అన్వేషించండి

UK-China Relations: చైనాతో కుస్తీ, భారత్‌తో దోస్తీ- బ్రిటన్ విదేశాంగ విధానం ప్రకటించిన రిషి

UK-China Relations: బ్రిటన్ ప్రధాని రిషి సునక్.. చైనాకు పెద్ద షాక్ ఇచ్చారు .

UK-China Relations: చైనాపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌- చైనా మధ్య స్వర్ణ యుగంగా పిలిచిన ఆ నాటి సంబంధాలు ఇక ముగిశాయన్నారు. యూకే విలువలు, ఆసక్తులపై చైనా వ్యవస్థాగత సవాలు విసరుతోందని రిషి మండిపడ్డారు. చైనాలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని విమర్శించారు.లండన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో తొలిసారి విదేశాంగ విధానంపై రిషి ప్రసంగించారు.

" మాజీ ప్రధాని డేవిడ్‌ కెమెరూన్‌ కాలంలో స్వర్ణయుగంగా పిలిచిన బ్రిటన్‌, చైనా మధ్య ఆనాటి సంబంధాలు ఇక ముగిశాయి. మన విలువలు, ఆసక్తులకు వ‍్యతిరేకంగా చైనా వ్యవస్థాగత సవాలు విసురుతుందని మేము గుర్తించాం. ఇది నిరంకుశత్వం వైపు మళ్లుతోంది.                                           "
-రిషి సునక్, బ్రిటన్ ప్రధాని

కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్ట్‌ను చైనా పోలీసులు అరెస్ట్‌ చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ రిషి సునక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ విషయాల్లో చైనా అందించిన ప్రాముఖ్యతను మరచిపోలేదని రిషి అన్నారు. 

భారత్‌తో దోస్తీ

మరోవైపు భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి తమ దేశం కట్టుబడి ఉందని రిషి సునాక్‌ తెలిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తమ నిర్ణయం ఉండనున్నట్లు పేర్కొన్నారు.

" భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాం. స్వేచ్ఛా, పారదర్శకతల్లో బ్రిటన్‌ విధానాలను మేము అనుసరిస్తాం. నేను రాజకీయాల్లోకి రాక ముందు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టాను. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. 2050 చివరి నాటికి ఈ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో సగం విలువ కలిగి ఉంటుంది. అందుకే యూకే ట్రాన్స్‌ పసిఫిక్‌ ఒప్పందం, సీపీటీపీపీల్లో చేరింది. భారత్‌, ఇండోనేసియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకొనే అంశాన్ని పరిశీలిస్తోంది.                                           "
-రిషి సునక్, బ్రిటన్ ప్రధాని

గుడ్‌న్యూస్

ఇటీవల జీ20 సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. ఇది జరిగిన తర్వాత భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. యూకే రావాలనుకునే భారత యువ నిపుణులకు ఏటా 3 వేల వీసాలు అందిస్తామని బ్రిటన్ తెలిపింది.

ఈ సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద భారత్‌కు చెందిన 18-30 ఏళ్ల డిగ్రీ విద్యావంతులకు ఏటా 3 వేల వీసాలు అందజేయనుంది బ్రిటన్ ప్రభుత్వం. ఈ వీసా ద్వారా యూకేకు వచ్చి రెండేళ్ల వరకు చదువుకోవడం, ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది.

Also Read: Monkeypox New Name: 'మంకీపాక్స్' పేరు మార్చిన WHO- ఇక ఇలానే పిలవాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.