అన్వేషించండి

Surpreme Court: యూపీలో కాలుష్యానికి పాకిస్తాన్ గాలే కారణం... సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వం వాదనలు... పాక్ పరిశ్రమల్ని మూసివేయాలా ధర్మాసనం ప్రశ్న

దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పాక్ గాలే కాలుష్యానికి కారణమని యూపీ తరఫున వాదిస్తున్న న్యాయవాది అనగా పాక్ లోని పరిశ్రమలు మూసివేయాలా అని సుప్రీం ప్రశ్నించింది.

దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రానికి బాధ్యత అంటూ దిల్లీ ప్రభుత్వం, దిల్లీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలేదని కేంద్రం నిందించుకోవడం సుప్రీంకోర్టులో తరచుగా జరుగుతుంది. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో రైతులు పంట మేడులు తగలబెట్టడం వల్లే కాలుష్యం పెరిగిపోతుందని దిల్లీ ప్రభుత్వం తప్పుబడుతుంది. ఇదే విధంగా సుప్రీంకోర్టులో శుక్రవారం ఓ పిటిషన్ విచారణ సమయంలో ఉత్తరప్రదేశ్ న్యాయవాది యూపీలో పరిశ్రమల మూసివేత సరికాదని, కాలుష్యానికి పాకిస్తాన్ నుంచి వీస్తున్న గాలే కారణమని తప్పుబట్టారు. 

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్... సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూద్, జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. యూపీలో పరిశ్రమలు మూతపడితే రాష్ట్రంలోని చెరకు, పాల పరిశ్రమలపై ప్రభావం పడుతుందని వాదించారు. చెరకు వ్యాపారంలోని వివిధ అంశాలను వివరించారు. పరిశ్రమల మూసివేత పెద్ద సమస్యకు దారిస్తుందని ధర్మాసనం ముందు న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.

Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!

"పరిశ్రమల మూసివేత చెరకు పరిశ్రమలపై ప్రభావం చూపవచ్చు. ఉత్తరప్రదేశ్ వైపు వీచే గాలి ఎక్కువగా పాకిస్తాన్ నుంచి వస్తోంది" అని న్యాయవాది రంజిత్ కుమార్ అన్నారు.

దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బదులిస్తూ.. ‘‘అయితే పాకిస్థాన్‌లో పరిశ్రమలను నిషేధించాలనుకుంటున్నారా? చక్కెర మిల్లులు మూతపడితే రైతులు నష్టపోతారని కుమార్‌ అన్నారు. ప్రభుత్వం కమిషన్‌ను ఆశ్రయించవచ్చని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం కమిషన్ ముందు ఫిర్యాదును లేవనెత్తడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది.

Also Read: Cyclone Jawad: తరుముకొస్తోన్న జవాద్ తుపాను.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

పిటిషనర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూడాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూమి అందుబాటులో ఉందని, అక్కడ విద్యుత్తు ఉత్పత్తికి సౌర ఫలకాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన తెలిపారు. పునరుత్పాదక ఇంధనం అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే కేంద్రానికి చెప్పామని ధర్మాసనం పేర్కొంది. సోలార్ ప్యానెల్స్ పవర్ ప్లాంట్‌లను భర్తీ చేయగలవని సింగ్ వాదించారు.

ఈ వ్యాజ్యంలో విచారణను ముగిస్తూ... కేంద్ర ప్రభుత్వం, GNCTDకి ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంపై పెండింగ్‌లో పెడుతూ వచ్చే శుక్రవారానికి లిస్ట్ చేసింది. దిల్లీలో తీవ్ర వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 17 ఏళ్ల దిల్లీ విద్యార్థి ఆదిత్య దూబే వేసిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. 

Also Read: Cyclone Jawad: 'జవాద్' ధాటికి ఒడిశా, ఉత్తరాంధ్రలో హైఅలర్ట్.. రంగంలోకి భారత నేవీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
NTRNeel Project: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Maha Kumbh: ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో  పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
Embed widget