అన్వేషించండి

KRMB GRMB Gazette Notification: గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల సూచన... హాజరు కాని తెలంగాణ

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కార్యాచరణకు శ్రీకారం చుడదామని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సూచించగా, అందులో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని, అవి జరిగాక ముందడుగు వేద్దామని ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయపడింది.

బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించడంతో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు నిర్వహించిన సమన్వయ కమిటీల సమావేశానికి తెలంగాణ నుంచి ప్రతినిధి హాజరుకాలేదు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు... నిర్ణీత గడువులోగా సిబ్బంది, ప్రాజెక్టుల వివరాలు, నిధులు, కేంద్ర బలగాల నియామకం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు అందజేయాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఈ సమావేశంలో కోరాయి. అయితే నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులోని ప్రాజెక్టులపై కొన్ని అభ్యంతరాలున్నాయని,  ఇందుకు సంబంధించి కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాస్తామని ఆంధ్రప్రదేశ్‌ సమాధానమిచ్చింది. ఏయే అంశాల్లో, ప్రాజెక్టుల్లో మార్పులు చేయాలని కోరుకుంటున్నారని బోర్డు అధికారులు ప్రశ్నించగా, వివరాలను ప్రస్తుతం చెప్పలేమని, ఉన్నతాధికారులు, న్యాయబృందం, ముఖ్యమంత్రితో చర్చించాకే కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాస్తామని తెలిపారు. అయితే సమన్వయ కమిటీ సమావేశం కంటే ముందు పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణాబోర్డుని  తెలంగాణ లేఖ రాసింది. స్పందించిన బోర్డు  సమన్వయ కమిటీ సమావేశం తర్వాత  నిర్వహిస్తామని సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ తెలంగాణ నుంచి ఎవరూ హాజరుకాలేదు.


KRMB GRMB Gazette Notification: గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల సూచన... హాజరు కాని తెలంగాణ

బోర్డు కార్యాలయాలతోపాటు తెలంగాణ నీటిపారుదల, పరిపాలనా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ల కార్యాలయాలు కూడా జలసౌధ భవనంలోనే ఉన్నాయి. చివరికి రెండు బోర్డులు ఆంధ్రప్రదేశ్‌ అధికారులతోనే చర్చించాయి. ఆగస్టు 15లోగా ప్రాజెక్టుల వారీగా సిబ్బందికి సంబంధించిన వివరాలు అందజేయాలని, నెలలోగా ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌మనీ డిపాజిట్‌ చేయడం గురించి  నిర్ణయం చెప్పాలని బోర్డు అధికారులు కోరారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ను తాము స్వాగతించినా కొన్ని మార్పులు చేయాలని కోరనున్నామని,  ఇవి జరిగిన తర్వాత కార్యాచరణపై ముందుకు వెళ్దామని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది.

సవరణలు వచ్చే వరకు ప్రస్తుత గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులో ఉన్నట్లే కనుక, అప్పటివరకు దీని ప్రకారమే ముందుకెళ్దామని బోర్డు అధికారులు సూచించారు. అయితే ‘బోర్డుల పరిధి గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం ఏడేళ్లు ఎదురుచూశాం, ఇందులో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి సవరణలు చేయాల్సి ఉంది, ఇది జరిగాక పూర్తి స్థాయిలో అమలు చేస్తే సరిపోతుంది’ అని ఏపీ చెప్పినట్లు సమాచారం. సమన్వయ కమిటీకి ఆంధ్రప్రదేశ్‌ తరఫున నోడల్‌ అధికారిగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డిని నియమిస్తున్నట్లు రెండు బోర్డులకు సమాచారమిచ్చింది.

ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి అనుగుణంగా బోర్డులు కోరిన సమాచారం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఇ.ఎన్‌.సి.) నారాయణరెడ్డి తెలిపారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో కొన్ని అంశాల్లో అభ్యంతరాలున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పామన్నారు. తెలంగాణ నుంచి సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో తెలియదని, తాము మాత్రం నిబంధనలు, నియమాలను గౌరవిస్తామని తెలిపారు. గోదావరిలో ఎలాంటి సమస్యలు లేవు కదా బోర్డు పరిధిలోకి ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందన్నారు.

2004లో వాప్కోస్‌ అధ్యయనం ప్రకారం గోదావరిలో 1430 టీఎంసీల నీటి లభ్యత ఉంటే , వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కింద తెలంగాణలో 1355 టీఎంసీల నీటి వినియోగం జరగనుందన్నారు. దీనివల్ల దిగువన ఉన్న గోదావరి డెల్టా, పోలవరం లాంటి ప్రాజెక్టులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అందరూ వాడుకోగా మిగిలినవే దిగువకు వస్తాయని, సముద్రానికి పోయే నీటిని తాము మళ్లించుకోవడం తప్పుకాదు కదా? అని ప్రశ్నించారు. సముద్రంలోకి పోయినా ఫర్వాలేదు, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోవద్దని తెలంగాణ అంటోందన్నారు. గోదావరి నుంచి మళ్లించే 45 టీఎంసీలలో తెలంగాణ వాటా గురించి ప్రశ్నించగా, తెలంగాణ కూడా గోదావరి నుంచి కృష్ణాలోకి 212 టీఎంసీలు మళ్లిస్తోందన్నారు. 

ఈ సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి బి.పి.పాండే, సభ్యులు కుట్యాల, వెంకటసుబ్బయ్య, కృష్ణా నదీ యాజమాన్యబోర్డు కార్యదర్శి డి.ఎం.రాయిపురే, సభ్యులు ఎల్‌.బి.ముతుంగ్‌, ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, పరిపాలనా విభాగం ఇ.ఎన్‌.సి. సతీష్‌కుమార్‌, జెన్‌కో ఎండీ శ్రీధర్‌, అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం ప్రత్యేక అధికారి వీరశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget