అన్వేషించండి

Revanth Reddy: దావోస్‌లో నేడు దిగ్గజ కంపెనీల సీఈవోలతో రేవంత్‌రెడ్డి భేటీ- ఐటీ, డేటాసెంటర్లు పెట్టుబడుల కోసం చర్చలు

Revanth Davos Tour: దావోస్‌లో జరుగుతున్న పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం హాజరైంది. రెండోరోజు భారీ సంస్థల సీఈవోలతో భేటీకానుంది. సదస్సులు, సమావేశాల్లో పాల్గొననుంది.

World Economic Form: స్విట్లర్లాండ్‌లోని దావోస్‌(Davos)లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55 వ వార్షికోత్సవ సదస్సుకు విశేష స్పందన లభించింది. తొలిరోజు సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు తరలివచ్చారు. వారిని ఆకర్షించేందుకు దేశాల ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు తరలివచ్చారు. మూడురోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఈసారి ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటిలిజెంట్ ఏజ్' అనే థీమ్‌ను వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (World Economic Form)ఎంచుకుంది. శాస్త్ర సాంకేతిక ఆధునాతన పరిజ్ఞానానకిి అనుగుణంగా  పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో  రౌండ్‌టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తోంది.
  ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,రాష్ట్రాల ప్రతినిధులతోపాటు పరిశ్రమలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు 3 వేల మంది ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. తొలిరోజు సమావేశానికి హాజరైన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు  రెండోరోజు కూడా వివిధ సదస్సులు, సమావేశాల్లో పాల్గొననున్నారు. 

ప్రోత్సహకాలపై ప్రముఖ కంపెనీలు ఆసక్తి
 
 తెలంగాణ(Telangana)లో ఇటీవలే అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ,పునరుత్పాదక ఇంధనంం, పంప్డ్‌స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తికి  రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ అందిస్తున్న ప్రోత్సహకాలపై ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ సాయం, రాయితీలపై బేరీజు వేసుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.అలా ముందుకు వచ్చిన ఆయా సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరుపుతోంది. ఇంధన ఉత్పత్తితోపాటు  హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న  ఫోర్త్‌సిటి, ఏఐ ఆధారిత ఐటీ సేవల విస్తరణపై వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అత్యాధునిక డేటా సెంటర్ల  ఏర్పాటుకు  పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి. రెండోరోజు పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం సమావేశం కానుంది. అమెజాన్‌, యూనీలివర్‌, స్కైరూట్‌ ఏరోస్పేస్‌, సిఫీ టెక్నాలజీస్‌ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

పారిశ్రామికవేత్తలతో రేవంత్‌రెడ్డి సమావేశం

  సీఐఐ(CII) సారథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశంకానున్నారు. ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి బృందం ప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటోంది. గతేడాది దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం రూ. 40,232 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి. మొత్తం 14 సంస్థలు ముందుకురాగా...18 ప్రాజెక్ట్‌లకు ఒప్పందాలు జరిగాయి. వాటిల్లోఇప్పటికే 17 ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి.  ఆకర్షించగా...ఈసారి అంతకన్నా ఎక్కువే  పెట్టుబడులు  వస్తాయని భావిస్తున్నారు. ఫోర్త్‌సిటీపై ప్రత్యేకంగా దృష్టిసారిచిన సీఎం రేవంత్‌రెడ్డి...అక్కడికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Manifestos of Tamil parties: ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?
ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?
Iran War 2026: 'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
Social Media Addiction: సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్‌! కాలిఫోర్నియా జ్యూరీ సంచలన నిర్ణయం! బాధితురాలికి భారీ పరిహారం!
సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్‌! కాలిఫోర్నియా జ్యూరీ సంచలన నిర్ణయం! బాధితురాలికి భారీ పరిహారం!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Architecture Temples : విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
Ram Charan : పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
Iran War 2026: 'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
Embed widget