి ఇదే నిదర్శనం అని తేల్చి చెప్పారు. జయలలిత, కరుణానిధి మాదిరిగానే తానూ ఓ లీడర్‌నని, మేనేజర్‌ను కాదని తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు అన్నమలై. అసలు రాష్ట్రంలో పెద్దగా క్యాడర్ లేని  పార్టీ నేతల్ని మేమెందుకు లాగేసుకుంటాం అంటూ అన్నాడీఎంకే సెటైర్లు వేస్తోంది. అసలు ఈ వివాదం అంతా మొదలవ్వడానికి కారణం బీజేపీయే అన్న వాదన వినిపిస్తోంది. 234 సీట్లున్న తమిళనాడులో బీజేపీకి ఉన్నది నాలుగు స్థానాలు మాత్రమే. కానీ...అన్నాడీఎంకేను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్టుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇది కాస్తా AIDMKకి అసహనం పెంచింది. అప్పటి నుంచి క్రమంగా బీజేపీకి దూరం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ నేతలంగా అన్నాడీఎంకేలో చేరుతుండటం పొలిటికల్ హీట్‌ను మరో స్థాయికి చేర్చింది. ఇప్పటికే పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య అన్నాడీఎంకే పగ్గాలపై చాన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఇద్దరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతుండటం మరో సంచలనమైంది. 

Also Read: భారత్ చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే అమెరికా జోక్యం తప్పదు - యూఎస్ ఇంటిలిజెన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget